HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Apiic Celebrates 50 Years Of Formation

APIIC : `ఏపీఐఐసీ` అర్థ‌శ‌తాబ్ద‌పు చరిత్ర‌

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏర్పడి సోమ‌వారం నాటికి (సెప్టెంబ‌ర్ 26వ తేదీకి) 50ఏళ్లు. పారిశ్రామిక ప్రగతిలో ప్రత్యేక ముద్ర వేసింది.

  • By CS Rao Published Date - 02:25 PM, Mon - 26 September 22
  • daily-hunt
Apiic
Apiic

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏర్పడి సోమ‌వారం నాటికి (సెప్టెంబ‌ర్ 26వ తేదీకి) 50ఏళ్లు. పారిశ్రామిక ప్రగతిలో ప్రత్యేక ముద్ర వేసింది. 1973 సెప్టెంబర్‌ 26న రూ.20 కోట్ల మూలధనంతో ఏర్పాటు అయింది. ఇప్పటివరకు 450కి పైగా పారిశ్రామిక పార్కుల నిర్మాణం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 1,25,000 ఎకరాల్లో 3,500కు పైగా యూనిట్ల ఏర్పాటు చేసి చ‌రిత్ర సృష్టించింది.

విభజన తర్వాత రాష్ట్రంలో 93 పారిశ్రామిక పార్కుల అభివృద్ధి చేసింది. రూ.1,708 కోట్ల వ్యయంతో 99,465 మందికి ఉపాధి క‌ల్పించింది. 3 పారిశ్రామిక కారిడర్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంది. 2 మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కుల అభివృద్ధిపైనా దృష్టి పెట్టింది. పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి మౌలిక వసతుల సంస్థ పాత్ర ప్రత్యేకంగా ఉంది. సరికొత్త లక్ష్యాలతో 50వ వసంతంలోకి ఏపీఐఐసీ అడుగుపెట్టింది. ఆ సంద‌ర్భంగా ఏపీఐసీసీ ప్ర‌గ‌తిలోని కొన్ని ప్ర‌ధాన ఘ‌ట్టాలు ఇవి.

*హైదరాబాద్‌ పురోగతిలో కీలకమైన హైటెక్‌ సిటీ నుంచి విశాఖలోని రాంకీ ఫార్మా సెజ్‌ వరకు అనేక ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీఐఐసీ బ్రాండ్

*గుంటూరు జిల్లాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రాజెక్టులను నిర్వహణా ఏపీఐఐసీదే

*రాష్ట్ర ప్రగతిలో కీలకంగా ఉన్న శ్రీ సిటీ, అచ్యుతాపురం, నెల్లూరు మాంబట్టు , గంగవరం పోర్టు వంటి కీలక ప్రాజెక్టులకు భూసేకరణ సహా అభివృద్ధి చేసింది ఏపీఐఐసీనే

*ఇదే స్ఫూర్తితో మరింత వేగంగా పారిశ్రామిక పార్కులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి

*విశాఖపట్నం – చెన్నై, చెన్నై – బెంగళూరు, హైదరాబాద్‌ – బెంగళూరు కారిడార్లను వేల కోట్లతో అభివృద్ధి చేస్తోంది.

*ఒక్క విశాఖ – చెన్నై కారిడార్‌లోనే 33,000 ఎకరాలు ఉండగా అందులో తొలుత రూ.5,000 కోట్లతో రూ.10,000 ఎకరాలను ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఏడీబీ) సహకారంతో అభివృద్ధి

*చెన్నై – బెంగళూరు కారిడార్‌లో మొత్తం 12,000 ఎకరాల అభివృద్ధి ..ఇందులో తొలుత 2,500 ఎకరాల్లో క్రిస్‌ సిటీ పేరుతో పారిశ్రామిక నగరాన్ని నిర్మిస్తోన్న ఏపీఐఐసీ

*హైదరాబాద్‌ – బెంగళూరు కారిడార్‌లో కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద సుమారు 10,000 ఎకరాల్లో భారీ పారిశ్రామిక వాడ అభివృద్ధి

* వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తి వద్ద 6,739 ఎకరాల్లో‍్ల వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌, 800 ఎకరాల్లో వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌, కృష్ణా జిల్లా మల్లవల్లి వద్ద మెగా ఫుడ్‌ పార్క్‌, కాకినాడ సెజ్‌, తిరుపతి వద్ద ఈఎంసీ 1, ఈఎంసీ 2ల ప్రగతిలో ఏపీఐఐసీ వెన్నెముక

*చిత్తూరు జిల్లా మన్నవరం వద్ద 225 ఎకారల్లో విద్యుత్‌ ఉపకరణాల తయారీ యూనిట్‌, కొప్పర్తి వద్ద 1,000 ఎకరాల్లో పీఎం-మిత్రా పథకం కింద టెక్స్‌టైల్‌ పార్కును అభివృద్ధి చేయడానికి కేంద్రానికి ప్రతిపాదనలు

*విశాఖ, అనంతపురంలలో రెండు మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కుల అభివృద్ధిపై దృష్టి

*పరిశ్రమలకు ఎంతో కీలకమైన నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి .ఇప్పటికే కొప్పర్తికి 100 కోట్లతో, ఓర్వకల్లుకు రూ. 280 కోట్లతో ఒక టీఎంసీ నీటిని సరఫరా చేసే పనుల ప్రారంభం

* కేవలం పెద్ద పరిశ్రమలకే కాకుండా అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈల కోసం ప్రత్యేకంగా పార్కుల అభివృద్ధి .రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు, పారదర్శక పారిశ్రామిక విధానం చూసి టాటా, బిర్లా, అదానీ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వ‌చ్చేలా ప్లాన్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh news
  • APIIC

Related News

Sharmila

Sharmila: అన్నమయ్య ఇక అనాథ ప్రాజెక్టేనా?: వైఎస్ షర్మిల

అలాగే అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు.

    Latest News

    • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

    • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd