Nara Lokesh: ఏపీ ఇప్పుడు ఉద్యమప్రదేశ్గా మారింది: నారా లోకేశ్
- By Balu J Published Date - 01:00 PM, Tue - 26 December 23
Nara Lokesh: ఏపీ ఇప్పుడు ఉద్యమప్రదేశ్గా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాదయాత్రలో ఇష్టం వచ్చిన హామీలను ఇచ్చిన జగన్ అందరినీ మోసం చేశారని విమర్శించారు. మంగళవారం నుంచి చేపట్టనున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు టీడీపీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతుందని నారా లోకేశ్ తెలిపారు.
సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న మున్సిపల్, ఆశా వర్కర్లను ఆదుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. “పోరాడితే ఒరిగేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. అంటూ ఘాటుగా స్పందించారు. పాదయాత్రలో హామీలు గుప్పించిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్ వాడీలు, మున్సిపల్ సహా అందరినీ మోసం చేశారు.
వర్కర్లు, ఆశా వర్కర్లు, త్వరలో వాలంటీర్లు.. నేటి నుంచి ప్రారంభం కానున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు టీడీపీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతోంది.అంగన్వాడీల సమ్మెకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు మద్దతిచ్చినట్లే.. మున్సిపల్, ఆశాలకు మద్దతు ఇవ్వాలని నారా లోకేష్ ట్వీట్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే మున్సిపల్ వర్కర్స్ ఆందోళనలు చేస్తున్నారు.
Also Read: Sircilla: గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు మృతి!
Tags
Related News
AP Elections : కోనసీమలో బెట్టింగ్లు.. మెజారిటీలపై మాత్రమే..!
ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర ప్రాంతం బెట్టింగ్ సంస్కృతికి చాలా అనుకూలంగా ఉన్నాయి.