HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Delhi Politics On Janasena Chief Pawan Kalyan

Pawan Kalyan: ప‌వ‌న్ పై ఢిల్లీ పోస్ట్ మార్టం!

`పార్టీని విలీనం చేయ‌మ‌ని ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు ఒత్తిడి తెస్తున్నారు. 30ఏళ్ల పార్టీని న‌డ‌పాల‌ని నిర్ణ‌యించుకున్నాను. అధికారంలేక‌పోయిన‌ప్ప‌టికీ

  • By CS Rao Published Date - 12:44 PM, Wed - 19 October 22
  • daily-hunt
Kapu Flaver
Pawan Janasena

`పార్టీని విలీనం చేయ‌మ‌ని ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు ఒత్తిడి తెస్తున్నారు. 30ఏళ్ల పార్టీని న‌డ‌పాల‌ని నిర్ణ‌యించుకున్నాను. అధికారంలేక‌పోయిన‌ప్ప‌టికీ ప్ర‌శ్నించ‌డానికి ఉంటాను. కులం, ప్రాంతం, మ‌తం ప్ర‌స్తావ‌న లేకుండా రాజ‌కీయాలు చేద్దాం. మార్పు కోసం ఎంత వ‌ర‌కైనా వెళ‌దాం.` ఇవీ జ‌న‌సేనాని ప‌వ‌న్ బీజేపీతో పొత్తు పెట్టుకున్న త‌రువాత ఆనాడు కార్య‌క‌ర్త‌ల మీటింగ్ లో చెప్పిన మాట‌లు. అప్ప‌టి నుంచి అమిత్ షా, మోడీ అపాయిట్మెంట్ ఆయ‌న‌కు ల‌భించ‌లేదు. కేవ‌లం బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా మాత్ర‌మే ప‌వ‌న్ కు క‌లిసేందుకు అవ‌కాశం ఇస్తున్నారు. విలీనం ఓకే అంటే అమిత్ షా అపాయిట్మెంట్ ఉండేదని ఢిల్లీ వ‌ర్గాల్లోని టాక్‌.

2019 ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత లెప్ట్ భావ‌జాలం నుంచి రైట్ భాజాలానికి ప‌వ‌న్ వెళ్లారు. క‌మ్యూనిస్ట్ లు, బీఎస్పీని వ‌దిలేసి బీజేపీ పంచ‌న చేరారు. ఎన్డీయే-2 రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఆయ‌న త‌న పంథా మార్చేసుకున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన‌, బీజేపీ ఎక్క‌డా పెద్ద‌గా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడి దాఖ‌లాలు లేవు. తెలంగాణ‌లో జ‌న‌సేన పార్టీని బీజేపీ ఎప్పుడో దూరంగా పెట్టింది. తిరుప‌తి లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ, జ‌న‌సేన క‌లిసి అభ్య‌ర్థిని నిలిపిన‌ప్ప‌టికీ డిపాజిట్లు రాలేదు. బ‌ద్వేల్‌, ఆత్మ‌కూరు ఎన్నిక‌ల్లో బీజేపీ, జ‌న‌సేన వేర్వేరుగా వ్య‌వ‌హ‌రించాయి. పైకి ఆ రెండు పార్టీలు పొత్తు అంటున్న‌ప్ప‌టికీ ఎక్క‌డా క్షేత్ర‌స్థాయిలో కల‌వ‌డంలేదు. అదే విష‌యాన్ని మంగ‌ళ‌గిరి కేంద్రంగా జ‌రిగిన స‌మావేశంలో చెబుతూ బీజేపీ రోడ్ మ్యాప్ గురించి ప్ర‌స్తావించారు. స‌కాలం రోడ్ మ్యాప్ రానందున టైమ్ మించిపోతుంద‌ని ప‌రోక్షంగా బ్రేక‌ప్ సంకేతాలు ఇచ్చారు.

ఏపీలోని తాజా ప‌రిణామాల‌పై చ‌ర్చించ‌డానికి బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు ఢిల్లీ వెళ్లారు. అక్క‌డి పెద్ద‌ల‌తో చ‌ర్చించిన త‌రువాత బీజేపీ వైఖ‌రి ఏమిటో బ‌య‌ట‌కు రానుంది. ప్ర‌స్తుతం బీజేపీ ప‌రోక్షంగా వైసీపీకి మ‌ద్ధ‌తుగా ఉంది. ఆ రెండు పార్టీలు ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుంటూ వెళుతున్నాయి. అదే స్నేహాన్ని కంటిన్యూ చేయాల‌ని బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు భావిస్తున్నారు. అదే టైమ్ లో టీడీపీకి దూరంగా ఉండాల‌న్న లాజిక్ ను బీజేపీ తీస్తుంద‌ని తెలుస్తోంది. ఆ క్ర‌మంలో ప‌వ‌న్ వాల‌కంపై బీజేపీ ఆరా తీస్తోంది. ఆయ‌న చేసిన బూతు ప్ర‌సంగంలోని ఆంత‌ర్యాన్ని బీజేపీ అంచ‌నా వేస్తోంది. మొత్తం మీద ఢిల్లీ వ‌ర‌కు చేరిన ప‌వ‌న్ ప్ర‌సంగం తాజాగా మాన‌వ‌హ‌క్కుల సంఘానికి కూడా వెళుతోంది.

వైజాగ్ గ‌ర్జ‌న సంద‌ర్భంగా ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరుపై మాన‌వ‌హ‌క్కుల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేయ‌నుంది. అంతేకాదు, ఎమ్మెల్యేల‌ను బూతులు తిట్టిన విధానాన్ని కూడా హ‌క్కుల సంఘానికి పంప‌డానికి సిద్దం అయింది. మూడు రాజ‌ధానుల జేఏసీ లీడ‌ర్లు విశాఖ కేంద్రంగా ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరుపై హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు చేయ‌డానికి సిద్ధం అయింది. ఉత్త‌రాంధ్ర మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా వ్య‌వ‌హరించార‌ని పొందుప‌రుస్తూ మాన‌వ హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు చేయ‌నున్నారు. మొత్తం మీద ప‌వ‌న్ మంగ‌ళ‌గిరి పార్టీ ఆఫీస్ లో క్యాడ‌ర్ ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగం స‌భ్య స‌మాజాన్ని త‌లదించుకునేలా చేసింది. దానిపై బీజేపీ పోస్ట్ మార్టం చేస్తుంటే, వైసీపీ హ‌క్కుల సంఘాల‌కు ఫిర్యాదు చేయ‌నుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • bjp delhi
  • bjp janasena
  • Pawan Kalyan

Related News

Cyclone Montha

IMD : సైక్లోన్ మోంథా కాకినాడ సమీపంలో తీరాన్ని తాకనుంది: ఐఎం‌డి హెచ్చరికలు

సైక్లోన్ మోంథా కాకినాడ సమీపంలో తీరాన్ని తాకనుంది భారత వాతావరణ శాఖ (IMD) తాజా హెచ్చరికల ప్రకారం, బంగాళాఖాతంలో ఏర్పడిన సైక్లోన్ మోంథా త్వరలో కాకినాడ సమీప తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ తుఫాన్ 28 అక్టోబర్ రాత్రి లేదా 29 అక్టోబర్ ఉదయం మధ్యలో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో, విశాఖపట్నం నుండి తిరుపతి వరకు విస్తారంగా భారీ వర్షాలు, 70-100 కిలోమీటర్ల

  • Kurnool Bus Tragedy

    Rashmika Mandanna : కర్నూలు బస్సు ప్రమాదంపై రష్మిక శాడ్ పోస్ట్..!

  • Kurnool Road Accident

    Bus Fire Accident : 10మంది ప్రాణాలు కాపాడిన హరీష్‌కుమార్.!

  • Kaveri Travels

    Kurnool Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదం లో .. ఆ మొబైల్స్ ఎంత పనిచేశాయి!

  • Chandrababu

    CM Chandrababu Naidu : కర్నూల్ బస్ ప్రమాదం చంద్రబాబు సీరియస్ ..వారిపై కఠిన చర్యలు.!

Latest News

  • IndW vs BanW: వర్షం ఆటలో బ్రేక్ – భారత్‌ జోరుకు అడ్డుపడ్డ వరుణుడు

  • AP Schools: మొంథా తుపాను ప్రభావం – ఏపీలో పాఠశాలలు బంద్

  • Bride Dies: పెళ్లి ముందు పెళ్లికూతురి మృతి – పంజాబ్‌లో విషాదం

  • Burn Utensils: మాడిపోయిన పాత్రలను ఈజీగా శుభ్రం చేసుకోండిలా!

  • Donald Trump: కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు.. సాక్ష్యంగా ట్రంప్!

Trending News

    • Rohit Sharma: రోహిత్ శర్మ సంచ‌ల‌న పోస్ట్.. అభిమానులకు ‘చివరిసారిగా… వీడ్కోలు’ అంటూ!

    • Gold Prices: రికార్డు ధర నుంచి రూ. 9,000 తగ్గిన బంగారం ధర!

    • Dev Deepawali: కార్తీక పూర్ణిమ, దేవ దీపావళి ఏ రోజు? ఎన్ని దీపాలు వెలిగిస్తే మంచిది?

    • Rohit Sharma- Virat Kohli: విజయ్ హజారే ట్రోఫీ ఆడ‌నున్న విరాట్‌, రోహిత్‌?!

    • Virat Kohli: వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో ఆట‌గాడిగా కోహ్లీ.. ఆ విష‌యంలో స‌చిన్ రికార్డు బ్రేక్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd