Chandrababu : నేడు సీఐడీ కస్టడీకి చంద్రబాబు.. విచారించనున్న 9 మంది సీఐడీ అధికారులు
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో నేడు చంద్రబాబును సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. రాజమండ్రి సెంట్రల్
- By Prasad Published Date - 08:28 AM, Sat - 23 September 23
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో నేడు చంద్రబాబును సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించాలని ఏసీబీ కోర్టు సీఐడీ అధికారులను ఆదేశించింది. ప్రతి గంటకు ఐదు నిమిషాల పాటు ఆయనకు బ్రేక్, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇవ్వాలని ఏసీబీ కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. చంద్రబాబును 9మంది సీఐడీ అధికారులు విచారణ చేయనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు విచారణకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇవాళ ,రేపు సీఐడీ కస్టడీలో చంద్రబాబు ఉండనున్నారు.
సీఐడీ డీఎస్పీ ధనుంజేయుడు నేతృత్వంలో 9 మంది విచారణ బృందం మరికాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకోనుంది. 9:30 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారణ ప్రారంభం కానుంది. విచారణ అధికారులుగా ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలతో పాటు ఎఎస్ఐ, కానిస్టేబుల్ ఉన్నారు. సెంట్రల్ జైల్ కాన్ఫరెన్స్ హాల్లోనే సీఐడీ బృందం విచారించనుంది. ఏసీబీ కోర్ట్ ఆదేశాల ప్రకారం విచారణ కొనసాగనుంది. విచారణ మొత్తాన్ని ఒక వీడియో గ్రాఫర్, ఇద్దరు టైపిస్టులు రికార్డ్ చేయనున్నారు. చంద్రబాబు తరుపు న్యాయవాది సమక్షంలో విచారణ జరగనుంది.
Related News
AP : ఏపిలో ఈ- ఆఫీస్ అప్ గ్రేడ్ కార్యక్రమాన్ని వాయిదా వేసిన ఈసీ
E-Office: ఏపిలో ఈ-ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ఆదేశించింది. ఏపిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ- ఆఫీస్ స్టాఫ్ట్ వేర్ను అప్గ్రేడ్ చేఏందుకు ఎన్ఐసీ(నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్) ఈనెల18 నుండి 25 వరకు షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. We’re now on WhatsApp. Click to Join. అయితే గ్రామ, వార్డు సచివాలయాలకు ఈ-ఆఫీస్ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో �