HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Participates In Cii India

CII India : ఇండో – యూరోప్ బిజినెస్ రౌండ్ టేబుల్ లో చంద్రబాబు స్పీచ్ హైలైట్స్

CII India : ఇండియా-యూరప్ బిజినెస్ పార్టనర్‌షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశలో తీసుకుంటున్న కీలక నిర్ణయాలను వివరిస్తూ ప్రసంగించారు

  • Author : Sudheer Date : 13-11-2025 - 11:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Chandrababu Participates
Cm Chandrababu Participates

ఇండియా-యూరప్ బిజినెస్ పార్టనర్‌షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశలో తీసుకుంటున్న కీలక నిర్ణయాలను వివరిస్తూ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నం అద్భుతమైన సాగరతీర నగరమని, ఈ ప్రాంతంలో సహజ వనరులు, మౌలిక సదుపాయాలు సమృద్ధిగా ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా గూగుల్ అమెరికా వెలుపల తన అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేయడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ఈ ప్రాజెక్టుతో పాటు సబ్‌సీ కేబుల్ లింక్ కూడా ఇక్కడి నుంచే ఏర్పాటవుతుండటంతో విశాఖ గ్లోబల్ డిజిటల్ హబ్‌గా అవతరించబోతోందని ఆయన వివరించారు. గతంలో ఐటీ రంగాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ప్రోత్సహించిన తాను ఇప్పుడు అదే మార్గంలో మరింత ఆధునిక సాంకేతిక రంగాలపై దృష్టి సారిస్తున్నానని తెలిపారు.

Amaravati: అమరావతి అభివృద్ధికి ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

“భారత్ క్వాంటం మిషన్”లో భాగంగా దేశంలోని తొలి క్వాంటం వ్యాలీని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇదే విధంగా భవిష్యత్తు సాంకేతికతలో కీలకమైన డ్రోన్ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు “డ్రోన్ సిటీ”ని ఏర్పాటు చేస్తున్నామని, సివిల్ అప్లికేషన్లు, డిఫెన్స్ రంగాల్లో వీటి వినియోగం విస్తృతమవుతుందని వివరించారు. అంతేకాదు, స్పేస్ అప్లికేషన్లకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో “స్పేస్ సిటీ”ని కూడా ఏపీలో స్థాపించాలనే ప్రణాళిక ఉందన్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని, సౌర, పవన, పంప్డ్ హైడ్రో ప్రాజెక్టుల్లో రాష్ట్రం బలంగా ఉన్నదని చెప్పారు. భారతదేశం 500 గిగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించే దిశగా, ఆంధ్రప్రదేశ్ 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారిస్తోందని తెలిపారు.

అలాగే “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానాన్ని అమలు చేస్తున్నామని, కేవలం 45 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని వివరించారు. గూగుల్ ప్రాజెక్టుకు కూడా రెండు మూడు రోజుల్లోనే అనుమతులు మంజూరు చేయడం ఇందుకు ఉదాహరణగా చెప్పారు. పెట్టుబడిదారులు ముందుకు వస్తే వారికి ప్రత్యేక ఎస్కార్ట్ ఆఫీసర్లను నియమించి పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆయన “గ్లోబల్ మార్కెట్‌కి గేట్‌వే”గా అభివర్ణిస్తూ, విద్య, వైద్యం, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలు తదితర రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”లో ఆంధ్రప్రదేశ్‌కు సాటి రాష్ట్రం లేదని, యూరప్ పారిశ్రామిక వేత్తలు ఈ అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. “2047 నాటికి భారత్ ప్రపంచ అగ్రదేశంగా అవతరించనుంది, ఆ మార్గంలో ముందుండేది ఆంధ్రప్రదేశ్‌ అవుతుంది” అని సీఎం చంద్రబాబు నాయుడు నమ్మకంగా పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • chandrababu
  • CII India
  • Europe Business Partnership Round Table
  • Europe Business Partnership Round Table meeting

Related News

Governor Abdul Nazeer Ap As

ఏపీకి శాశ్వత రాజధాని అమరావతే – గవర్నర్

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, అమరావతి నిర్మాణాన్ని కేవలం ఒక నగరంలా కాకుండా, అత్యాధునిక సాంకేతికతతో కూడిన గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు

  • Threatening Letters To Ap Ministers

    ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖలు..ఎవరి పని ఇది ?

  • Janasena Minister Kandula D

    జనసేన మంత్రిని చంపేస్తామంటూ బెదిరింపులు..పోలీసులు అలర్ట్

  • Ap Govt Fee Reimbursement

    విద్యార్థులకు నారా లోకేష్ భరోసా : రూ.1200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ ! ఎందుకంటే ?

Latest News

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో విజ‌య యాత్ర కొనసాగిస్తున్న భార‌త్ జ‌ట్టు!

  • కంటి చూపు కోల్పోయిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్!

  • 5 లక్ష‌ల‌కు పైగా కార్లు రీకాల్‌.. కార‌ణ‌మిదే?!

  • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

  • న‌మీబియాపై భార‌త్ భారీ స్కోర్‌.. రాణించిన ఇషాన్ కిష‌న్‌, పాండ్యా!

Trending News

    • చెక్ బౌన్స్ అయితే ఎంత న‌ష్టమో తెలుసా?!

    • ఏఐ వాడుతున్నారా? అయితే ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    • బౌలింగ్ యాక్షన్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

    • ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడానికి స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదే!

    • ఏప్రిల్ 1 నుండి మారనున్న ప్ర‌త్యేక‌ నిబంధనలు ఇవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd