HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Cant Supply Milk To Anganwadis In Andhra Pradesh If Dues Pending Kmf

ఏపీలో అంగన్వాడీకి పాలసరఫరా బంద్…కారణం ఇదే…?

ఏపీ ప్రభుత్వానికి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ షాక్ ఇచ్చింది. ఏపీలోని అంగన్వాడీలకు పాల సరఫరా నిలిపివేస్తున్నట్లు కెఎమ్ఎఫ్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం రూ.130 కోట్ల వరకు కెఎమ్ఎఫ్ కు బకాయి ఉంది.

  • By Hashtag U Published Date - 02:00 PM, Tue - 9 November 21
  • daily-hunt

ఏపీ ప్రభుత్వానికి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ షాక్ ఇచ్చింది. ఏపీలోని అంగన్వాడీలకు పాల సరఫరా నిలిపివేస్తున్నట్లు కెఎమ్ఎఫ్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం రూ.130 కోట్ల వరకు కెఎమ్ఎఫ్ కు బకాయి ఉంది. వీటిని తక్షణం చెల్లిస్తేనే పాల సరఫరా చేస్తామని తేల్చి చెప్పింది. దీనితో పాటు ఇకపై సరఫరా చేయాలంటే లీటరుకు రూ.5 రూపాయలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కర్ణాటక నుంచి పాల సరఫరా నిలిచిపోతే ఏపీలో సంపూర్ణ పోషణ పథకంలో భాగంగా 20 లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారం అందకుండా పోతుంది. ఏపీ ప్రభుత్వం నందిని బ్రాండ్తో కేఎంఎఫ్ నుంచి ప్రతి నెలా 110 లక్షల లీటర్ల అల్ట్రా హై టెంపరేచర్ పాలను కొనుగోలు చేస్తోంది. అయితే గత నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కి ఎలాంటి చెల్లింపులు చేయలేదని…ఇప్పటివరకు మొత్తం రూ. 130 కోట్లకు బకాయి చేరుకుందని కెఎమ్ఎఫ్ తెలిపింది. కేఎంఎఫ్, ఏపీ ప్రభుత్వంతో జూన్ 2020లో సంతకం చేసిన ఒప్పందం ప్రకారం సంపూర్ణ పోషణ పథకం ప్రభుత్వం సంక్షేమ పథకం కాబట్టి లీటరుకు వాస్తవ ధర కంటే రూ. 5 తక్కువకే సరఫరా చేస్తుంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో పాల సేకరణ ధర పెరుగుదల, డీజిల్ ధరల పెంపు, ప్యాకింగ్ వ్యయం పెరగడం, ఇతర ముడిసరుకులను దృష్టిలో ఉంచుకుని పాల ధరను లీటరుకు రూ. 5 పెంచాలని KMF, ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.
అయితే ముందస్తు అగ్రిమెంట్ ప్రకారం 2021 మే వరకు పాత ధరనే కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం అభ్యర్థించింది. ఈ అభ్యర్థనకు కెఎమ్ఎప్ అంగీకరించి… పాత ధరకు పాలను సరఫరా చేస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకం కాబట్టి పాల సరఫరా ధరను సవరించలేదని సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్కు రాసిన లేఖలో కేఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ బీసీ సతీష్ తెలిపారు.

కర్నాటక పాల సంఘాలు అధిక ఇన్పుట్ ఖర్చుల కారణంగా భారీ నష్టాలను చవిచూస్తున్నాయని, ఇంధన ధరల పెంపుతో తమ వర్కింగ్ క్యాపిటల్ మరియు లాభదాయకతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని సతీష్ చెప్పారు. ప్రస్తుత ధరకు పాలను సరఫరా చేయలేమని పాల సంఘాలు మాకు తెలియజేశాయని… అలాగే ఏపీ ప్రభుత్వం బకాయి
ఉండటం వల్ల పాల ఉత్పత్తిదారులకు సకాలంలో పాల బిల్లలు ఇవ్వలేకపోవతున్నామని ఆయన లేఖలో ప్రస్తావించారు.
కర్ణాటకలోని పాడి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, లీటరుకు రూ.5 పెంచితే తప్ప ఏపీ అంగన్వాడీలకు పాలను సరఫరా చేయలేమని పాల సంఘాలు (కేఎంఎఫ్) తెలియజేశాయని ఆయన అన్నారు. పాల సంఘాలకు రావాల్సిన రూ.130 కోట్లు, మరో రూ.2.33 కోట్లను ఏపీ ప్రభుత్వం వెంటనే క్లియర్ చేయాలని సతీష్ కోరారు. ఈ విషయమై గతంలో మహిళా శిశు అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధకు కేఎంఎఫ్ ఎండీ పలు లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయిందని అధికారిక వర్గాలు తెలిపాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • anganwadis
  • ys jagan

Related News

'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.

  • YS Jagan

    YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

  • AP Assembly monsoon session to begin from 18th of this month

    AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

  • Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

    Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

  • Nara Lokesh

    Nara Lokesh : ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్న నారా లోకేశ్

Latest News

  • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

  • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

  • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

  • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

  • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

Trending News

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd