HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Dilemma Over 3 Capitals Bill In Andhra Pradesh

3 Capitals AP : జ‌గన్ ‘3’ ముచ్చ‌టే.! మ‌ళ్లీ ‘బిల్లు’పై అపోహ‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మూడు రాజ‌ధానుల బిల్లును స‌మ‌గ్రంగా మ‌రో రూపంలో తీసుకొస్తాన‌ని వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

  • Author : CS Rao Date : 07-12-2021 - 3:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మూడు రాజ‌ధానుల బిల్లును స‌మ‌గ్రంగా మ‌రో రూపంలో తీసుకొస్తాన‌ని వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. కానీ, అంత ఈజీగా ఆయ‌న ఆలోచ‌న సాకారం అయ్యేలా క‌నిపించ‌డంలేదు. మాజీ సీఎం చంద్ర‌బాబు హ‌యాంలో సేక‌రించిన భూమి విలువ సుమారు 1.5 ట్రిలియ‌న్ విలువ ఉంటుంది. ఈ మొత్తం విలువ మీద 150శాతం ప‌రిహారం కింద రైతుల‌కు ఏపీ ప్ర‌భుత్వం చెల్లించాలి. అదే జ‌రిగితే, రాష్ట్ర జీఎస్డీపీలో 75శాతంపై అప్పుగా తేల‌నుంది. ఈ లెక్క‌లు చూస్తే రైతులను కాద‌ని మూడు రాజ‌ధానుల‌కు జ‌గ‌న్ వెళ్ల‌డం అసాధ్యంగా క‌నిపిస్తోంది.రాష్ట్రంలోని ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రులుగా ఉన్న కార్యాల‌యాలు అన్నీ బ్యాంకుల‌కు ఏపీ ప్ర‌భుత్వం కుదువ పెట్టింది. ఇప్పుడు ప‌రిస్థితుల్లో అమ‌రావ‌తి భూముల‌ను వేలం వేయ‌డం మిన‌హా మ‌రో మార్గం జ‌గ‌న్ స‌ర్కార్ కు లేదు. అలా కాకుండా మూడు రాజ‌ధానుల అభివృద్ధి చేయ‌డం క‌ష్టం. చేతిలో డ‌బ్బు లేకుండా జ‌గ‌న్ స‌ర్కార్ మూడు రాజ‌ధానుల ఆలోచ‌న చేయ‌డం స‌రైన విధానం కాద‌ని ఏపీ మాజీ బ్యూరోక్రాట్ అభిప్రాయం.ఏపీ సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న ప్ర‌కారం కార్య‌నిర్వ‌హ‌ణ రాజ‌ధాని వైజాగ్‌, శాస‌న రాజ‌ధాని అమ‌రావ‌తి, న్యాయ రాజ‌ధాని క‌ర్నూలుగా ఉండాలి. కానీ, న్యాయ రాజ‌ధాని ఎక్క‌డ ఉండాలి? అనేది అసెంబ్లీ నిర్ణ‌యించ‌డానికి అవ‌కాశం లేదు. రాజ్యాంగంలో ఆ అవ‌కాశం శాస‌న వ్య‌వ‌స్థ‌కు ఇవ్వ‌లేదు. దీంతో న్యాయ రాజ‌ధాని ఎక్క‌డ ఉండాలో..కొలిజియం, సుప్రీం కోర్టు తేల్చుతాయి. అంతేగానీ, ప్ర‌భుత్వ నిర్ణ‌యం ప్ర‌కారం న్యాయ వ్య‌వ‌స్థ న‌డ‌వ‌దు. ఇదే అంశం జ‌గ‌న్ ఆలోచ‌న‌కు తాత్కాలిక బ్రేక్ వేసింది. న్యాయ రాజ‌ధాని కాకుండా మిగిలిన రెండు రాజధానుల‌కు సంబంధించిన బిల్లును బ‌డ్జెట్ స‌మావేశాల్లో పెట్టాల‌ని జ‌గ‌న్ యోచిస్తున్నాడ‌ట‌. ఆ లోపు న్యాయ రాజ‌ధానికి అనుసంధానంగా ఉండే కార్యాల‌యాల‌ను క‌ర్నూలు త‌ర‌లించాల‌ని ప్లాన్ చేశాడు. ఆ క్ర‌మంలోనే కొన్ని కార్యాల‌యాలు త‌ర‌లి వెళ్లి పోయాయ‌ని తెలుస్తోంది.

మాజీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ప్ర‌పంచ స్థాయి రాజ‌ధాని నిర్మించాల‌ని త‌ల‌పోశాడు. అందుకోసం సింగపూర్ ప్ర‌భుత్వ గుర్తించిన రెండు క‌న్స‌ల్టెంట్ కంపెనీల‌కు నిర్మాణ ప‌నుల‌ను అప్ప‌గించాడు. నగరం 217 చ.కి.మీ భౌగోళిక విస్తీర్ణంలో విస్తరించి, సుమారు 8 బిలియన్ డాల‌ర్ల‌తో అభివృద్ధి చేయాల‌ని ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చించాడు. ఊహించ‌ని విధంగా 2019 ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మిని బాబు చ‌విచూశాడు. దాంతో అమ‌రావ‌తి ప్రాజెక్టు కూడా చ‌తికిల‌ప‌డింది.
వాస్త‌వంగా అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించిన త‌రువాత అక్క‌డి భూముల ధ‌ర‌లు వంద‌ల రెట్లు పెరిగాయి. నగరానికి గుర్తించిన దాదాపు 54 వేల ఎకరాల్లో 42 వేల ఎకరాలు సాగు భూమి. ప్రతి ఏడాది మూడు పంట‌లు పండేందుకు అవ‌స‌ర‌మైన సాగునీరు 40వేల ఎక‌రాల‌కు అందేది. అంతేకాకుండా, ఈ ప్రాంతం మొత్తం సమృద్ధిగా పత్తి ని పండించేందుకు అనువైన నేల, వ్యవసాయానికి విలువైనది. వివిధ క‌మిటీలు ఇచ్చిన నివేదిక‌ల ఆధారంగా అమ‌రావ‌తిని చంద్ర‌బాబు నిర్ణ‌యించాడు. దానికి ఆనాడు అసెంబ్లీ సాక్షిగా జ‌గ‌న్‌ మ‌ద్ధ‌తు ప‌లికాడు.

అధికారం పోయిన త‌రువాత అదునుచూసి చంద్ర‌బాబు మీద రాజ‌కీయ దెబ్బ కొట్టేందుకు జ‌గ‌న్ మూడు రాజ‌ధానులు అస్త్రాన్ని సంధించాడు. రాజ‌ధాని ప‌రిధిలో ఎక్కువ మంది క‌మ్మ సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉంది. వాళ్లు తెలుగుదేశం పార్టీకి అండ‌గా ఉంటారని జ‌గ‌న్ భావ‌న‌. కొన్ని ద‌శాబ్దాలుగా క‌మ్మ‌, రెడ్డి సామాజిక వ‌ర్గాల మ‌ధ్య ఏపీలో అధికార మార్పిడి జ‌రుగుతోంది. ఆ క్ర‌మంలో అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉంటే..చంద్ర‌బాబు సామాజిక‌వ‌ర్గం బ‌లోపేతం అవుతుంద‌ని జ‌గ‌న్ ఆలోచించాడు. ప్ర‌త్యామ్నాయంగా మూడు రాజ‌ధానుల అంశాన్ని తెర‌మీద‌కు తీసుకొచ్చాడు. ఫ‌లితంగా క‌మ్మ సామాజిక‌వ‌ర్గం ఆర్థిక మూలాల‌ను దెబ్బ తీశాడ‌ని రాజ‌కీయ వ‌ర్గాల భావ‌న‌.
మూడు రాజ‌ధానుల బిల్లును మ‌ళ్లీ పెట్టాల‌ని యోచిస్తోన్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం రైతుల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాలి. ఇప్పుడు ఏపీ ఉన్న ఆర్థిక దుస్థితిలో ప‌రిహారం ఇవ్వ‌డం అసాధ్యం. సో…మూడు రాజ‌ధానుల బిల్లు జ‌గ‌న్ ఆలోచ‌న‌గానే మిగిలే అవ‌కాశం లేక‌పోలేదని న్యాయ‌, ఆర్థిక నిపుణుల టాక్‌.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 3 capitals
  • andhra pradesh
  • ys jagan

Related News

Restraint is needed on water disputes: CM Revanth Reddy

జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

జల వివాదాల విషయంలో కోర్టుల చుట్టూ తిరగకుండా, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకుని పరిష్కార మార్గాలు కనుగొనాలని ఆయన పిలుపునిచ్చారు.

  • AP Deputy CM Pawan Kalyan Strong Warning to YSRCP

    మరోసారి వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ .. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Latest News

  • ఎలోన్ మస్క్ ‘గ్రోక్’పై ఇండోనేషియా నిషేధం!

  • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

  • ఇండోనేషియాలో భారీ భూకంపం!!

  • మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ ముప్పు.. ప్రతి 8 నిమిషాలకు ఒక మరణం!

  • భారత ఈవీ మార్కెట్లోకి సుజుకి ఎంట్రీ.. ధ‌ర ఎంతంటే?!

Trending News

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

    • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

    • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd