AP : ఆరోగ్యశ్రీ జాబితా నుంచి 39 ప్రవేట్ ఆసుపత్రులు తొలిగించిన ఏపీ ప్రభుత్వం.. కారణం ఇదే..?
ఏపీలో ఆరోగ్యశ్రీ జాబితా నుంచి 39 ప్రవేట్ ఆసుపత్రులను ఏపీ ప్రభుత్వం తొలిగించింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద
- By Prasad Published Date - 08:45 AM, Sat - 27 January 24
ఏపీలో ఆరోగ్యశ్రీ జాబితా నుంచి 39 ప్రవేట్ ఆసుపత్రులను ఏపీ ప్రభుత్వం తొలిగించింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రజలకు ఆరోగ్య సేవలను నిలిపివేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ జాబితాలో 39 ప్రైవేట్ ఆసుపత్రుల జాబితా నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలగించి.. శుక్రవారం వారికి షోకాజ్ నోటీసును అందజేసింది. జూన్ 2023 నుండి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 1,200 కోట్లను విడుదల చేయలేదనే కారణంతో పలు ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద రోగులకు ఆరోగ్యశ్రీని అందించడం ఆపివేసాయి. పెండింగ్ బకాయిలను గత డిసెంబర్లో విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. నిధులు విడుదల అవ్వకపోవడంతో ప్రవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయి.
We’re now on WhatsApp. Click to Join.
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్కు చెందిన అధికారులు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చలు జరిపారు. ఆరోగ్య సేవలను పునఃప్రారంభించమని.. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారిని ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైయ్యాయి. కొన్ని ఆసుపత్రులు తమ బకాయిలు త్వరలో చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలను అందించడం ప్రారంభించాయి. అయితే ఇతర ఆసుపత్రులు తమ బకాయిలను క్లియర్ చేస్తే తప్ప, ఆరోగ్యశ్రీ సేవలను తిరిగి ప్రారంభించబోమని తేల్చి చెప్పాయి. 318 కోట్ల బకాయిలను గురువారం రాత్రి విడుదల చేయాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు తాత్కాలికంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. కొన్ని ఆసుపత్రులు ఆరోగ్య సంరక్షణ సేవలను పునఃప్రారంభించడంలో విఫలమయ్యాయని వారు గుర్తించినప్పుడు, ట్రస్ట్ అధికారులు ఆరోగ్యశ్రీ పథకం కింద వారికి ఆరోగ్య సంరక్షణ అందించడానికి ఇచ్చిన అనుమతిని నిలిపివేశారు. ఆసుపత్రుల నుంచి వివరణ కోరగా, వారి సమాధానం ఆధారంగా తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Also Read: Gyanvapi Mosque : హిందూ ఆలయంపైనే జ్ఞానవాపి మసీదు.. ఏఎస్ఐ సంచలన నివేదిక
ఆరోగ్యశ్రీ పథకం కింద కొన్ని ఆసుపత్రులు మాత్రమే రోగులకు ఆరోగ్య సేవలను అందించడం ఆపివేసాయని ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డి.కె. బాలాజీ తెలిపారు. నిన్న రాత్రి 318 కోట్లు విడుదల చేశామని.. కొన్ని ఆసుపత్రులు ఇప్పటికీ ఆరోగ్య సంరక్షణను అందించనందున, ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు చికిత్స చేయడానికి వారికి ఇచ్చిన అనుమతిని నిలిపివేశామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ కింద ఇప్పటివరకు రూ. 2,500 కోట్లు ఆసుపత్రులకు విడుదల చేసినట్లు ట్రస్ట్ అధికారులు పేర్కొన్నారు.
Related News
Praja Rajyam party: ప్రజారాజ్యం నాశనం కావడానికి కారణం అతనే: పవన్
ప్రజారాజ్యం ... మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పార్టీ ఇది. ఓ పదిహేనేళ్ళ క్రితం ఈ పేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ, కాంగ్రెస్ ఏలుతున్న రోజులవి. 2008 ఆగస్టు 26న ఎన్నో ఆశలు, ఆశయాలతో స్థాపించారు మెగాస్టార్ చిరు. ప్రజారాజ్యంలో యువరాజ్యం సగభాగం. యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నారు.