HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Ex Minister Vasantha Nageswararo Meets Mp Kesineni Nani

TDP : ఆస‌క్తిగా మారిన కృష్ణాజిల్లా రాజ‌కీయం.. టీడీపీ ఎంపీతో భేటి అయిన వైసీపీ ఎమ్మెల్యే తండ్రి

మైల‌వ‌రం వైసీపీ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ తండ్రి మాజీ మంత్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావు టీడీపీ ఎంపీ కేశినేని నానిని క‌లిశారు.

  • By Prasad Published Date - 06:21 AM, Tue - 10 January 23
  • daily-hunt
vasantha Nageswararo
vasantha Nageswararo

మైల‌వ‌రం వైసీపీ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ తండ్రి మాజీ మంత్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావు టీడీపీ ఎంపీ కేశినేని నానిని క‌లిశారు. విజ‌య‌వాడ‌లోని ఎంపీ కార్యాల‌యంకి వెళ్లిన ఆయ‌న కేశినేని నానితో మాట్లాడారు. ఎంపీ కేశినేని నాని తాత కేశినేని వెంకయ్యతో తనకున్న సాన్నిహిత్యాన్నివ‌సంత నాగేశ్వ‌ర‌రావు గుర్తుచేసుకున్నారు. అనేక సామాజిక, రాజకీయ అంశాలను చర్చించడమే కాక కేశినేని నాని రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆయ‌న ప్ర‌శంసించారు. అయితే వీరిద్ద‌రు భేటిపై కృష్ణాజిల్లా రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఇటీవ‌ల కాలంలో మాజీ మంత్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావు రాజ‌ధాని అంశంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రాజధాని కోసం 32 వేల ఎకరాలు ఇచ్చిన ఘనత ప్రపంచంలో ఒక్క అమరావతి రైతులకే దక్కుతుందని మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. 29 గ్రామాల రైతులు తమ భూములను త్యాగం చేశారని, వారికి జేజేలు పలుకుతున్నట్టు చెప్పారు. ఈ వ్యాఖ్య‌లు చేసిన మ‌రుస‌టి రోజే ఆయ‌న కుమారుడు మైల‌వ‌రం వైసీపీ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ త‌న తండ్రి వ్యాఖ్య‌లు ఆయ‌న వ్య‌క్తిగ‌త‌మంటూ పార్టీకి సంబంధం లేదంటూ చెప్పుకోచ్చారు.

ఇటు జ‌గన్ కేబినెట్ విస్త‌ర‌ణ‌పై కూడా వ‌సంత నాగేశ్వ‌ర‌రావు కామెంట్స్ చేశారు. కెబినేట్ లో క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి ప్రాధన్య‌త లేక‌పోవ‌డాన్ని ఆయ‌న ప్ర‌శ్నించారు. గ‌తంలో చాలా మంది ముఖ్య‌మంత్రులు ప‌ని చేశార‌ని వారంతా క‌మ్మ‌వారికి ప్రాధాన్య‌త ఇచ్చార‌ని ఆయ‌న గుర్తు చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై కూడా వ‌సంత నాగేశ్వ‌రారావు ఘాటుగా స్పందించారు. ఎన్టీఆర్ వంటి ఓ మహనీయుడు పేరు మార్చి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఎన్టీఆర్ మహానీయుడని.. ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని కామెంట్ చేశారు. ఈ నిర్ణయం త‌న‌ను బాధకలిగించిందన్నారు.

మ‌రోవైపు మైల‌వ‌రంలో వైసీపీ నేత‌లే త‌న‌కు వెన్నుపోటుపోడుస్తున్నార‌ని వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ వ్యాఖ్య‌లు చేయ‌డంపై వైసీపీలో చ‌ర్చ జ‌రుగుతుంది. మంత్రి జోగి ర‌మేష్ మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌ను ఇబ్బంది పెడుతున్నారంటూ వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ చేసిన కామెంట్స్‌పై అధిష్టానం పిలిచి ఇద్ద‌రిని మంద‌లించింది. అయిన‌ప్ప‌టికీ వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ కాస్త అంస‌తృప్తితోనే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇటు ఆయ‌న తండ్రి చేస్తున్న వ్యాఖ్య‌లు, తాజాగా ఎంపీ కేశినేని నానిని క‌ల‌వ‌డం లాంటి ప‌రిణామాలు అన్నీ పార్టీ మార్పుకే సంకేత‌మ‌ని జిల్లా రాజ‌కీయాల్లో చర్చ జ‌రుగుతుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Mylavaram MLA
  • TDP MP kesineni nani
  • vasantha krishna prasad
  • Vasantha Nageswara rao
  • vijayawada
  • ysrcp

Related News

Ap Liquor Scam Case

ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

నిందితులు ఇప్పటికే అనేకసార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ, కోర్టు వాటిని తిరస్కరించింది. చివరికి శనివారం విచారణలో ముగ్గురికీ బెయిల్ మంజూరవ్వడం కేసులో కీలక పరిణామంగా నిలిచింది. ఈ కేసులో ధనుంజయ్ రెడ్డి ఏ31, కృష్ణమోహన్ రెడ్డి ఏ32, బాలాజీ గోవిందప్ప ఏ33 నిందితులుగా ఉన్నారు.

  • 'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

    AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

  • If you don't come to the assembly, there will be by-elections: Raghuramakrishna Raju warns Jagan

    AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

  • YSRCP's actions to tarnish the dignity of teachers are evil: Minister Lokesh

    Nara Lokesh : టీచర్ల గౌరవాన్ని దెబ్బతీసే వైసీపీ చర్యలు దుర్మార్గమైనవి : మంత్రి లోకేశ్‌

  • Vijayawada-Bengaluru flight narrowly misses major danger

    Vijayawada : విజయవాడ, బెంగళూరు విమానానికి తప్పిన పెను ప్రమాదం

Latest News

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

  • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

  • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

  • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

  • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd