HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Cbn Government Spent Rs 47 Thousand Crores Of Debt Perni Nani

Chandrababu : నాలుగు నెలల్లో కూటమి సర్కార్ రూ. 47 వేల కోట్ల అప్పు – పేర్ని నాని

Chandrababu : చంద్రబాబు నాలుగు నెలల్లోనే రూ.47 వేల కోట్ల అప్పులు చేశారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు

  • By Sudheer Published Date - 07:10 PM, Mon - 28 October 24
  • daily-hunt
Perni Nani Cbn
Perni Nani Cbn

సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు (Chandrababu) నాలుగు నెలల్లోనే రూ.47 వేల కోట్ల (Rs. 47 thousand crores) అప్పులు చేశారని మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఆరోపించారు. సంపద సష్టిస్తామని తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి రావడమే కాకుండా, ప్రజల ఆస్తులను దొడ్డిదారిన తన అనుచరుల జేబుల్లోకి మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ హయాంలో పోర్టుల నిర్మాణంపై జరిగిన పరిణామాలను నాని ప్రస్తావించారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల పనులు నాలుగు నెలలుగా అటకెక్కాయని పేర్కొన్నారు. జగన్ హయాంలో నిధుల ఇబ్బందులు లేకుండా పోర్టుల నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో రామాయపట్నం పోర్టు రూ.3,736 కోట్లతో శరవేగంగా నిర్మాణం జరుగుతున్నా, ఎన్నికల కోడ్ కారణంగా ప్రారంభానికి దూరమైందని పేర్కొన్నారు.

మచిలీపట్నం పోర్టును ఆరు నెలల్లో పూర్తి చేసి షిప్‌ తెస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు, ఆ పని చేయకపోగా, నాలుగు నెలల్లోనే దాన్ని ప్రైవేటుపరం చేస్తున్నారని ఆక్షేపించారు. గత ప్రభుత్వ హయాంలో రూ.5156 కోట్ల వ్యయ అంచనాతో ఆ పోర్టు పనులు మొదలుపెట్టి, 50 శాతం పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక శ్రీకాకుళం జిల్లాకు మణిహారం వంటి మూలపేట పోర్టు పనులు కూడా రూ.4360 కోట్ల వ్యయ అంచనాతో మొదలుపెడితే, చంద్రబాబు ప్రభుత్వం ఆ పనులు కూడా అటకెక్కించిందని పేర్ని నాని అన్నారు. జగన్ సృష్టించిన వాటి సంపద పంచుకునేందుకు డెవలప్‌మెంట్‌–ఆపరేషన్‌–మెయింటెనన్స్‌ (డీఓఎం) పేరిట అమ్మకానికి పెట్టారని ఆయన ఆగ్రహించారు.

Read Also : Vizianagaram : మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chandrababu Govt
  • perni nani
  • Rs. 47 thousand crores

Related News

    Latest News

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

    • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

    • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd