NCBN: రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం సర్పంచ్ లు పోరాడాలి – టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగు దేశం పార్టీ నుంచి గెలిచిన గ్రామ సర్పంచ్ లు నిజమైన హీరో లు అని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
- By Hashtag U Published Date - 10:57 PM, Thu - 24 February 22
అమరావతి: తెలుగు దేశం పార్టీ నుంచి గెలిచిన గ్రామ సర్పంచ్ లు నిజమైన హీరో లు అని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైసిపి డబ్బు, అధికారం, ఒత్తిళ్లు వంటి సవాళ్లను ఎదుర్కొని ఎన్నికల్లో పోరాడి గెలిచిన మీరే నిజమైన హీరోలు అంటూ చంద్రబాబు సర్పంచ్ లను ప్రశంసించారు. టిడిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన సర్పంచ్ ల అవగాహన సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు.
రాజ్యాంగం సర్పంచ్ లకు ఇచ్చిన హక్కులపై పోరాటం చెయ్యాలని పిలుపు నిచ్చారు. దేశంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఉన్నట్లు…గ్రామంలో సర్పంచ్ ప్రభుత్వం ఉంటుందని అన్నారు. పంచాయతీలకు రావాల్సిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటే దొపిడీ అనాలా..? ఇంకేమైనా అనాలా..? అని ప్రశ్నించారు. చెత్తపన్ను వసూలు చేసేదే లేదని పంచాయతీల్లో తీర్మానం చేయాలి అని చంద్రబాబు సూచించారు. నా గవర్నమెంటు నా ఇష్టం అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నారు.. నా పంచాయతీ నా ఇష్టం అని సర్పంచులూ చెప్పాలి అని వివరించారు. 14,15 ఆర్ధిక సంఘం నిధులు, నరేగా నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందని…దీనిపై పోరాటం చెయ్యాలని చంద్రబాబు సర్పంచ్ లకు సూచించారు. నరేగా పనుల్లో 6 వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని వివరించారు. వీటిపై పోరాడాలని….పోలీసు కేసులకు భయపడకండి…అవసరం అయితే తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై ప్రైవేట్ కేసులు వేద్దాం అని దైర్యం చెప్పారు.
ఒక వ్యక్తి ఎంతగా అబద్ధాలు చెప్పొచ్చు అనేది జగన్ చూస్తే అర్ధం అవుతుందని చంద్రబాబు అన్నారు. వివేకా హత్య లో జగన్ ఎప్పుడు ఏమి చెప్పాడో చూస్తే జగన్ వైఖరి పూర్తిగా అర్ధం అవుతుందని అన్నారు. నేను వివేకా హత్య చేయించాను అని నాకు రక్తం మరక అంటించే ప్రయత్నం చేశారు…..ఇప్పుడు సిబిఐ విచారణ లో నిజాలు బయటకు వస్తున్నాయని చెప్పారు.
జగన్ సోదరి…జగనన్న బాణం షర్మిల ఇప్పుడు ఎక్కడ తిరుగుతుంది అంటూ ప్రశ్నించారు. జగన్ మరో సోదరి సునీత తన తండ్రి హత్యపై ఎలా ఫైట్ చేస్తుందో కూడా మనం చూస్తున్నాం అని చంద్రబాబు అన్నారు. గొడ్డలి పోటును గుండె పోటు అని చెప్పే ప్రయత్నం చేశారని….హత్య కేసు పెట్టవద్దని ఏకం గా CI శంకరయ్య ను బెదిరించిన విషయాలు బయటకు వస్తున్నాయన్నారు. వివేకా శవానికి కుట్లు వేసి….గాయాలు కనపడకుండా పూలు పెడతారా?…మనుషులు ఈ పనులు చేయగలరా….అని చంద్రబాబు అన్నారు. దర్యాప్తు చేస్తున్న CBI అధికారులపైనే కేసు కేసు పెట్టడం దేశం లో ఎక్కడైనా ఉందా అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సిఎం స్థానం లో ఉన్న జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసత్యాలను, అబద్ధాలను సమర్థవంతంగా చెప్పి జగన్ రాజకీయ లబ్ధి పొందారని..మనం ప్రతి అంశం పై నిజాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని సర్పంచ్ లను కోరారు.
Related News
Amaravati : దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతా – చంద్రబాబు
జగన్ మూడు రాజధానుల పేరుతో నాటకాలాడారని.. చివరకు రాజధాని లేకుండా రాష్ట్రాన్ని వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు