Ganja: ఒకప్పుడు విశాఖ అంటే పోర్ట్ సిటీ, స్టీల్ సిటీ కానీ ఇప్పుడు ఏమవుతుందో తెలుసా…?
గత కొన్ని దశాబ్దాలుగా విశాఖపట్నం నగరం 'సిటీ ఆఫ్ డెస్టినీ', 'పోర్ట్ సిటీ, 'స్టీల్ సిటీ' వంటి పేర్లతో ఎన్నో ఘనతలను సంపాదించుకుంది.
- By Hashtag U Published Date - 04:31 PM, Wed - 10 November 21
గత కొన్ని దశాబ్దాలుగా విశాఖపట్నం నగరం ‘సిటీ ఆఫ్ డెస్టినీ’, ‘పోర్ట్ సిటీ, ‘స్టీల్ సిటీ’ వంటి పేర్లతో ఎన్నో ఘనతలను సంపాదించుకుంది.ఈ నగరం మంచి వాతావరణం, ప్రశాంతమైన బీచ్లు, శాంతియుత సామాజిక ఫాబ్రిక్, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, విద్యా సంస్థలు మరియు కాస్మోపాలిటన్ సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. కానీ ప్రస్తుతం విశాఖ అంటే ఇవన్నీ పోయి కొత్తగా గంజాయి హాబ్ అనే ముద్ర పడింది. విశాఖ ఏజెన్నీలో గంజాయి సాగు విచ్చలవిడిగా సాగుతుందని గత కొద్ది రోజులుగా పోలీసులు చేస్తున్న దాడుల్లో బయటపడిన నిజం.
జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంగా పేరొందిన తూర్పు కనుమల దట్టమైన అటవీ ప్రాంతం పరిధిలోని 11 మండలాల్లో దాదాపు తొమ్మిది మండలాల్లో గంజాయి సాగు చేస్తున్నారు. పసుపు, అల్లం, రాజ్మా మరియు మినుములు వంటి సాంప్రదాయ పంటలు ఈ గంజాయి సాగుకు దారితీశాయి. దీని విత్తనాన్ని నాలుగు దశాబ్దాల క్రితం కేరళ, తమిళనాడు నుండి స్మగ్లర్లు విత్తారు. ఎక్సైజ్ శాఖ తాజా అంచనా ప్రకారం తొమ్మిది మండలాల్లోని 150 నుండి 200 గ్రామాల్లో 7,000 నుండి 10,000 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతోంది.
మావోయిస్టుల ఆధీనంలో ఉన్న జీకేవీధి, ముంచింగ్పుట్, పెదబయలు, చింతపల్లి, జి.మాడుగుల మండలాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) డిప్యూటీ కమిషనర్ బాబ్జీరావు తెలిపారు. ఒక ఎకరంలో సంవత్సరానికి 1 టన్ను గంజాయి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అంటే సంవత్సరానికి సగటున 7,000-10,000 టన్నుల దిగుబడి వస్తుందని దీని విలువ వందల కోట్ల రూపాయల వరకు ఉంటుందని పోలీస్ అధికారులు తెలిపారు.
Also Read : విప్లవం నీడన `గోండుల` వ్యధ
విశాఖ ఏజెన్సీలో గంజాయి వ్యాపారం, గంజాయి సాగు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. 1985 నాటి ఎన్డిపిఎస్ చట్టం అమలులోకి రాకముందే 45 సంవత్సరాల క్రితం 1973లో గంజాయి స్మగ్లింగ్పై మొదటి కేసు విశాఖలో నమోదైందని విశాఖపట్నం రేంజ్ఎ డిఐజి కె.వి. రంగారావు తెలిపారు. అయితే తాజగా విశాఖ ఏజెన్సీలో పోలీసులు గంజాయి సాగుపై ప్రత్యేక దృష్టి సారించారు.మారుమూల గ్రామాలకు సైతం వెళ్లి గంజాయి సాగు చేసిన పొలాలపై దాడులు నిర్వహించారు.అయితే ఇటీవల ఇతర రాష్ట్రాల్లో గంజయి అక్రమ రవాణాలో పట్టుబడిన స్మగ్లర్లు నుంచి ఆయా రాష్ట్రాల పోలీసులు విచారణలో విశాఖ నుంచే రవాణా జరగుతుందని తెలడంతో ఏపీ పోలీసులు సీరియస్గా దృష్టి సారించారు.
విశాఖలో సాగు చేసే గంజాయి పంటను సీలావతి రకంగా పిలుస్తారు.దీనికి దేశ వ్యాప్తంగా మార్కెట్లో అత్యధిక డిమాండ్ కలిగి ఉంది. కిలో రూ.2000 వేల చొప్పున గంజాయి సాగుదారుల నుంచి కొనుగోలు చేసినప్పటికీ అది బయట మార్కెట్ లోకి వెళ్లే సరికి రూ.7వేల నుంచి రూ.15వేల వరకు మార్కెట్ విలువ ఉంటుందని పోలీసులు అంటున్నారు. గత రెండేళ్లలో అరెస్టైయిన దాదాపు 5వేల మంది నిందితుల్లో 50 శాతం మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈబస్మగ్లింగ్ నెట్వర్క్ను తమిళనాడు, కేరళ నుండి వచ్చిన మధ్యవర్తులు సంవత్సరాల తరబడి అభివృద్ధి చేశారని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏవోబీ ప్రాంతంలో గంజాయి సాగుకు ఎటువంటి ఆటంకం కలగకుండా మావోయిస్టుల ఆధ్వర్యంలో జరుగుతుందని పోలీసులు ఆరోపిస్తున్నారు. గంజాయి వ్యాపారంతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని మావోయిస్టులు చెప్తున్నప్పటికి అది ఏజెన్సీలోని మావోయిస్టుల ప్రాంతంలో సాగు అవుతుడంటంతో వారి వాదనకు బలం చేకురడంలేదు.
Also Read : పశ్చిమ కనుమలను కాపాడుతున్న వీరవనితలు
గంజాయి వల్ల కలిగే నష్టాలను ప్రజలకు,గిరిజనులకు తెలిపేందుకు పరివర్తన అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. గంజాయి రవాణాని అరికట్టడమే కాకుండా కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం, గిరిజనులు,రైతులు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించడం జరుగుతుందని పోలీసులు తెలిపారు.
Tags
Related News
Vizag : విశాఖను వాణిజ్య రాజధానిని చేస్తా అంటూ బాబు హామీ..
విశాఖను వైసీపీ గంజాయి, డ్రగ్స్ రాజధానిగా మారిస్తే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖను వాణిజ్య రాజధానిని చేస్తామని ఉత్తరాంధ్ర ప్రజలకు చంద్రబాబు మాటిచ్చారు