AP Assembly : ఓటర్ల డేటా చోరీపై ఏపీ అసెంబ్లీలో రచ్చ
గత ప్రభుత్వ హయాంలోనే డేటా చోరీ జరిగిందని పెగాసస్ స్పైవేర్ కేసుపై ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ధృవీకరించారు
- By CS Rao Published Date - 03:11 PM, Tue - 20 September 22
గత ప్రభుత్వ హయాంలోనే డేటా చోరీ జరిగిందని పెగాసస్ స్పైవేర్ కేసుపై ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ధృవీకరించారు. ఈరోజు (మంగళవారం) అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా డేటా చోరీ కేసును విచారించిన హౌస్ కమిటీ రూపొందించిన మధ్యంతర నివేదికను ఆయన చదివి వినిపించారు. ప్రాథమిక విచారణలో గత టీడీపీ ప్రభుత్వం డేటా చోరీకి పాల్పడిందని, 2017-19, ముఖ్యంగా 2018-19 మధ్యకాలంలో సేవామిత్ర యాప్ ద్వారా దాదాపు 30 లక్షల ఓట్లను రద్దు చేసే ప్రక్రియను గత ప్రభుత్వం ప్రారంభించిందని భూమన తెలిపారు.
సేవా మిత్ర అనే యాప్ ద్వారా స్టేట్ డేటా సెంటర్ నుంచి ఓటర్లు కాని వారి సమాచారాన్ని దొంగిలించేందుకు ప్రయత్నించారని, దీనిపై లోతుగా విచారణ జరిపి దొంగతనం చేసిన దొంగలను పట్టుకుంటామని అభిప్రాయపడ్డారు. భూమన ప్రాథమిక విచారణ నివేదికను స్పీకర్కు చదివి వినిపించారు. నివేదికను చదువుతున్న సమయంలో టీడీపీ సభ్యులు దానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
టీడీపీ చెబితే ఈసీ ఓట్లను తీసేస్తుందా?
ఎన్నికల కమిషన్ స్వతంత్ర్య సంస్థ. స్వయంప్రతిపత్తిని కలిగి ఉంది. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటుందని అందరికీ తెలుసు. కానీ, తెలుగుదేశం పార్టీ చెప్పిన ఓటర్లను ఎన్నికల కమిషన్ తొలగించిందని వైసీపీ ఆరోపించడాన్ని అభ్యంతర పెట్టింది. ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం మీద వేసిన విచారణలు ఏ ఒక్కటీ తేలలేదని అన్నారు. దమ్ముంటే ఒక్క కేసునైనా నిరూపించాలని టీడీపీ సభ్యులు సవాల్ విసిరారు.
Related News
Anam Venkata Ramana Reddy : భారతి రెడ్డి రాళ్ల దాడి డ్రామాను రూపొందించారు
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్పై శనివారం సాయంత్రం రాళ్లు రువ్వడంతో ఆయనకు గాయాలయ్యాయి.