AP govt: ఏపీ ఉద్యోగుల్లో బదిలీల సందడి!
ఏపీ ఉద్యోగుల్లో బదిలీల కలకలం బయలు దేరింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బుధవారం నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది.
- By Balu J Published Date - 05:22 PM, Tue - 7 June 22
ఏపీ ఉద్యోగుల్లో బదిలీల కలకలం బయలు దేరింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బుధవారం నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఐదేళ్లుగా ఒకే చోట పనిచేస్తోన్న వాళ్లు బదిలీలకు అర్హులు, 40 శాతం వైకల్యం ఉన్న వారికి బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే, వితంతువులకు ప్రాధాన్యమివ్వనున్న ఏపీ ప్రభుత్వం విధాన నిర్ణయంగా ఉంది. సాధారణ బదిలీలు ముగిసిన తరువాత ఈనెల 18వ తేదీ నుంచి మళ్లీ అమల్లోకి బదిలీలపై నిషేధం రానుంది.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు సంబంధించిన విధి విధానాలను వెల్లడిస్తూ మంగళవారం మధ్యాహ్నం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ బదిలీలలో ఎవరెవరికి ప్రాధాన్యం ఇవ్వనున్నదీ ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాకుండా ఈ నెల 18 నుంచి తిరిగి ఉద్యోగుల బదిలీలపై నిషేధం అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఒకే చోట ఐదేళ్లుగా పని చేస్తున్న ఉద్యోగులు బదిలీలకు అర్హులు. 40 శాతం కంటే అధిక వైకల్యం ఉన్న ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యం లభించనుంది. మానసిక వైకల్యం కలిగిన పిల్లలున్న ఉద్యోగులకు కూడా ప్రాధాన్యం దక్కనుంది. కుటుంబీకుల్లో దీర్ఘకాల వ్యాధులున్న ఉద్యోగులకు కూడా బదిలీల్లో ప్రాధాన్యమివ్వనున్నారు. కారుణ్య నియామకాల కింద నియమితులైన వితంతువులకు కూడా బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వనుంది.
Related News
Kodali Nani: 130 సార్లు జగన్ బటన్ నొక్కి 2 లక్షల 70 వేల కోట్లు ప్రజల ఖాతాల్లోకి జమ చేశారు : కొడాలి నాని
Kodali Nani: ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా, నాడు నేడు , వంటి కార్యక్రమాలతో సీఎం జగన్ ప్రజల్లో మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు జగన్ చేసిన కార్యక్రమాల్లో ఒక్కటైనా చేయలేకపోయారన్నారు. లంచాలు లేని వివక్