Chandrababu Arrest : చంద్రబాబును జైలుకు పంపించడం వైసీపీ కి ప్లస్సా..? మైనస్సా..?
చంద్రబాబు (Chandrababu)ను ఈరోజు జగన్ సర్కార్ కక్ష్య సాధింపు చర్య గా జైల్లో పెట్టింది. చంద్రబాబు అరెస్ట్ అనే పదం విని ఎంతోమంది గుండెలు ఆగాయి.
- By Sudheer Published Date - 01:22 PM, Mon - 11 September 23
Chandra Babu Remand : 40 ఏళ్ల రాజకీయం..14 ఏళ్ల సీఎం పదవి..ఎన్నో పధకాలు..ఎంతో అభివృద్ధి..ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితుడు..ఒక విజన్. అలాంటి చంద్రబాబు (Chandrababu) ను ఈరోజు జగన్ సర్కార్ (YCP Government) కక్ష్య సాధింపు చర్య గా జైల్లో పెట్టింది. చంద్రబాబు అరెస్ట్ అనే పదం విని ఎంతోమంది గుండెలు ఆగాయి. ఓ పెద్దయ్యాను అరెస్ట్ చేస్తారా అంటూ యావత్ యువత రగిలిపోతుంది. కోట్లాది కోట్లు దోచేసి.. 16 నెలల పాటు జైలు జీవితం గడిపి.. బెయిల్ ఫై బయటకు వచ్చిన జగన్.. ఈనాడు తన వయసును సైతం లెక్కచేయకుండా ప్రజలకోసం రాత్రిబవళ్లు కష్టపడుతూ.. ప్రజల కష్టాలను తీర్చాలని తాపత్రయపడుతున్న చంద్రనన్ను అరెస్ట్ చేస్తారా అని మహిళా లోకం గగ్గోలు పెడుతుంది.
చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) కు నిరసనగా యావత్ ప్రజలోకం రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తుంటే.. వైసీపీ నేతలు మాత్రం స్వీట్స్ పంచుకుంటూ బాణా సంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. న్యాయాన్ని బ్రతికించే వ్యక్తి జైల్లో..అన్యాయం చేసే వాడు బయటనా.. ఇదెక్కడి న్యాయం..? అంటున్నారు తెలుగు ప్రజలు. అసలు చంద్రబాబు ను జైల్లో పెట్టించి వైసీపీ సాధించింది ఏంటి..? చంద్రబాబు అరెస్ట్ వైసీపీ కి ప్లస్సా..? మైనస్సా..? దీనిపై ప్రజలు ఏమంటున్నారు.? రాజకీయ విశ్లేషకులు ఏంచెపుతున్నారు..? అనేది చూద్దాం.
Read Also : PV Ramesh : అధికారులను వదిలేసి.. మాజీ సీఎంను అరెస్ట్ చేయడమేంటి : పీవీ రమేశ్
రాజకీయాల్లో సానుభూతి అనేది చాల ఉపయోగపడుతుంది. సానుభూతితో అధికారం చేపట్టినవారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా అదే జరగబోతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన చంద్రబాబు ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని చూస్తున్నారు ఇందుకు జనసేన పార్టీ కూడా సపోర్ట్ గా నిలుస్తుంది. రాబోయే ఎన్నికల్లో జగన్ ను గద్దె దించడమే లక్ష్యం గా టీడీపీ – జనసేన పార్టీలు (TDP – Janasena) బరిలోకి దిగుతున్నాయి. ప్రజలు సైతం జగన్ మాకు వద్దు బాబోయ్ అనే అభిప్రాయంలో ఉన్నారు. ఈ క్రమంలో జగన్.. ఎలాగైనా చంద్రబాబు (Chandrababu)ను జైలు కు తరలించాలని ఫిక్స్ అయ్యాడు. ఎప్పటిదో కేసును (Skill Development Case) బయటకు లాగాడు. చంద్రబాబు పేరే లేని ఈ కేసులో ఆయన్ను ఇరికించాడు. అధికారం చేతిలో ఉంది కాదా అని అధికారులను భయపెట్టి.. చంద్రబాబును జైలుకు వెళ్లేలా చేసాడు. ఇక్కడే జగన్ తప్పు (Jagan Mistake) చేసాడని ప్రజలు అంటున్నారు. ఈ పరిణామంతో టీడీపీకి సానుభూతి (Sympathy Votes) ఓట్లు పడేలా చేస్తుందని చెపుతున్నారు.
చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలి సారి రిమాండ్ కు వెళ్లారు. ఈ సమయంలో జగన్ కు అనుకూల.. చంద్రబాబు మద్దతు దారుల అభిప్రాయాలతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) అక్రమం అంటూ టీడీపీ బంద్ కు పిలుపునిచ్చింది. పవన్ మద్దతుగా నిలిచారు. పొత్తులు, సానుభూతి సహజంగా ప్రభుత్వం పైన ఉండే వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు.
చంద్రబాబు అరెస్ట్ అయి జైలుకు వెళ్లటంతో టీడీపీకి సానుభూతి (TDP Sympathy) వస్తుంది.. జగన్ ఎందుకిలా చేసారంటూ వైసీపీ (YCP Leaders) వర్గీయుల్లో కూడా చర్చ మొదలైంది. కాంగ్రెస్ ను విభేదించి బయటకు వచ్చి పార్టీ పెట్టిన తరువాత జగన్ పైన కేసుల కారణంగానే సానుభూతి వచ్చిందని.. ఇదే ఇప్పుడు చంద్రబాబు విషయంలో రిపీట్ అవుతుందని మాట్లాడుకుంటున్నారు.
Read Also : Rajahmundry Central Jail : చంద్రబాబు ఫస్ట్ డే జైలు జీవితం ఎలా గడుస్తుందంటే..
మరోపక్క ప్రజల్లోకి నారా భువనేశ్వరి, బ్రాహ్మణి (Nara Brahmani)లు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రం కోసం, ప్రజల కోసం కష్టపడుతున్న చంద్రబాబును తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారని.. దీనికి న్యాయం మీరే చెప్పాలని వారు ప్రజల వద్దకు వెళ్లే ఆలోచన చేస్తున్నారు. నారా లోకేష్ పైనా సీఐడీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనను కూడా అరెస్ట్ చేస్తామని పరోక్షంగా చెప్పారు. ఒక వేళ అదే జరిగితే లోకేష్ పాదయాత్ర ఆపేయాల్సి ఉంటుంది. అందుకే.. వెంటనే.. విరుగుడుగా.. భువనేశ్వరి, బ్రాహ్మణిలు పార్టీ తరపున రంగంలోకి దిగి.. లోకేష్ ఆపేసిన దగ్గర్నుంచి పాదయాత్ర చేయాలనే ఆలోచనలో ఉన్నారట.
రాజకీయాల్లో సానుభూతి మించిన అస్త్రం మరోటి లేదు. ఈ సానుభూతి తోనే వైస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) అధికారంలోకి వచ్చారు. వైఎస్ చనిపోయిన తర్వాత సానుభూతి అస్త్రం తో జగన్ ప్రజల్లోకి వెళ్లారు. ఉపఎన్నికల్లో భారీ విజయాలు సాధించారు. ఆదిలాబాద్ నుంచి చిత్తూరు వరకూ ఆ సానుభూతి వేవ్ కనిపించింది. గత ఎన్నికల్లోనూ ఆయన ఒక్క చాన్స్ అని ప్రజలను వేడుకున్నారు. ప్రజల్లో టిడిపికి వ్యతిరేకత లేనప్పటికీ జగన్ ఫై సానుభూతి తో ప్రజలు ఆయనకు ఓటువేసి గెలిపించారు. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు.. ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల పార్టీ పగ్గాలు పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి జగన్ గెలుపు కోసం పోరాటాం చేసారు. ఈ సానుభూతి కూడా జగన్ గెలుపుకు కారణమైంది. ముఖ్యంగా మహిళల్లో సానుభూతి పవనాలు వీస్తే ఫలితాలు పూర్తి స్థాయిలో ఏకపక్షమవుతాయన్న అంచనాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ ను టీడీపీ సానుభూతి కింద మార్చుకోవాలని, దీనిని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లి ఓట్లుగా మార్చుకోవాలని చూస్తునారు.
Read Also : 14 Died: చంద్రబాబు అరెస్ట్ తో ఆగిన గుండెలు, రాష్ట్రవ్యాప్తంగా 14 మంది మృతి!
ఇదో రకంగా వైసీపీ పార్టీ కి పెద్ద మైనస్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోసారి అధికారంలోకి రావాలంటే ప్రజల్లోకి మరిన్ని సంక్షేమ పథకాలతో.. అభివృద్ధి పేరుతో వెళ్ళాలి కానీ.. ప్రతిపక్ష నేతలను జైలు కు పంపించి ప్రజల్లోకి వెళ్తానంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. గతంలో సానుభూతి తోనే జగన్ అధికారంలోకి వచ్చిన విషయాన్నీ మరచిపోతున్నారని హెచ్చరిస్తున్నారు. ఇప్పటీకే జగన్ ఫై ప్రజల్లో వ్యతిరేకత ఉంది.. ఇప్పుడు చంద్రబాబు ను అరెస్ట్ చేయించి ప్రజల్లో మరింత వ్యతిరేకత పెంచుకున్నాడని అంతా అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికి చంద్రబాబు అరెస్ట్ విషయంలో జగన్ & టీం తొందరపడ్డారని చెపుతున్నారు.
Tags
Related News
Zero Impact : వైసీపీది దింపుడు కళ్లెం ఆశలేనా..?
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది.. అందరూ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం ప్రారంభించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ- బీజేపీ- జేఎస్పీ కూటమి అఖండ విజయం సాధిస్తుందని చాలా మంది నమ్ముతున్నారు.