AP Assembly : అసెంబ్లీ సమావేశాలు వాయిదా
AP Assembly : సీఎం ప్రసంగం అనంతరం సభలో మరికొన్ని అంశాలపై చర్చలు జరగగా, స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
- Author : Sudheer
Date : 19-09-2025 - 7:12 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (AP Assembly) శుక్రవారం రెండో రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరగగా, నీటి నిర్వహణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CBN) సుదీర్ఘంగా మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిలో నీటి వినియోగం, సాగు నీటి పంపిణీ, భూగర్భ జలాల పరిరక్షణ వంటి విషయాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు.
Kadiyam Srihari : కేసీఆర్ కు అప్పుడు తెలియదా..? కడియం సూటి ప్రశ్న
సీఎం ప్రసంగం అనంతరం సభలో మరికొన్ని అంశాలపై చర్చలు జరగగా, స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రజల సమస్యలు, అభివృద్ధి ప్రణాళికలు, నిధుల కేటాయింపులపై వచ్చే రోజుల్లో మరింత విస్తృతంగా చర్చలు జరగనున్నాయని తెలుస్తోంది. ప్రజా ప్రాధాన్యత అంశాలను సమగ్రంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు పేర్కొన్నారు.
ఇక ఈ నెల 27వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రాబోయే రోజుల్లో పంచాయతీరాజ్ సవరణలు, మున్సిపల్ చట్టాల సవరణలు, సంక్షేమ పథకాలపై సమీక్ష వంటి కీలక అంశాలు సభలో చర్చకు రానున్నాయి. ఈ సమావేశాలు రాష్ట్ర అభివృద్ధి దిశలో కీలక నిర్ణయాలకు వేదిక కానున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రజల అంచనాలను నెరవేర్చే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని అన్ని వర్గాల నుండి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.