AP TDP : ఎలక్టోరల్ బాండ్స్కి లంచాలకు తేడా దర్యాప్తు సంస్థలకు తెలియదా..?
స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి రూ.27 కోట్ల నిధులు తెలుగుదేశం పార్టీ ఖాతాకు మళ్లించారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని
- By Prasad Published Date - 08:14 PM, Thu - 5 October 23
స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి రూ.27 కోట్ల నిధులు తెలుగుదేశం పార్టీ ఖాతాకు మళ్లించారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాజకీయ పార్టీకి రూ.20 వేలకు మించి నగదు రూపంలో విరాళం ఇచ్చినట్లైతే అలాంటి వివరాలన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘానికి, ఇన్కం ట్యాక్స్ డిపార్టుమెంటుకు సదరు పార్టీ తెలియజేస్తుందని తెలిపారు. అవి ఎన్నికల కమిషన్ వెబ్ సైట్లో అందరికీ అందుబాటులో ఉంటాయని అచ్చెన్నాయుడు తెలిపారు. ఏప్రిల్ 2023లో ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ నుండి తెలుగుదేశం పార్టీ నిధుల వివరాలను సీఐడీ అధికారికంగా డౌన్ లోడ్ చేశారన్నారు. అందులోనే ఎవరు ఏ రోజు ఎంత మొత్తంలో విరాళాలిచ్చారో స్పష్టంగా ఉందని.. వాటిపై ఆరు నెలల పరిశోధన చేసిన సీఐడీ, ఎలాంటి అవకతవకలు లేకున్నా బురద జల్లడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున నిధులు వచ్చాయని చెప్పడం, దానిని అక్రమ కేసులకు ముడిపెట్టడం దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు తలొగ్గి చట్ట వ్యతిరేకంగా పని చేస్తున్నాయని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యమన్నారు
We’re now on WhatsApp. Click to Join.
2018-19లో టీడీపీ ఖాతాకు రూ.27 కోట్లు ఎలక్షన్ బాండ్ల రూపంలో వచ్చాయంటున్నారు. అదే సంవత్సరంలో అవే ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వైసీపీ ఖాతాకు రూ.99.84 కోట్లు, 2019-20లో రూ.74.35 కోట్లు, 2020-21లో రూ.96.25 కోట్లు, 2021-22లో రూ.60 కోట్లు వచ్చాయి. ఈ విరాళాలిచ్చిన వ్యక్తులు, సంస్థల పేర్లు సాక్షి పేపర్లో ప్రచురించే దమ్ము ధైర్యం జగన్ రెడ్డికి ఉందా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఆరు నెలల క్రితం ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ నుండి సేకరించినట్లు మీ పంచనామా నివేదిక చెబుతోందని.. ఆరు నెలల పరిశోధన తర్వాత ఎలాంటి ఆధారాలు దొరక్క ఇప్పుడు కోర్టు ముందు పెద్ద మొత్తంలో నగదు వచ్చిందని అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆరు నెలల్లో ఏం ఆధారాలు కనిపెట్టారో కోర్టుకు ఎందుకు సమర్పించలేకపోతున్నారు? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు బెయిల్ రాకుండా చేసేందుకు, ఆయన ప్రాథమిక హక్కుల్ని కాలరాసేందుకు దర్యాప్తు సంస్థలు ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న కుట్ర మాత్రమేనని ఆయన తెలిపారు. రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్స్ సేకరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ చట్టం కూడా చేసిందని. కానీ జగన్ రెడ్డి వాటిని కూడా తప్పుబడుతూ, అదో కుంభకోణం అన్నట్లుగా మాట్లాడుతూ కేంద్ర చట్టాలను అపహాస్యం చేస్తున్నారన్నారు. న్యాయ వ్యవస్థను సైతం తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం ద్వారా ప్రజాహక్కుల్ని, రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.
Also Read: Janasena For AP : మోడీతో పవన్ ఢీ, చంద్రబాబుకు జై!
Related News
Fact Check : ‘పెద్దిరెడ్డితో టచ్లో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి’.. ఇది నిజం కాదు..!
ఈనెల 13న ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.