Gruhini Scheme : కాపు మహిళల కోసం చంద్రబాబు సరికొత్త పథకం
Gruhini Scheme : “గృహిణి” పథకం (Gruhini Scheme) ద్వారా కాపు మహిళలకు (Kapu women) ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగంలో చర్చలు జరుగుతున్నాయి
- Author : Sudheer
Date : 29-05-2025 - 7:44 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓ వినూత్న పథకాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం “గృహిణి” పథకం (Gruhini Scheme) ద్వారా కాపు మహిళలకు (Kapu women) ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ పథకాన్ని అమలు చేసి వన్టైం కింద ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున ఇవ్వాలని ప్రతిపాదనలు రూపొందించబడ్డాయి.
Kavitha Issue : అక్కడ షర్మిలకు తల్లి సపోర్ట్..ఇక్కడ కూతురికి కేసీఆర్ సపోర్ట్ ఇస్తారా..?
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపు మహిళలకు స్వయం సహాయ పరంగా బలాన్ని అందించేందుకు ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. “గృహిణి” పథకాన్ని అమలు చేయాలంటే సుమారు రూ.400 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. కాపు మహిళలు ఈ సాయాన్ని వాణిజ్య, ఉపాధి, కుటుంబ అవసరాల కోసం వినియోగించుకునేలా ప్రోత్సాహం అందించేందుకు ఈ పథకం రూపొందించబడింది. ఇది కాపు మహిళల జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహదం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు.
Mahanadu : “వై నాట్ 175” వారి అడ్రస్ ఏది..? – నారా లోకేష్ ఏమన్నా సెటైరా..!
కాపు సంక్షేమానికి ఇప్పటికే ప్రభుత్వం రూ.4,600 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నిధులను ఉపయోగించి పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ఏడాదిలోనే దాని ఫలితాలు చూపిస్తామని కాపు కార్పొరేషన్ చెబుతోంది. “గృహిణి” వంటి పథకాలు కాపు మహిళలకు కొత్త ఆశలు కలిగించడమే కాకుండా, ప్రభుత్వం సంక్షేమంపై పెట్టే నిబద్ధతను కూడా స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. ఈ పథకం త్వరలో అమలులోకి వస్తే లక్షలాది మంది కాపు మహిళలకు నేరుగా లబ్ధి చేకూరనుంది.