AP Politics:రాధా ‘రెక్కి’ ఓ డ్రామా: వెల్లంపల్లి
వంగవీటి రాధాను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారన్న అంశంపై మంత్రి వెల్లంపల్లి స్పందించారు. రాధా హత్యకు రెక్కీ జరిగిన ఆధారాలు ఉంటే బయట పెట్టాలని మంత్రి వెల్లంపల్లి డిమాండ్ చేశారు.
- By Hashtag U Published Date - 02:00 PM, Sun - 2 January 22
వంగవీటి రాధాను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారన్న అంశంపై మంత్రి వెల్లంపల్లి స్పందించారు. రాధా హత్యకు రెక్కీ జరిగిన ఆధారాలు ఉంటే బయట పెట్టాలని మంత్రి వెల్లంపల్లి డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు చెప్పినట్టు రాధా చేయకూడదని.. ఇప్పటికే రాధాను రాజకీయాల్లో మర్చిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తప్పుడు డైరెక్షన్లో రాధా ప్రయాణం చేయకూడదని హితవు పలికారు.
వంగవీటి మోహన్ రంగా టీడీపీ హయాంలో ఎందుకు దీక్ష చేశారో రాధా తెలుసుకోవాలని మంత్రి వెల్లంపల్లి అన్నారు. టీడీపీ హయాంలో రంగా హత్య జరిగితే అదే పార్టీతో రాధా అంటకాగుతున్నారని విమర్శించారు. రెక్కీపై ఇంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేసారా? అని మంత్రి ప్రశ్నించారు. మెయిన్ రోడ్డులో రాధా ఇల్లు ఉందని.. అక్కడ కారు తిరిగితే రెక్కీ అవుతుందా? అని నిలదీశారు. హత్యా, రెక్కీ అంటారు.. భద్రత కోసం గన్ మెన్లను పంపితే వెనక్కి పంపి చీప్ రాజకీయాలు చేస్తారా? అంటూ వెల్లంపల్లి మండిపడ్డారు. రాధా రెక్కీ అంశంపై వెంటనే సీఎం జగన్ స్పందించారని.. రాధా తమ పార్టీకి సంబందంలేని వ్యక్తైనా గన్ మెన్లను కేటాయించారని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. రాధాను చంద్రబాబు పరామర్శించడం దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మొరిగానట్టు ఉందని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని.. వంగవీటి రాధాతో చంద్రబాబు డ్రామా చేయిస్తున్నారని వెల్లంపల్లి విమర్శించారు.
Related News
Rise Survey on AP : ఏపీలో కూటమిదే విజయం
కూటమి పార్టీలు 108 నుంచి 120 వరకు స్థానాల్లో గెలువనున్నాయని , అధికార వైసీపీ పార్టీ 41 నుంచి 54 స్థానాల లోపే పరిమితం కానుందని సర్వే సంస్థ వెల్లడించింది