Chandrababu : బటన్ నొక్కేందుకు నువ్వేందుకు ముసలమ్మ చాలు
ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. పోలింగ్కు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల్లోకి ప్రస్తుత ఏపీ పరిస్థితులను వివరించేందుకు టీడీపీ కూటమి తీవ్రంగా శ్రమిస్తోంది.
- Author : Kavya Krishna
Date : 24-04-2024 - 8:20 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. పోలింగ్కు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల్లోకి ప్రస్తుత ఏపీ పరిస్థితులను వివరించేందుకు టీడీపీ కూటమి తీవ్రంగా శ్రమిస్తోంది. గత ఐదేండ్లుగా ప్రజలను అధికారం పార్టీ ఎలా మోస చేస్తోందో చెప్పందుకు నడుం బిగించారు. అయితే.. గత ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలను చిత్రహింసలకు గురిచేసి వారి జీవితాలను నాశనం చేశారని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
శ్రీకాకుళంలో మహిళలతో ముఖాముఖి సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జగన్ పాలన రాష్ట్రాన్ని నాశనం చేసిందని, రాబోయే ఎన్నికల్లో ఆయనను గద్దె దించాలని ప్రజలను అభ్యర్థించారు. “మనం ఎల్లప్పుడూ సంపదను సృష్టించాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి. పెరిగిన ఆదాయాన్ని రాష్ట్రాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి వినియోగించాలి. ముసలమ్మ (వృద్ధురాలు) కూడా అప్పులు తెచ్చి బటన్ నొక్కుతుంది. అది నాయకత్వం కాదు’’ అని చంద్రబాబు అన్నారు. “సంపద సృష్టించి, ఉద్యోగాలు కల్పించి, దేశాన్ని ముందుకు తీసుకెళ్లేవాడే నిజమైన నాయకుడు. సంపదను దోచుకునేవాడు, ప్రజలను హింసించేవాడు, దేశాన్ని వెనక్కి తీసుకువెళ్లేవాడు మూర్ఖుడు,” అన్నారాయన. రాష్ట్రంలో టీడీపీని మహిళలకు మాతృభూమిగా అభివర్ణించిన ఆయన.. బాధ్యతాయుతమైన పెద్ద కొడుకుగా రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. “అమ్మకు వందనం” కార్యక్రమం కింద పాఠశాలకు వెళ్లే ప్రతి చిన్నారికి రూ.15,000 ఆర్థిక సహాయం అందజేస్తానని, ప్రతి ఇంటికి నీరు అందేలా చూస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే డ్వాక్రా గ్రూపులకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం, మహిళలకు వడ్డీలేని రుణాలు, సొంత ఇళ్లు లేని మహిళలకు చిన్న ప్లాట్లో ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అదనంగా, వృద్ధులకు రూ.4,000, వికలాంగులకు రూ.6,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. మే 13న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు తమ ఓట్లను విజ్ఞతతో వినియోగించుకోవాలని చంద్రబాబు నాయుడు కోరారు.