Nani and Radha: వైరల్ గా మారిన కొడాలి నాని, వంగవీటి రాధా టీ ముచ్చట.. ఏం మాట్లాడుకున్నారు?
- By Hashtag U Published Date - 11:16 AM, Sun - 20 March 22
రెండు టెన్ థౌజండ్ వాలాలు కలిస్తే ఏమవుతుంది? రెండు డైనమెట్లు ఒక్కచోట ఉంటే ఏమవుతుంది? ఆ పవర్, ఆ ఎనర్జీ నెక్స్ట్ లెవల్ అంతే! ఏపీ పాలిటిక్స్ లో హాట్ పొలిటికల్ పర్సనాల్టీలు ఎవరు అంటే.. రెండు పేర్లు వినిపిస్తాయి. ఒకరు.. రాష్ట్రమంత్రి కొడాలని నాని. మరొకరు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ. వాళ్ల గురించి మాట్లాడితేనే సంచలనం అవుతుంది. అలాంటిది వాళ్లిద్దరూ ఎప్పుడైనా కలిస్తే.. అది సెన్సేషన్ అవుతుంది. ఈమధ్యనే ఇద్దరూ ఆటోలో టీ ముచ్చట పెట్టారు. ఇంతకీ వారు ఏం మాట్లాడుకున్నారు?
వైసీపీ నేత, గుడివాడ మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ బాబ్జీ అంతిమమాత్ర కోసం కొడాలి నాని, వంగవీటి రాధా.. ఇద్దరూ గుడివాడ వచ్చారు. అక్కడే కలుసుకున్నారు. అంతిమయాత్రలో పాల్గొంటూ.. మధ్యలో ఓ ఆటో కనపడగానే.. అందులోనే కూర్చొని టీ తాగుతూ మాట్లాడుకున్నారు. అసలే వీరిద్దరి మధ్యా పొసగడం లేదన్న టాక్ ఉంది. అలాంటి సమయంలో ఇలా మాట్లాడుకునేసరికీ.. వారిమధ్య చర్చకు వచ్చిన టాపిక్ ఏమిటా అన్న డిస్కషన్ నడుస్తోంది.
వంగవీటి రాధా పార్టీ మార్పుపై ఈ మధ్య జోరుగా ప్రచారం నడుస్తోంది. దానికి తగ్గట్టే ఆయన అడుగులు కూడా పడుతున్నాయి. ఇప్పుడు వీరు మాట్లాడుకుంది ఏ విషయం మీద అన్నది చెప్పలేకపోయినా.. గతంలో కూడా వీరి మధ్య భేటీలు జరిగాయని వారి అనుచరులు గుర్తుచేస్తున్నారు. వంగవీటి రాధా వైసీపీలో చేరేటట్లుగా కొడాలి నాని ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనే ఆయనను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కానీ రాధా మాత్రం ఆ ఆఫర్ ను కాదన్నట్టు సమాచారం.
ఈమధ్యనే రాధా హత్యకు రెక్కీ కూడా నిర్వహించినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా రాధా ఇంటికి వెళ్లి కలిశారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పుడు కూడా పార్టీ మారడం లేదనే సంకేతాలే ఇచ్చారు. కానీ ఇప్పుడు కొడాలి నానితో ఇలా టీ ముచ్చట పెట్టేసరికీ.. రాజకీయంగా ఇది హాట్ టాపిక్ గా మారింది.
Related News
Praja Rajyam party: ప్రజారాజ్యం నాశనం కావడానికి కారణం అతనే: పవన్
ప్రజారాజ్యం ... మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పార్టీ ఇది. ఓ పదిహేనేళ్ళ క్రితం ఈ పేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ, కాంగ్రెస్ ఏలుతున్న రోజులవి. 2008 ఆగస్టు 26న ఎన్నో ఆశలు, ఆశయాలతో స్థాపించారు మెగాస్టార్ చిరు. ప్రజారాజ్యంలో యువరాజ్యం సగభాగం. యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నారు.