HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Jagan Last Speech In Assembly

Jagan : అసెంబ్లీ లో జగన్ లాస్ట్ స్పీచ్..అభివృద్ధి..నష్టాలపై ఎమోషనల్

  • Author : Sudheer Date : 06-02-2024 - 5:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Last Speech
Jagan Last Speech

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో (AP Assembly Sessions 2024) సీఎం జగన్ (CM Jagan) ఎమోషనల్ గా మాట్లాడారు. తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి..గత ప్రభుత్వం వల్ల జరిగిన నష్టాలు, కేంద్ర విభజన , హైదరాబాద్ ను కోల్పోవడం తో ఏపీకి జరిగిన నష్టం తదితర అంశాల గురించి ప్రస్తావించారు. అలాగే కరోనా కారణంగా జరిగిన నష్టాన్ని సైతం చెప్పుకొచ్చారు.

హైదరాబాద్ ను కోల్పోవడంతో ఈ పదేళ్లలో ఏపీ రూ.1.30 లక్షల కోట్లు నష్టపోయినట్లు జగన్ చెప్పుకొచ్చారు. ఆ మొత్తం ఉంటే ఎంతో వెసులుబాటు ఉండేదన్నారు. ‘రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు. కనీసం ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టి ఉంటే కోర్టుకు వెళ్లి సాధించుకునే వీలుండేది. మన మీద ఆధారపడే కేంద్ర ప్రభుత్వం ఏర్పడే వరకు హోదా ఎండమావిగా కనిపిస్తోంది. కేంద్రంలో మెజార్టీ రావొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలని, లేదంటే రాష్ట్ర ఆదాయాలు ఎప్పటికీ పెరగవని జగన్ తెలిపారు. ‘ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్ను కోల్పోయాం. దీంతో ఏటా రూ.13 వేల కోట్లు నష్టపోతున్నాం. ఇప్పటికీ రెవెన్యూ లోటు వెంటాడుతోంది. ప్రతి రాష్ట్రానికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు ఉండాలి. అందుకే నేను పదేపదే విశాఖ గురించి ప్రస్తావిస్తున్నా’ అని పేర్కొన్నారు. అలాగే కేంద్రం సైతం కొన్నేళ్లుగా రావాల్సిన నిధులు తగ్గాయని చెప్పుకొచ్చారు. ‘2015-20 మధ్య కేంద్ర పన్నుల్లో వాటాగా APకి 42% నిధులు ఇవ్వాలని 14వ ఫైనాన్స్ కమిషన్ సూచించగా, కేంద్రం 35% ఇచ్చింది.

2020-25 మధ్య 41% నిధులు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సూచించగా, కేంద్రం 31.15% నిధులే ఇచ్చింది. దీంతో ఆదాయం భారీగా తగ్గిపోయింది. అయినప్పటికీ మంచి పాలన అందించాం’ తెలిపారు. గత ఐదేళ్లలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని , కరోనా కారణంగా ఆదాయం బాగా తగ్గింది, ఖర్చులు పెరిగాయి. తద్వారా అప్పులు కూడా పెరిగాయి. రెండు ఆర్థిక సంవత్సరాలు సవాళ్లు ఎదుర్కొన్నాం. మూడేళ్లలో రాష్ట్రం రూ.66,116 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది’. కరోనా వల్ల దేశంతో పాటు ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయని జగన్ గుర్తు చేసారు.

ఇక గత ప్రభుత్వ విధానాల కారణంగా విద్య, వ్యవసాయ రంగాలు, మహిళా సాధికారత వంటివి కుదేలయ్యాయని టిడిపి ఫై మండిపడ్డారు. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రైతులను చంద్రబాబు మోసం చేశారు. ఐదేళ్లలో రూ.15వేల కోట్లు కూడా ఇవ్వలేదు. డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో మహిళలను దగా చేశారు’ అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read Also : Chandrababu: రేపు ఢిల్లీకి చంద్రబాబు, పొత్తులపై బీజేపీ నేతలతో భేటీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • assembly
  • CM Jagan Last Speech
  • jagan

Related News

Jagan App

Rape of Girl : మదనపల్లె ఘటనపై జగన్ ఫైర్..ఇదేనా లా&ఆర్డర్ ?

మదనపల్లెలో చిరుప్రాయపు బాలికపై జరిగిన అత్యాచారం మరియు హత్య ఉదంతం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందని జగన్ మండిపడ్డారు

  • Kiraak Rp Tdp

    Kiraak RP : కిరాక్ ఆర్పీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా..?

Latest News

  • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

  • మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

  • Encounter in Karregutta : కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

  • Kavitha New Party : కవిత పార్టీ సిద్ధాంతాలు ఇవే !!

  • బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd