HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Naidu Gives Green Signal For Free Electricity

Free Current : ఫ్రీ కరెంట్ కు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..ఇక వారికీ పండగే !!

Free Current : ఈ ఉచిత విద్యుత్ పథకం ద్వారా సుమారు 50 వేల మగ్గాలు మరియు 15 వేల మర మగ్గాలు కలిగిన చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది

  • Author : Sudheer Date : 01-08-2025 - 5:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Government Good News For
Ap Government Good News For

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) చేనేతలకు శుభవార్త అందించింది. ఈరోజు నుండి ఉచిత విద్యుత్ అమలుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నిర్ణయంతో మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభించనుంది. నేతన్నల ఉచిత విద్యుత్ పథకం కోసం ఏపీ ప్రభుత్వం రూ.125 కోట్ల వ్యయాన్ని భరించనుంది. ఈ చర్య చేనేత రంగానికి గణనీయమైన ఊరటనిస్తుందని, వారి ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నారు.

ఈ ఉచిత విద్యుత్ పథకం ద్వారా సుమారు 50 వేల మగ్గాలు మరియు 15 వేల మర మగ్గాలు కలిగిన చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. చేనేతలకు ఇచ్చిన ఎన్నికల హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి మంత్రి సవిత తీసుకెళ్లగా, జాతీయ చేనేత దినోత్సవానికి వారం ముందుగానే ఈ ఉచిత విద్యుత్ పథకం అమలుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. చేనేతలకు ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు. కడప జిల్లాలోని జమ్మలమడుగులో ఈరోజు (శుక్రవారం) సీఎం చంద్రబాబు పర్యటించిన సందర్భంగా చేనేతల ఉచిత విద్యుత్ అమలుపై ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Karnataka : గుమస్తాకు కళ్లు చెదిరే ఆస్తులు..24 ఇళ్లు, 30 కోట్ల ఆస్తులు..షాక్‌ తిన్న అధికారులు

మరోవైపు, వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన రాజధాని రైతు కూలీ పెన్షన్లను కూటమి ప్రభుత్వం తిరిగి మంజూరు చేసింది. ఈ సందర్భంగా కృష్ణయపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు రాజధాని రైతులు పాలాభిషేకం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని రైతు కూలీ పెన్షన్లను నిలిపివేసింది, దీంతో వేలాది మంది రైతు కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లను యథావిధిగా కొనసాగిస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి చంద్రబాబు పెన్షన్లను మంజూరు చేయటం పట్ల రాజధాని ప్రాంత రైతు కూలీలు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో రాజధాని ప్రాంత రైతు కూలీలకు తిరిగి ఆర్థిక భరోసా లభించినట్లయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ రెండు నిర్ణయాలు – చేనేతలకు ఉచిత విద్యుత్, రాజధాని రైతు కూలీ పెన్షన్ల మంజూరు – ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap govt
  • CM Chandrababu
  • Free Current
  • handloom weavers

Related News

Ap Sanjeevani Scheme

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ – సీఎం చంద్రబాబు

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేసి, వారి ఆరోగ్య స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించేలా రూపొందించిన 'సంజీవని' ప్రాజెక్టును త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు

  • Cm Chandrababu & Minister N

    మహారాష్ట్రకు చంద్రబాబు, లోకేశ్

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

Latest News

  • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

  • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

  • భార‌త్‌- పాక్ మ్యాచ్‌పై శ్రీలంక ప్రత్యేక దృష్టి!

  • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

  • నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణ!

Trending News

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

    • జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

    • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd