CM Ramesh : ఏ ఒక్కడిని వదిలిపెట్టనని సీఎం రమేష్ వార్నింగ్..
తనపై దాడి చేసిన ఏ ఒక్కర్ని విడిచిపెట్టానని..హెచ్చరించారు. కేంద్ర బలగాల సాయంతో తారువ గ్రామంలోకి ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని.. ఇక్కడే మెజార్టీ ఓట్లు దక్కించుకుంటానని రమేష్ సవాల్ చేసారు.
- By Sudheer Published Date - 11:57 PM, Sat - 4 May 24
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ అధికార పార్టీ నేతలు (YCP Leaders) , వర్గీయులు రెచ్చిపోతున్నారు. శనివారం అనకాపల్లి (Anakapalli) జిల్లా మాడుగుల మండలం తాడువలో కూటమి నేతలు ప్రచారం చేస్తుండగా, డిప్యూటి సీఎం బూడి ముత్యాలనాయుడు, కొందరు కార్యకర్తలను వెంటబట్టుకుని కూటమి నేతలపై దాడులకు దిగాడు. బీజేపీ నాయకుడు గంగాధర్ని చెప్పుతో కొట్టి, రెండు ద్విచక్రవాహనాలు ధ్వసం చేశారు. ఈ దాడిలో నలుగురు తీవ్రగాయాలయ్యాయి. ఈ క్రమంలో కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లిన బిజెపి అభ్యర్థి సీఎం రమేష్ (CM Ramesh) ఫై వైసీపీ కి చెందిన వర్గీయులు దాడి చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ దాడిలో రమేష్కు స్వల్పగాయాలవ్వగా.. చొక్కా చిరిగిపోయింది. అలాగే ఆయన కారుతో పాటు కాన్వాయ్లోని మూడు కార్లపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. వైసీపీ కి చెందిన వర్గీయులు రెచ్చిపోతూ దాడి చేస్తున్న పోలీసులు వారిని ఆపడం కానీ చేయపోవడంఫై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసిన వారంతా ఇసుక దోపిడీ, మైనింగ్ దందాలకు పాల్పడిన వారేనని సీఎం రమేష్ ఆరోపించారు. తనపై దాడి చేసిన ఏ ఒక్కర్ని విడిచిపెట్టానని..హెచ్చరించారు. కేంద్ర బలగాల సాయంతో తారువ గ్రామంలోకి ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని.. ఇక్కడే మెజార్టీ ఓట్లు దక్కించుకుంటానని రమేష్ సవాల్ చేసారు.
మా పార్టీ కార్యకర్తపై దాడి జరిగితే.. పరామర్శించడానికి వెళ్ళిన నాపై వైసీపీ మూకలు దాడికి తెగబడ్డారు. అక్కడే చోద్యం చూస్తున్న పోలీసులపై, వారి వాహనాలపై కూడా దాడికి దిగారు. ఈ దాడికి స్వయంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడే నేతృత్వం వహించడం దారుణం. (1/2)#YCPTerroristsAttack pic.twitter.com/yj6RFzkrAL
— Dr. CM Ramesh (Modi Ka Parivar) (@CMRamesh_MP) May 4, 2024
ఇటువంటి కుట్రలను లెక్కచేసేది లేదు.. నాపై, నా కార్యకర్తలపై దాడి చేసిన వారికి న్యాయపరంగా తగిన గుణపాఠం చెబుతా!
పోలీసు వ్యవస్థ నిస్సహాయత ప్రజలు గమనించాలి.
అదే గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్తా.. బుద్ధిలేని బూడికి గుణపాఠం చెబుతాం. (2/2) #YCPTerroristsAttack pic.twitter.com/6eaOrxI7sE
— Dr. CM Ramesh (Modi Ka Parivar) (@CMRamesh_MP) May 4, 2024
Read Also : Mayor Gadwal Vijayalakshmi : కాంగ్రెస్ ప్లెక్సీ లలో తన ఫోటో లేదని మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం..
Related News
AP : ఏపిలో ఈ- ఆఫీస్ అప్ గ్రేడ్ కార్యక్రమాన్ని వాయిదా వేసిన ఈసీ
E-Office: ఏపిలో ఈ-ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ఆదేశించింది. ఏపిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ- ఆఫీస్ స్టాఫ్ట్ వేర్ను అప్గ్రేడ్ చేఏందుకు ఎన్ఐసీ(నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్) ఈనెల18 నుండి 25 వరకు షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. We’re now on WhatsApp. Click to Join. అయితే గ్రామ, వార్డు సచివాలయాలకు ఈ-ఆఫీస్ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో �