AP : జగన్ ఫొటో ఉన్న పాస్ పుస్తకాలను తగలబెట్టిన చంద్రబాబు
'మీ తాతలు, తండ్రి ఇచ్చిన పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకు? అడిగితే నాపై కేసు పెడతా అంటున్నాడు. ఏం పీక్కుంటావో పీక్కో అని చెప్పా'
- Author : Sudheer
Date : 06-05-2024 - 1:31 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ(AP) లో రాజకీయ పార్టీల ప్రచారం పిక్ స్టేజ్ లో నడుస్తుంది. ఎన్నికల పోలింగ్ కు వారం రోజుల సమయం కూడా లేకపోవడం తో కూటమి అభ్యర్థులు ఇంకాస్త జోరు పెంచారు. ముఖ్యంగా జగన్ తీసుకొచ్చిన భూహక్కు చట్టం (AP Land Titling Act) ఫై పార్టీల అధినేతలు మాట్లాడుతూ ప్రజల్లో భయం పెంచుతూ వస్తున్నారు. జగన్ తెచ్చిన భూహక్కు చట్టం ఇంకా అమల్లోకి రానప్పటికీ.. అది అమల్లోకి వస్తే ఏం జరుగుతుందన్న దానిపై గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఈ చట్టం ఫై ప్రజల్లో కాస్త ఆందోళన ఉంది. ఇప్పుడు ఆ ఆందోళలను మరింత పెంచుతూ కూటమి క్యాష్ చేసుకుంటుంది.
We’re now on WhatsApp. Click to Join.
వైసీపీ సర్కార్ (YCP) మళ్లీ గెలిస్తే మీ భూములు వదులుకోవాల్సిందే అని..మీ భూములకు మీరు కాదు యజమానులు..జగన్ యజమాని అవుతాడని..మీ పాసుపుస్తకాన్ని తీసుకోని ఎక్కడికి వెళ్లిన రూపాయి ముట్టదని, పేరుకు ఆ పుస్తకంలో మీ వివరాలు ఉంటాయి కానీ దానికి అసలు యజమాని జగన్ అవుతాడని చెపుతూ వస్తుంది. తాజాగా దర్శి లో ప్రచారం చేసిన బాబు..పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ ఫొటో ఎందుకంటూ జగన్ ఫొటో ఉన్న పాసుపుస్తకాన్ని చించిపారేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చి ప్రజల మెడలకు జగన్ ఉరితాడు బిగించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక ఈరోజు ఏకంగా జగన్ ఫోటో ఉన్న పాస్ పుస్తకానికి నిప్పుపెట్టి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు.
‘మీ తాతలు, తండ్రి ఇచ్చిన పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకు? అడిగితే నాపై కేసు పెడతా అంటున్నాడు. ఏం పీక్కుంటావో పీక్కో అని చెప్పా. ఈ కాపీని మీ ముందే చించి, తగలబెడుతున్నా’ అంటూ పాస్ పుస్తకాలకు నిప్పంటించారు చంద్రబాబు. ‘మీ భూములన్నీ ఆయన కాజేస్తే.. చూస్తూ ఊరుకోవాలా?’ అని పాణ్యం సభలో ఫైరయ్యారు.
Read Also : Preity Zinta: ఐపీఎల్ తో కోట్లు సంపాదిస్తున్న ప్రీతి జింటా!