HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Centers Huge Package For Visakha Steel Plant Chandrababu Is Emotional

Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం భారీ ప్యాకేజ్..చంద్రబాబు ఎమోషనల్

vizag steel plant : కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా రూ. 17 వేల కోట్ల ప్యాకేజీగా ప్రచారం జరిగినప్పటికీ, చివరికి అధికారికంగా రూ. 11,440 కోట్లకు ఆమోదం లభించింది

  • By Sudheer Published Date - 07:22 PM, Fri - 17 January 25
  • daily-hunt
CBN world economic forum conference
CBN world economic forum conference

కష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారానికి (Visakhapatnam Steel Plant) కేంద్ర ప్రభుత్వం (Central Government) భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి ఊపిరి పోసింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన ప్రకారం .. రూ. 11,440 కోట్ల (Rs 11,500 crore) ప్యాకేజీని ఈ కర్మాగారానికి అందించనున్నట్లు తెలిపారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా రూ. 17 వేల కోట్ల ప్యాకేజీగా ప్రచారం జరిగినప్పటికీ, చివరికి అధికారికంగా రూ. 11,440 కోట్లకు ఆమోదం లభించింది. ఈ ప్యాకేజీపై సీఎం చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు.

ఈ మేరకు ఎక్స్ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ” విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ప్యాకేజీ చరిత్రాత్మక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇదో గర్వించదగిన, భావోద్వేగ సమయం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సర్కారు ఏర్పాటైన తర్వాత ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉంది. ఆ కృషికి కేంద్రం స్పందించింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను బతికించడం కోసం రూ.11,440 కోట్లు ఆర్థిక మద్దతు ఇచ్చింది. స్టీల్ ప్లాంట్ విషయంలో మద్దతుగా నిలిచిన ప్రధానమంత్రి నరేంంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వికసిత్ భారత్ – వికసిత్ ఆంధ్రలో భాగంగా దేశ నిర్మాణం కోసం ప్రధానమంత్రి విజన్‌లో నేనూ భాగస్వామిని అవుతా. ” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Nithya Menon : పీరియడ్స్‌ అని చెప్పిన వారు వినలేదట – నిత్యామీనన్ కీలక వ్యాఖ్యలు

ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మూడు బ్లాస్ట్ ఫర్నేసులు ఉన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందులతో రెండింటిని మాత్రమే నిర్వహిస్తున్నారు. ముడిసరుకు కొరత కారణంగా ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ప్లాంట్‌ను పునరుద్ధరించేందుకు కొత్తగా మూడు ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసులను ఏర్పాటు చేయడానికి రూ. 7,500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కొత్త ఫర్నేసులతో నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త ఫర్నేసుల ద్వారా లాంగ్ ప్రొడక్టులు, భవన నిర్మాణాలు, మౌలిక వసతుల రంగాల్లో వినియోగించే అధిక నాణ్యత కలిగిన ఉక్కును ఉత్పత్తి చేస్తారు. దీని ద్వారా విదేశీ మార్కెట్లకు ఉక్కు ఎగుమతి చేసేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి ప్లాంట్‌ను లాభదాయకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశముంది.

కేంద్ర ప్యాకేజీ ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పునరుజ్జీవం పొందే అవకాశం ఉందని అంత భావిస్తున్నారు. కేంద్రం నుండి అందిన ఆర్థిక సహాయం ద్వారా ప్లాంట్ నిర్వహణను మెరుగుపరచి, నష్టాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్యాకేజీతో పాటు నిర్వహణ ఖర్చుల కోసం రూ. 10,000 కోట్ల నిధులను వెచ్చించే అవకాశం ఉండటంతో, ప్లాంట్ భవిష్యత్తుపై ఆశలు పెరిగాయి.

Today marks a historic moment etched in steel. It is an emotional and proud moment for people of Andhra Pradesh, as the Union Government, in response to GoAP’s consistent efforts since the formation of NDA Government, has approved financial support of Rs. 11,440 crore to revive… pic.twitter.com/O3WxPUh7SU

— N Chandrababu Naidu (@ncbn) January 17, 2025


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 500 Crore
  • Centre Approves Financial Package Of Rs 11
  • chandrababu
  • Chandrababu Tweet
  • vizag steel plant

Related News

Cbn Sharmila

Sharmila Meets CBN : సీఎం చంద్రబాబును కలవబోతున్న షర్మిల..ఎందుకంటే !!

Sharmila Meets CBN : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Jagan) కూటమి ప్రభుత్వంపై దాడులు ప్రారంభిస్తే, మరోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Sharimla) కూడా బరిలోకి దిగుతున్నారు. జగన్ డిజిటల్ బుక్ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను

  • Let's decide who will win!..KTR challenges CM Revanth Reddy

    CM Revanth : ఆ ఇద్దరు ఆడించినట్లు రేవంత్ ఆడుతున్నాడు – KTR

  • Lokesh Fire Assembly

    Vizag Steel Plant : వైసీపీ నేతలకు చెమటలు పట్టించిన నారా లోకేష్

  • Cbn Macharla

    CBN : చెత్త రాజకీయాలు చేస్తే..చెత్త పారేసినట్లు పారేస్తా – చంద్రబాబు వార్నింగ్

Latest News

  • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

  • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

  • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

  • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

  • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd