Chalo Vijayawada : సెప్టెంబర్ 1న ఛలో విజయవాడ…విజయవంతం చేయాలన్న ఉద్యోగ సంఘాలు..!!
ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ల సాధనకు మరోసారి రెడీ అవుతున్నారు. CPSపై ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్యలు విఫలమయ్యాయి.
- By hashtagu Published Date - 10:20 PM, Thu - 18 August 22
ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ల సాధనకు మరోసారి రెడీ అవుతున్నారు. CPSపై ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్యలు విఫలమయ్యాయి. చర్చలకు పిలిచిన సర్కార్ పాతపాటే పాడిందని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1న నిర్వహించే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి.
CPSఎంత ప్రమాదకరమో GPSఅంతకంటే ప్రమాదమని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. GPS వద్దనే విషయాన్ని సంప్రదింపుల కమిటీకి తెలిపామన్నారు. CPSరద్దు చేసి OPSఅమలుచేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీపీఎస్ లో వచ్చిన సవరణను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. హామీ ఇచ్చిన మేరకు ఓపీఎస్ పునరుద్ధరించాలనేదే తమ డిమాండ్ అన్నారు.
Related News
Praja Rajyam party: ప్రజారాజ్యం నాశనం కావడానికి కారణం అతనే: పవన్
ప్రజారాజ్యం ... మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పార్టీ ఇది. ఓ పదిహేనేళ్ళ క్రితం ఈ పేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ, కాంగ్రెస్ ఏలుతున్న రోజులవి. 2008 ఆగస్టు 26న ఎన్నో ఆశలు, ఆశయాలతో స్థాపించారు మెగాస్టార్ చిరు. ప్రజారాజ్యంలో యువరాజ్యం సగభాగం. యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నారు.