Movie Tickets:జేసీ ముందు ప్రతిపాదనలు పెట్టాలని హైకోర్టు ఆదేశం
ఏపీలో సినిమా టిక్కెట్ ధరలపై ఏపీ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య వార్ నడుస్తోందనే చెప్పాలి. తాజాగా సినిమా టిక్కెట్ ధరలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- By Hashtag U Published Date - 10:34 PM, Thu - 16 December 21
ఏపీలో సినిమా టిక్కెట్ ధరలపై ఏపీ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య వార్ నడుస్తోందనే చెప్పాలి. తాజాగా సినిమా టిక్కెట్ ధరలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని పలువురు స్టార్ హీరోలు, నిర్మాతలు, థియేట్రికల్ యాజమాన్యాలు వ్యతిరేకించినా ఇప్పుడు హైకోర్టులో వివాదం నెలకొంది.
సినిమా టిక్కెట్ల ధరలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. జీవో 35ని సస్పెండ్ చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని ప్రభుత్వం కోర్టును కోరింది.అయితే సింగిల్ జడ్జి ఆదేశాల మేరకు టిక్కెట్ ధర ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ ముందు ఉంచాలని థియేటర్ యాజమాన్యాలను కోర్టు ఆదేశించింది. టిక్కెట్పై జాయింట్ కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారు. గత ఆదేశాలకు అనుగుణంగా టికెట్ ధరలను నిర్ణయించేందుకు ప్రభుత్వ కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. అనంతరం కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది
రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ35ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని టాలీవుడ్ పెద్దలు ప్రభుత్వాన్ని కోరినప్పటికీ… ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో థియేటర్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. టిక్కెట్ ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని థియేటర్ల యాజమాన్యాలు వాదిస్తున్నాయి.
Tags
Related News
AP Officers In Dilemma : నాడు వైఎస్ నేడు జగన్ ! బ్యూరోక్రాట్స్ లో దడ!!
AP Officers In Dilemma : చంద్రబాబు జైలు పాలయ్యేలా సీఎం జగన్మోహన్ రెడ్డి చేయగలిగారు. అందుకు ఏపీ సీఐడీ సంపూర్ణ సహకారం అందించింది.