APSRTC : అరుణాచలంకు ప్రత్యేక బస్సు సర్వీసు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ
నవంబర్ 25న గిరి ప్రదక్షిణ మహోత్సవం సందర్భంగా గుంటూరు నుంచి అరుణాచలం పుణ్యక్షేత్రానికి ఎపీఎస్ఆర్టీసీ ప్రత్యేక
- By Prasad Published Date - 08:04 AM, Fri - 17 November 23
నవంబర్ 25న గిరి ప్రదక్షిణ మహోత్సవం సందర్భంగా గుంటూరు నుంచి అరుణాచలం పుణ్యక్షేత్రానికి ఎపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనుంది. పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షణ మహోత్సవం కోసం గుంటూరు 2 డిపో నుంచి ప్రత్యేక హైటెక్ బస్సును ఏర్పాటు చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ గుంటూరు-2 డిపో మేనేజర్ అబ్దుల్ సలాం తెలిపారు. ఈ బస్సు నవంబర్ 25వ తేదీ రాత్రి 9:15 గంటలకు గుంటూరు బయలుదేరుతుంది. నవంబర్ 26న శ్రీ కాళహస్తి, కాణిపాకం మరియు శ్రీ పురం గోల్డెన్ టెంపుల్కు చేరకుంటుంది. అక్కడి నుంచి రాత్రికి బస్సు ప్రయాణించి నవంబర్ 27 పౌర్ణమి రోజు ఉదయం అరుణాచలం చేరుకుంటుందని పేర్కొన్నారు. ఈ బస్సు నవంబర్ 27 సాయంత్రం అరుణాచలం నుంచి గుంటూరుకు బయలుదేరి నవంబర్ 28 సాయంత్రం గుంటూరు చేరుకుంటుందని ఆర్టీసీ డిపో మేనేజర్ సలాం తెలిపారు. ఈ ప్రత్యేకమైన బస్సులో రిజర్వేషన్ సర్వీస్ ఉందని, కాబట్టి ప్రయాణికులు ఆన్లైన్లో రిజర్వేషన్లు చేసుకోవచ్చని తెలిపారు. ఒక్కో టిక్కెట్టు ధర రూ.2420 అని, అదనపు సమాచారం కోసం 7382897459, 7382894409, లేదా 7382896403 నంబర్లకు ఫోన్ చేయాలని, గుంటూరు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Also Read: Voting Updates : మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో పోలింగ్ షురూ.. వివరాలివీ
Related News
AP Pension: ఏపీలోని పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త
మే నెల పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు ఇచ్చింది. మే 1వ తేదీన పెన్షనర్ల ఖాతాలోకి డబ్బు జమ అవుతుందని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్లో మాదిరిగానే మే నెలలో కూడా సచివాలయాల చుట్టూ తిరగకుండానే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ సొమ్మును జమ చేయనున్నారు