HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Conservation Of Kolleru Is Urgent Chandrababu Issues Key Instructions To Officials

CM Chandrababu : కొల్లేరు పరిరక్షణ అత్యవసరం.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

కొల్లేరు సరస్సును కేంద్రంగా తీసుకుని, అక్కడి నిబంధనలు, కోర్టు తీర్పులు, పర్యావరణ పరిస్థితులు, కాంటూరు వివాదం వంటి అంశాలపై సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

  • Author : Latha Suma Date : 02-06-2025 - 5:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Conservation of Kolleru is urgent.. Chandrababu issues key instructions to officials
Conservation of Kolleru is urgent.. Chandrababu issues key instructions to officials

CM Chandrababu : పర్యావరణ పరిరక్షణలో కీలకమైన కొల్లేరు సరస్సును రక్షించుకోవడం అత్యవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను మానవీయ కోణంలో పరిగణించి, పరిష్కారానికి నడుం కట్టాలని ఆయన అన్నారు. కొల్లేరు సరస్సును కేంద్రంగా తీసుకుని, అక్కడి నిబంధనలు, కోర్టు తీర్పులు, పర్యావరణ పరిస్థితులు, కాంటూరు వివాదం వంటి అంశాలపై సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కొల్లేరు సరస్సు కాలుష్యానికి గుండ్రంగానే మారకూడదు. డ్రైన్లు శుద్ధి చేయకుండా విడిచిపెడితే, పక్షుల నివాసంగా పేరుగాంచిన ఈ సరస్సు పూర్తిగా కాలుష్య భూగర్భంగా మారుతుంది. డ్రైన్ వాటర్‌కు ట్రీట్మెంట్ జరగాలి. డ్రైన్‌లలో పేరుకుపోయిన పూడికలను తొలగించాలి. నీరు అవరోధం లేకుండా సముద్రంలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలి అని స్పష్టం చేశారు.

Read Also: Sridhar Babu : ‘జై తెలంగాణ’ రాష్ట్ర ప్రజల నినాదం..ఒకరు పేటెంట్‌ ఏమీ కాదు: మంత్రి శ్రీధర్‌బాబు

ఉప్పుటేరులో అక్రమ నిర్మాణాలు తొలగించి, అవుట్‌లెట్లను పూర్తిగా క్లియర్ చేయాలని, వీటి కోసం అవసరమైన అంచనాలు సిద్ధం చేసి వెంటనే పనులు ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కొల్లేరు కాంటూరు పరిధిలో మూడు లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారు. వీరిలో చాలా మంది 20 వేల ఎకరాల జిరాయితీ, డీ పట్టా భూములపై ఆధారపడిన రైతులు. గతంలో 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి పలు ప్రయత్నాలు చేసింది. 2018లో నేషనల్ వైల్డ్‌లైఫ్ బోర్డు 20 వేల ఎకరాలను కొల్లేరు పరిధి నుంచి మినహాయించి కొత్త సరిహద్దులను నిర్థారించాలని సిఫారసు చేసింది. ఈ ప్రతిపాదనను కేంద్రం వద్ద ఉన్న సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి పంపించామని సీఎం గుర్తు చేశారు. కానీ, కొందరి అభ్యంతరాల నేపథ్యంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ అంశంపై ఏ విధమైన చర్యలూ తీసుకోలేదని చంద్రబాబు విమర్శించారు.

కొల్లేరు రైతులకు న్యాయం జరగాలి. పర్యావరణాన్ని కాపాడుతూ, అక్కడ నివసిస్తున్న ప్రజలకు మేలుగా ఉండే విధంగా ప్రభుత్వ విధానం ఉండాలి. సుప్రీంకోర్టు, సీఈసీ ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సమర్థంగా ఉంచి, పరిష్కారం సాధించాలి అని సీఎం పేర్కొన్నారు.ఈ సమీక్షలో చీఫ్ సెక్రటరీ విజయానంద్‌తో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, ధర్మరాజు, చింతమనేని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కొల్లేరు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అన్ని మంత్రిత్వ శాఖల సమన్వయంతో కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. ఈ విధంగా పక్షుల స్వర్గధామంగా పేరొందిన కొల్లేరు సరస్సు భవిష్యత్ తరాలకు మిగలేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Read Also: Minister Ponguleti : ఆగస్టు 15 నాటికి భూసమస్యలు పరిష్కారం అవుతాయి: మంత్రి పొంగులేటి

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • environmental conservation
  • Kolluru Lake
  • Kolluru People Issues

Related News

    Latest News

    • మీ కూరలో ఉప్పును తగ్గించే అద్భుతమైన చిట్కాలీవే!

    • కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా?

    • ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • యువ ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం.. ఎవ‌రీ కార్తీక్ శ‌ర్మ‌, ప్ర‌శాంత్ వీర్‌?

    Trending News

      • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

      • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

      • ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్‌టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?

      • ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

      • నేడు ఐపీఎల్ 2026 మినీ వేలం.. పూర్తి వివ‌రాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd