Chandrababu: ఇవాళ ఢిల్లీకి చంద్రబాబు.. ఎందుకో తెలుసా?
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు.
- By Balu J Published Date - 01:44 PM, Mon - 27 November 23
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా కొడుకు పెళ్లికి ఆయన వెళ్లనున్నారు. సిద్ధార్థ్ లూథ్రా కుమారుడి పెళ్లి రిసెప్షన్ వేడుక ఢిల్లీలో జరగనుంది. ఈనేపథ్యంలో చంద్రబాబు కుటుంబంతో కలిసి ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఇప్పటికే నారా లోకేష్ యువగళం పాద్రయాత్రను పున:ప్రారంభించడంతో చంద్రబాబు తన భార్య భువనేశ్వరితో కలిసి ఈ వేడుకకు వెళ్లనున్నారు.
ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్లి రాత్రి జరిగే రిసెప్షన్ కు హాజరవుతారు. రేపు సాయంత్రం తిరిగి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరుతారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ఆయన తరుపున లాయర్ గా సిద్ధార్థ్ లుథ్రా తన వాదనలు వినిపించారు.
చంద్రబాబుకు మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ రావడంలో సిద్ధార్థ్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే మధ్యంతర బెయిల్ మీద చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. తనకు అనారోగ్య కారణాల వల్ల ఏపీ హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చినా ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం చంద్రబాబు పలు అనారోగ్య సమస్యలకు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.
Related News
Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. రహస్యంగా ఉంచాలని కోరిన ఐసీసీ..!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు క్వాలిఫైయింగ్ మ్యాచ్లన్నీ ఒకే నగరంలో జరగాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంటే ICCకి సూచించింది.