సినిమా టికెట్ ధరలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..రేట్ ఎంతంటే.
కరోనా ప్రభావం సినీ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసింది. మొదటి లాక్ డౌన్ అనంతరం 50 శాతం ఆక్యూపెన్సీతో తెరచుకున్న థియేటర్స్ పై కోవిడ్ సెకండ్ వేవ్ రూపంలో మరోసారి ఆర్థికంగా నష్టపరిచింది.
- By Hashtag U Published Date - 05:08 PM, Wed - 1 December 21
కరోనా ప్రభావం సినీ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసింది. మొదటి లాక్ డౌన్ అనంతరం 50 శాతం ఆక్యూపెన్సీతో తెరచుకున్న థియేటర్స్ పై కోవిడ్ సెకండ్ వేవ్ రూపంలో మరోసారి ఆర్థికంగా నష్టపరిచింది. ఈ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో పడిన విషయం తెలిసిందే. కరోనా కేసులు తగ్గుపట్టిన నేపథ్యంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 100 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే తెలంగాణలో టికెట్స్ విషయంపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా.. ఏపిలో మాత్రం టికెట్స్ అమ్మకాలపై నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో సినిమా టికెట్ ధరలు ఇటీవల కాలంలో టాలీవుడ్ లో హాట్ టాపిక్ మారిన విషయం తెలిసిందే.
ఏపిలో ప్రస్తుతం ధరల టికెట్స్ ని ఖచ్చతమైన ధరలకు నిర్ణయిస్తూ ఓ పట్టికను రిలీజ్ చేశారు. ఏపీలో 5, 10, 15 రుపాయల నుంచి రూ.250 వరకు టికెట్ రేట్లను ఫిక్స్ చేసింది ప్రభుత్వం. గ్రామ పంచాయితీ పరిధిలో థియేటర్లో ఎకనామీ టికెట్ రూ.5 ధర నిర్ణయించగా.. మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో మల్టీప్లక్స్ థియేటర్ లో ప్రీమియం టికెట్ ధర రూ.250 గా నిర్ణయించారు. ఇక ఏపిలో అతి సామాన్యులు సైతం టికెట్ కొని హాయిగా సినిమాలు చుసుకునే సౌకర్యం కలిగిందని అంటున్నారు.
తెలంగాణలో మాత్రం ఇలాంటి సౌకర్యం లేదని ఇక్కడ సామాన్యుడు పెద్ద థియేటర్లకు వెళ్తే సుమారు రూ.50 నుంచి వంద రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి. మల్టీప్లెక్స్ థియేటర్లకు వెళితే వందలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. ఏపిలో ప్రస్తుతం నిర్ణయించి టికెట్స్ ధరలు చూస్తుంటే ఒకప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Ticket prices – FIXED rates issued by AP Govt.
To be followed strictly with only 4 shows per day even for BIG releases from today. pic.twitter.com/9kqidbZ4SN
— Manobala Vijayabalan (@ManobalaV) December 1, 2021
మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో :
మల్టీప్లెక్సు- ప్రీమియం రూ.250, డీలక్స్ రూ.150, ఎకానమీ రూ.75
ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40
నాన్ ఏసీ- ప్రీమియం రూ.60, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20
మున్సిపాలిటీ ప్రాంతాల్లో :
మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.150, డీలక్స్ రూ.100, ఎకానమీ రూ.60
ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.70, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30
నాన్ ఏసీ- ప్రీమియం రూ.50, డీలక్స్ రూ.30, ఎకానమీ రూ.15
నగర పంచాయతీల్లో :
మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.120, డీలక్స్ రూ.80, ఎకానమీ రూ.40
ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.35, డీలక్స్ రూ.25, ఎకానమీ రూ.15
నాన్ ఏసీ- ప్రీమియం రూ.25, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10
గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో :
మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30
ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.20, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10
నాన్ ఏసీ- ప్రీమియం రూ.15, డీలక్స్ రూ.10, ఎకానమీ రూ.5
Related News
Land Act : ఏపీవాసుల జీవితాలకు ముప్పు తెచ్చే భూమి పట్టా చట్టం
ఆంధ్రప్రదేశ్లో ఇటీవలి ప్రచార పథంలో, ఒక అంశం ప్రధానాంశంగా మారింది. రాష్ట్ర నివాసితుల జీవితాలకు గణనీయమైన ముప్పు తెచ్చే భూమి పట్టా చట్టం.