HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Delhi Deal Ap Cm Jaganmohan Reddys Visit To Delhi Is A Case Study

Delhi Deal : ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న `కేస్` స్ట‌డీ

ఏసీ సీఎం ఢిల్లీ ప‌ర్య‌ట‌న(Delhi Deal)ఆయ‌న‌పై ఉన్న కేసుల వ్య‌వ‌హారం వ‌స్తోంది.

  • By CS Rao Published Date - 12:50 PM, Tue - 27 December 22
  • daily-hunt
Delhi Jagan
Jagan Delhi Tour Narendra Modi

ఏసీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న(Delhi Deal) సంద‌ర్భంగా ఆయ‌న‌పై ఉన్న కేసుల(Cases) వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌స్తోంది. ప్ర‌ధానంగా ఆయ‌న బాబాయ్ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య తెర‌మీద క‌నిపిస్తోంది. కేసు విచార‌ణ‌లో సీబీఐ స్పీడు పెంచ‌డంతో పాటు చివ‌రి ద‌శ‌కు తీసుకొచ్చింది. దాన్నుంచి బ‌య‌ట ప‌డేందుకు మంగ‌ళ‌వారం ఢిల్లీ వెళ్లి (Delhi Deal) బీజేపీ పెద్ద‌ల స‌హాయ‌స‌హ‌కారాల కోర‌నున్నార‌ని ప్రచారం మొద‌లయింది. ప్ర‌స్తుతం బెయిల్ మీద ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌తి శుక్ర‌వారం కోర్టుకు హాజ‌రు కావాల్సి ఉంది. కానీ, సీఎం హోదాలో ఉన్న ఆయ‌న ఏపీ నుంచి హైద‌రాబాద్ కు రావాలంటే ఖ‌ర్చుతో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆ అంశాన్ని ఫోక‌స్ చేయ‌డం ద్వారా వ్య‌క్తిగ‌త హాజ‌రు నుంచి మిన‌యింపు పొందారు.

Also Read : Jagan Delhi Tour: జగన్ ఢిల్లీ టూర్, పొలిటికల్ చేంజ్

కోర్టుల్లోని కేసుల(Cases) విచార‌ణ ఆపేందుకు ఢిల్లీ పెద్ద‌ల స‌హకారం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకుంటున్నార‌ని తొలి నుంచి ఆయ‌న మీద ఉన్న ఆరోప‌ణ‌. ఏపీ సీఎం అయిన తొలి రోజుల్లో మోడీ, అమిత్ షా అపాయిట్మెంట్ కు ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ ల‌భించ‌లేదు. తొలుత ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అపాయిట్మెంట్ ను సాధించ‌గ‌లిగారు. ఆ త‌రువాత కొన్ని నెల‌ల పాటు ప్ర‌య‌త్నం చేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయిట్మెంట్ ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పొందారు. మూడున్న‌రేళ్ల‌లో రెండేసార్లు అమిత్ షాను క‌ల‌వ‌డానికి ఆయ‌న‌కు అవ‌కాశం ల‌భించింది. కానీ, మోడీ మాత్రం త‌ర‌చూ అపాయిట్మెంట్ లు ఇస్తున్నారు. పీఎంవో ఆఫీస్ లో ఎంపీ సాయిరెడ్డి చేస్తోన్న లాబీయింగ్ మోడీ విష‌యంలో ప‌నిచేస్తుంద‌ని ఢిల్లీ వ‌ర్గాల టాక్‌.

సాధార‌ణంగా రాజ‌కీయాలు, కేసుల విష‌యాల‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ‌తార‌ని బీజేపీ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. కానీ, ప్ర‌ధాని మోడీ ద్వారా ఏపీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆయ‌న వ్య‌క్తిగ‌త అంశాల‌ను డీల్ చేసుకుంటున్నార‌ని ఆ పార్టీ అంత‌ర్గ‌త వ‌ర్గాల్లోని వినికిడి. ఏపీకి ప్ర‌ధాని వ‌చ్చిన సంద‌ర్భంగా భీమ‌వ‌రం, విశాఖ వేదిక‌గా మోడీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌ధ్య ఉన్న అప్యాయ‌త‌లు జ‌నం చూశారు. రాజ‌కీయాల‌కు అతీతంగా మోడీతో ఆత్మీయ‌బంధం ఉంద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెల్ల‌డించారు. ఆ బంధంతో రాష్ట్ర ప్రయోజ‌నాల‌ను నెర‌వేర్చిన దాఖ‌లాలు లేవు.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ వెళుతోన్న సంద‌ర్భంగా..(Delhi Deal)

ఏపీ విడిపోయిన త‌రువాత ఉమ్మ‌డి ఆస్తుల విభ‌జ‌న జ‌ర‌గ‌లేదు. సుమారు 6లక్ష‌ల కోట్ల విలువైన సంప‌ద తెలంగాణ భూభాగంలో పంప‌కానికి నోచుకోకుండా ఉండిపోయింది. దాని ప‌రిష్కారానికి కేంద్రం అందించిన స‌హ‌కారం శూన్యం. ఇక పోల‌వ‌రం, రాజ‌ధాని, విశాఖ రైల్వే జోన్, ఆర్థికలోటు త‌దిత‌ర అంశాల ప‌రిష్కారానికి కేంద్రం ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వ‌డంలేదు. వీటి గురించి ఢిల్లీ వెళ్లిన ప్ర‌తి సంద‌ర్భంలోనూ విన‌త‌ప‌త్రాన్ని అందించడం వ‌ర‌కు ప‌రిమిత‌మై, ఆ త‌రువాత స్వ‌ప్ర‌యోజ‌నాల గురించి మాట్లాడుకుంటున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

లిక్క‌ర్ స్కామ్ విచార‌ణ వేగ‌వంతంగా జ‌రుగుతోంది. దానిలో ఏపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి బంధువ‌లు ప్ర‌మేయం ఉంద‌ని రిమాండ్ రిపోర్ట్ ద్వారా తేలింది. ఆ కేసు విచార‌ణ తెలంగాణ నుంచి ఏపీ వ‌ర‌కు తాకింది. ఈసారి కూడా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ వెళుతోన్న సంద‌ర్భంగా ఆయ‌న‌పై ఉన్న కేసులు, అప్పు అంశాలు ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తాయ‌ని ప‌లువురు విశ్వ‌సిస్తున్నారు. ఈసారి కూడా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ వెళుతోన్న సంద‌ర్భంగా ఆయ‌న‌పై ఉన్న కేసులు, అప్పు అంశాలు ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తాయ‌ని ప‌లువురు విశ్వ‌సిస్తున్నారు. వీటికి భిన్నంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఉంటే అనూహ్య‌మే.

Also Read : Babu-Jagan: హస్తినలో ఏపీ హీట్! ఢిల్లీకి బాబు, జగన్!!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Jagan Mohan Reddy
  • ap liquor
  • jagan delhi tour
  • YSRCP MP In Delhi Liquor Scam

Related News

New bar policy implemented in AP

AP : ఏపీలో అమల్లోకి వచ్చిన కొత్త బార్ పాలసీ

ఇప్పటి వరకూ రాష్ట్రంలోని బార్లు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకే పని చేస్తున్నాయి. అయితే తాజా పాలసీ ప్రకారం, ఈ సమయాన్ని రోజుకు రెండు గంటల వరకు పొడిగించారు. ఇకపై బార్లు ఉదయం 10 గంటల నుంచే తెరుచుకుని, అర్ధరాత్రి 12 గంటల వరకూ పనిచేయనున్నాయి.

    Latest News

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

    • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd