HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cancel The Recognition Of That Party Ycp Mps Who Met Easy

EC : ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయండి.. ఈసీని కలిసిన వైసీపీ ఎంపీలు!

ఆంధ్రప్రదేశ్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గంజాయి అక్రమ రవాణాపై ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో

  • By Balu J Published Date - 10:52 AM, Fri - 29 October 21
  • daily-hunt

ఆంధ్రప్రదేశ్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గంజాయి అక్రమ రవాణాపై ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి సీఎంని తీవ్రస్థాయిలో విమర్శించారు. దీంతో వైసీపీ కార్యకర్తలు పట్టాభి నివాసంతో పాటు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 36 గంటల పాటు దీక్ష నిర్వహించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ద్వారా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం అక్టోబర్ 25న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసింది. ఏపీలో శాంతిభద్రతలు పడిపోతున్నాయని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రపతికి తెలిపారు. ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై దాడికి పాలక ప్రభుత్వమే బాధ్యత వహించాలని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమైందని, పోలీసు శాఖ వైసీపీ పార్టీ క్యాడర్గా వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.

రెండు రోజుల పాటు ఢిల్లీలో చంద్రబాబు ఢిల్లీలో మకాం వేయండంతో వైసీపీ ఎంపీలు కూడా ఢిల్లీకి వచ్చారు. టీడీపీకి కౌంటర్గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్రని కలిసి టీడీపీ గుర్తింపు రద్దు చేయాలంటూ ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామిక ప్రక్రియను దెబ్బతీస్తూ, ప్రజా స్వామ్యంపై పరుష పదజాలాన్ని తెలుగుదేశం పార్టీ ఉపయోగిస్తుందని..తక్షణం టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని వైసీపీ ఎంపీలు ఎన్నికల సంఘాన్ని కోరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1951 ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఉల్లంఘించిందని వైసీపీ ఎంపీలు లేఖలో పేర్కొన్నారు. బహిరంగ సభలు, ప్రెస్ కాన్ఫరెన్స్లు, టెలివిజన్ చర్చల ద్వారా అసభ్యకర పదజాలంతో రాష్ట్ర ఇమేజ్ని దెబ్బతీసే విధంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపింది. రాష్ట్రంలో డ్రగ్స్ ఉందంటూ అసత్య ప్రచారం మొదలుపెట్టి దానినే చీకటి ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి తన ఎల్లో మీడియాను టీడీపీ ఉపయోగిస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీలు లేఖలో ఆరోపించారు. ప్రజాప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించారని, వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీగా తయారైందని, ఏపీలో టెర్రరిస్టు అవుట్ ఫిట్గా చిత్రీకరించొచ్చని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. టీడీపీ నేతలు ఉపయోగిస్తున్న భాష, అసాంఘిక చర్యలు వివరించి, ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేశామన్నారు. ఇలాంటి పార్టీని ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించడం ద్వారా దొంగలు, టెర్రరిస్టులు.. ఎమ్మెల్యేలు, ఎంపీలైతే దేశం పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • cm jagan
  • ec
  • ycp

Related News

Balakrishna Jagan

Jagan : జగన్ సైకో అంటూ బాలయ్య చేసిన డైలాగ్ కు వైసీపీ ఎదురుదాడి

Jagan : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదాలు చెలరేగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారి తీశాయి. మాజీ సీఎం జగన్‌ను “సైకో”

  • Lokesh supports National Education Policy

    Mega DSC : ప్రతి ఏటా DSC ప్రకటన – లోకేష్

  • Og Tgh

    OG కి బిగ్ షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు…టికెట్స్ కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటి..?

  • Pawan Uppada

    Pawan’s Key Decision : ఉప్పాడ మత్స్యకారుల సమస్యలకు పవన్ చెక్ !!

  • Nara Lokesh Skill Census Vs

    Local Elections : స్థానిక ఎన్నికలకు సిద్ధం – మంత్రి లోకేశ్

Latest News

  • Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో తొలి దశ ప్రభుత్వానికి.. ఎల్‌అండ్‌టీ నుంచి పూర్తిస్థాయి స్వాధీనం

  • Man Ate Spoons: స్పూన్లు, టూత్‌ బ్రష్‌లు మింగిన వ్యక్తి: రిహాబ్‌ సెంటర్‌పై కోపంతో అర్థంలేని పని

  • Parijata: పారిజాత పూల రహస్యం: ఈ పుష్పాలను ఎవరు కోయకూడదో ఎందుకు తెలుసా?

  • SKY: పహల్గాం వ్యాఖ్యలపై ఐసీసీ వార్నింగ్ లేదా జరిమానా ప్రమాదంలో సూర్యకుమార్

  • Car Brands Logo: సుజుకి కొత్త లోగో.. డిజిటల్ యుగంలో ఆటోమొబైల్ బ్రాండ్ల కొత్త వ్యూహం!

Trending News

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

    • OG Movie Talk : OG టాక్ వచ్చేసిందోచ్..యూఎస్ ప్రేక్షకులు ఏమంటున్నారంటే !!

    • Gold Rate Hike: బంగారం ధ‌ర‌లు త‌గ్గుతాయా? పెరుగుతాయా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd