AP Bus Accident: ఏపీలో బస్సు బోల్తా.. పదిమంది మృతి..ఎక్స్గ్రేషియా ప్రకటించిన జగన్
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- By Hashtag U Published Date - 06:00 PM, Wed - 15 December 21
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అశ్వరావుపేట నుంచి జంగారెడ్డి గూడెం వెళ్తుండగా, జంగారెడ్డిగూడెంకు 10 కి.మీ దూరంలో బస్సు జల్లేరువాగులో పడిందని, ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా పది మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉండగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
బస్సు వంతెన రెయిలింగ్ ను ఢీకొని 50 అడుగుల ఎత్తు నుండి జల్లేరువాగులో బోల్తా పడింది. క్రేన్ సహాయంతో బస్సును బయటకి తీశారు. ప్రమాదానికి గురైన బస్సు జంగారెడ్డిగూడెం డిపోకు చెందినదని అధికారులు తెలిపారు.
బస్సు ప్రమాదంపై అధికారులతో మాట్లాడిన జగన్ ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని,
గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా తగు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
PM @narendramodi has announced an ex-gratia of Rs. 2 lakh each from PMNRF for the next of kin of those who lost their lives in the bus accident in West Godavari, Andhra Pradesh.
— PMO India (@PMOIndia) December 15, 2021
Tags
Related News
Kodali: జగన్ హయాంలో 850 కోట్లతో టీడ్కో ఇళ్లు పూర్తి చేశాం: కొడాలి నాని
Kodali: గుడివాడకు చెందిన 100 మంది యువకులు, పలువురు టిడిపి నాయకులు ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైసీపీలో చేరారు. యువతకు పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే కొడాలి నాని వైసీపీలోకి ఆహ్వానించారు. చేరికల అనంతరం ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో కులమత పార్టీలు చూడకుండా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందజేసి వారి సొంతింటి కలను నిజం చేసేందుకు సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారన