HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Big Warning For Railway Passengers

Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు భారీ హెచ్చరిక..

విజయవాడ, వాల్తేరు డివిజన్లలో రైల్వే పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయగా… మరికొన్నింటిని రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు

  • Author : Sudheer Date : 05-07-2024 - 7:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Train Cance
Train Cance

ఇటీవల దక్షిణ రైల్వే.. ప్రయాణికులకు వరుసగా షాకులు ఇస్తుంది. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ కారణంగా అనేక సర్వీసులను రద్దు చేయడం..దారి మళ్లింపు చేయడం చేస్తుంది. దీంతో అసలు ఏ ట్రైన్ ఎప్పుడు నడుస్తుందో..ఎప్పుడు నడవడం లేదో అర్ధం కావడం లేదు. పలానా ట్రైన్ ఉందని చెప్పి..ఆ టైం కు స్టేషన్ కు వెళ్తే..క్యాన్సల్ అని చెప్పి అధికారులు షాక్ ఇస్తున్నారు. ఇలా అనేక సార్లు వందలాది ప్రయాణికులకు ఇలాంటివి ఎదురయ్యాయి. ఇక ఇప్పుడు మరో భారీ షాక్ ఇచ్చింది రైల్వే. విజయవాడ, వాల్తేరు డివిజన్లలో రైల్వే పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయగా… మరికొన్నింటిని రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ డివిజన్‌లో ఏకంగా 30 రైళ్లను రద్దు చేయగా, శాంతిభద్రతల దృష్ట్యా వాల్తేరు డివిజన్‌లో 10 రైళ్లను రద్దు చేశారు. అలాగే 4 సర్వీసులను రీషెడ్యూల్ చేసినట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

ముందుగా వాల్తేరు డివిజన్‌ – రద్దైన రైళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

జులై 5న (శుక్రవారం) పలాస – విశాఖ – పలాస ప్యాసింజర్ రైలు (07470/07471) , అలాగే విశాఖ – గుణుపూర్ – విశాఖ ప్యాసింజర్ (08522/08521) రైలు రద్దు అయ్యింది.

అలాగే 5న విశాఖ – బ్రహ్మపూర్ ప్యాసింజర్ (08532), ఈ నెల 6న బ్రహ్మపూర్ – విశాఖ ప్యాసింజర్ (08531) రైలు రద్దు చేసారు. అలాగే, ఈ నెల 5న విశాఖ – భువనేశ్వర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (22820), భువనేశ్వర్ – విశాఖ ఇంటర్‌సిటీ (22819) రైలు రద్దు చేశారు. ఈ నెల 6న భవానీపట్నం – విశాఖపట్నం ప్యాసింజర్ రైలు (08503) రైలు రద్దైంది.

విజయవాడ డివిజన్‌లో చూస్తే…

ఆగస్ట్ 3 నుంచి 10 వరకూ విజయవాడ – గూడూరు (07500), ఆగస్ట్ 4 నుంచి 11 వరకూ గూడూరు – విజయవాడ (07458) రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి.

ఆగస్ట్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ విజయవాడ – భద్రాచలం (07979), భద్రాచలం – విజయవాడ (07278/07279) రైళ్లు రద్దు చేసారు.

ఆగస్ట్ 3 నుంచి 10 వరకూ తెనాలి – విజయవాడ (07630), విజయవాడ – గుంటూరు (07464/07465).
గుంటూరు – సికింద్రాబాద్ (17201/17202) రైళ్లు రద్దయ్యాయి.

ఆగస్ట్ 5 నుంచి 10 వరకూ విజయవాడ – చెన్నై సెంట్రల్ (12711/12712) రైళ్లు రద్దు చేశారు.

ఆగస్ట్ 5 నుంచి 12 వరకూ విజయవాడ – మాచర్ల (07781/07782), అలాగే విజయవాడ – తెనాలి (07629) రైళ్లు రద్దు.

ఆగస్ట్ 5 నుంచి 10 వరకూ విజయవాడ – గుంటూరు (07464/07465), అలాగే గుంటూరు – విజయవాడ (07755/07756), డోర్నకల్ – విజయవాడ (07755) రైలు రద్దు చేశారు.

ఆగస్ట్ 3 నుంచి 10వ తేదీ వరకూ నర్సాపూర్ – విజయవాడ (17270), విజయవాడ – బిట్రగుంట (07978) రైలు రద్దు.

ఆగస్ట్ 3 నుంచి 11 వరకూ బిట్రగుంట – చెన్నై సెంట్రల్ (17237), బిట్రగుంట – చెన్నై సెంట్రల్ (17238), విజయవాడ – హుబ్లీ (17329/17330) రైళ్లు రద్దయ్యాయి.

ఆగస్ట్ 5 నుంచి 11 వరకూ విశాఖ – కడప (17487/17488) రైలు రద్దు చేశారు.

దారి మళ్లించిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఆగస్ట్ 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ సికింద్రాబాద్ – విశాఖ (12740), ఆగస్ట్ 4వ తేదీన గాంధీనగర్ – విశాఖ (20804), ఆగస్ట్ 7న ఓక – పూరి (20820).

ఆగస్ట్ 4, 7 తేదీల్లో నిజాముద్దీన్ – విశాఖపట్నం (12804), ఆగస్ట్ 2 నుంచి 10 తేదీ వరకూ ఛత్రపతి శివాజీ టెర్మినల్ – భువనేశ్వర్ (11019) రైళ్లను రాయనపాడు మీదుగా దారి మళ్లించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.

Read Also : Wine Shops Close : జులై లో 2 రోజులు వైన్ షాప్స్ బంద్..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • trains cancelled
  • vijayawada
  • vijayawada to secunderabad trains

Related News

Chandrababu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ

CM Nara Chandrababu Naidu  ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త మార్గాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. సచివాలయంలో దక్షిణ మధ్య, తూర్పు కోస్తా, దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ల జనరల్ మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నార

    Latest News

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యాన్ని ఎలా గుర్తించాలి?

    • iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది: సీఎం చంద్రబాబు

    • ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

    Trending News

      • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

      • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

      • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

      • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

      • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd