HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Big Warning For Railway Passengers

Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు భారీ హెచ్చరిక..

విజయవాడ, వాల్తేరు డివిజన్లలో రైల్వే పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయగా… మరికొన్నింటిని రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు

  • By Sudheer Published Date - 07:30 AM, Fri - 5 July 24
  • daily-hunt
Train Cance
Train Cance

ఇటీవల దక్షిణ రైల్వే.. ప్రయాణికులకు వరుసగా షాకులు ఇస్తుంది. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ కారణంగా అనేక సర్వీసులను రద్దు చేయడం..దారి మళ్లింపు చేయడం చేస్తుంది. దీంతో అసలు ఏ ట్రైన్ ఎప్పుడు నడుస్తుందో..ఎప్పుడు నడవడం లేదో అర్ధం కావడం లేదు. పలానా ట్రైన్ ఉందని చెప్పి..ఆ టైం కు స్టేషన్ కు వెళ్తే..క్యాన్సల్ అని చెప్పి అధికారులు షాక్ ఇస్తున్నారు. ఇలా అనేక సార్లు వందలాది ప్రయాణికులకు ఇలాంటివి ఎదురయ్యాయి. ఇక ఇప్పుడు మరో భారీ షాక్ ఇచ్చింది రైల్వే. విజయవాడ, వాల్తేరు డివిజన్లలో రైల్వే పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయగా… మరికొన్నింటిని రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ డివిజన్‌లో ఏకంగా 30 రైళ్లను రద్దు చేయగా, శాంతిభద్రతల దృష్ట్యా వాల్తేరు డివిజన్‌లో 10 రైళ్లను రద్దు చేశారు. అలాగే 4 సర్వీసులను రీషెడ్యూల్ చేసినట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

ముందుగా వాల్తేరు డివిజన్‌ – రద్దైన రైళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

జులై 5న (శుక్రవారం) పలాస – విశాఖ – పలాస ప్యాసింజర్ రైలు (07470/07471) , అలాగే విశాఖ – గుణుపూర్ – విశాఖ ప్యాసింజర్ (08522/08521) రైలు రద్దు అయ్యింది.

అలాగే 5న విశాఖ – బ్రహ్మపూర్ ప్యాసింజర్ (08532), ఈ నెల 6న బ్రహ్మపూర్ – విశాఖ ప్యాసింజర్ (08531) రైలు రద్దు చేసారు. అలాగే, ఈ నెల 5న విశాఖ – భువనేశ్వర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (22820), భువనేశ్వర్ – విశాఖ ఇంటర్‌సిటీ (22819) రైలు రద్దు చేశారు. ఈ నెల 6న భవానీపట్నం – విశాఖపట్నం ప్యాసింజర్ రైలు (08503) రైలు రద్దైంది.

విజయవాడ డివిజన్‌లో చూస్తే…

ఆగస్ట్ 3 నుంచి 10 వరకూ విజయవాడ – గూడూరు (07500), ఆగస్ట్ 4 నుంచి 11 వరకూ గూడూరు – విజయవాడ (07458) రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి.

ఆగస్ట్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ విజయవాడ – భద్రాచలం (07979), భద్రాచలం – విజయవాడ (07278/07279) రైళ్లు రద్దు చేసారు.

ఆగస్ట్ 3 నుంచి 10 వరకూ తెనాలి – విజయవాడ (07630), విజయవాడ – గుంటూరు (07464/07465).
గుంటూరు – సికింద్రాబాద్ (17201/17202) రైళ్లు రద్దయ్యాయి.

ఆగస్ట్ 5 నుంచి 10 వరకూ విజయవాడ – చెన్నై సెంట్రల్ (12711/12712) రైళ్లు రద్దు చేశారు.

ఆగస్ట్ 5 నుంచి 12 వరకూ విజయవాడ – మాచర్ల (07781/07782), అలాగే విజయవాడ – తెనాలి (07629) రైళ్లు రద్దు.

ఆగస్ట్ 5 నుంచి 10 వరకూ విజయవాడ – గుంటూరు (07464/07465), అలాగే గుంటూరు – విజయవాడ (07755/07756), డోర్నకల్ – విజయవాడ (07755) రైలు రద్దు చేశారు.

ఆగస్ట్ 3 నుంచి 10వ తేదీ వరకూ నర్సాపూర్ – విజయవాడ (17270), విజయవాడ – బిట్రగుంట (07978) రైలు రద్దు.

ఆగస్ట్ 3 నుంచి 11 వరకూ బిట్రగుంట – చెన్నై సెంట్రల్ (17237), బిట్రగుంట – చెన్నై సెంట్రల్ (17238), విజయవాడ – హుబ్లీ (17329/17330) రైళ్లు రద్దయ్యాయి.

ఆగస్ట్ 5 నుంచి 11 వరకూ విశాఖ – కడప (17487/17488) రైలు రద్దు చేశారు.

దారి మళ్లించిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఆగస్ట్ 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ సికింద్రాబాద్ – విశాఖ (12740), ఆగస్ట్ 4వ తేదీన గాంధీనగర్ – విశాఖ (20804), ఆగస్ట్ 7న ఓక – పూరి (20820).

ఆగస్ట్ 4, 7 తేదీల్లో నిజాముద్దీన్ – విశాఖపట్నం (12804), ఆగస్ట్ 2 నుంచి 10 తేదీ వరకూ ఛత్రపతి శివాజీ టెర్మినల్ – భువనేశ్వర్ (11019) రైళ్లను రాయనపాడు మీదుగా దారి మళ్లించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.

Read Also : Wine Shops Close : జులై లో 2 రోజులు వైన్ షాప్స్ బంద్..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • trains cancelled
  • vijayawada
  • vijayawada to secunderabad trains

Related News

Sensational statement by the Central Committee on the Maredumilli encounter

Maoists: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌పై ..కేంద్ర కమిటీ సంచలన ప్రకటన

ఈ ఆరోపణలపై అధికార యంత్రాంగం నుంచి అధికారిక ప్రతిస్పందన ఇంకా వెలువడలేదు. కేంద్ర కమిటీ పేరు మీద ‘అభయ్’ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం, కమిటీ సభ్యుడు మడ్వి హిడ్మా, ఆయన సహచరి రాజే, మరికొందరు సహచరులతో కలిసి వైద్య చికిత్స కోసం విజయవాడకు వెళ్లారట.

    Latest News

    • Black Friday Sale: బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఇక‌పై సులభంగా షాపింగ్‌!

    • Ram Temple: ఇది మీకు తెలుసా? అయోధ్య రామమందిరంలో 45 కిలోల బంగారం వినియోగం!

    • Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. సెన్సార్ టాక్ సూపర్ పాజిటివ్!

    • T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ ఎప్పుడంటే?

    • Baba Vanga: భ‌య‌పెడుతున్న బాబా వంగా భవిష్యవాణి!

    Trending News

      • Miss Universe-2025 : ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడ్డ మిస్ యూనివర్స్ బ్యూటీ

      • Private Travels Ticket Rates : సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్‌న్యూస్!

      • Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!

      • Bank: రేపు ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయా?

      • Punjabi Cremation: ధర్మేంద్రకు తుది వీడ్కోలు.. సిక్కు సంప్రదాయంలో అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd