Jagan: కేవలం మూడురోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారు: జగన్
- By Balu J Published Date - 09:16 PM, Fri - 7 June 24
![Jagan: కేవలం మూడురోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారు: జగన్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/jagan-mohan-reddy-2.jpg)
Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి టీడీపీ ప్రభుత్వం విమర్శలు చేశారు. ”రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు. పార్టీనుంచి పోటీచేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయింది. ఉన్నత చదవులకు కేంద్రాలైన యూనివర్శిటీల్లో ఆచార్యులపై దౌర్జన్యాలకు దిగి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు”అని జగన్ మండిపడ్డారు.
”గడచిన ఐదేళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీసి కేవలం మూడురోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారు. ప్రజాస్వామ్యానికి, పౌరస్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతోంది. గౌరవ గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. హింసాయుత ఘటనల్లో బాధితులైన పార్టీ కార్యకర్తలకు, నా అన్నదమ్ములకు, నా అక్కచెల్లెమ్మలకు YSR Congress Party – YSRCP తోడుగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నా”అని జగన్ రియాక్ట్ అయ్యారు
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Tags
Related News
![Jagan : జగన్ వ్యాఖ్యలపై నాగబాబు సెటైర్లు](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/jagan-pennelli.jpg)
Jagan : జగన్ వ్యాఖ్యలపై నాగబాబు సెటైర్లు
జగన్ మోహన్ రెడ్డి గారు మీరేం మాట్లడుతున్నారో మీకు అర్ధమవుతుందా?