Andhra Pradesh: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి ప్రైవేట్ వ్యక్తులకు నో ఎంట్రీ
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి ప్రైవేట్ వ్యక్తులకు ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
- By hashtagu Published Date - 01:06 PM, Mon - 20 December 21
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి ప్రైవేట్ వ్యక్తులకు ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు సహా అనధికార వ్యక్తులెవరూ కార్యాలయాల్లోకి ప్రవేశించకూడదని జగన్ సర్కారు ఆదేశించింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఐజీ రామకృష్ణ నివేదిక జారీ చేశారు.
అనధికారిక వ్యక్తుల వల్ల రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి జరుగుతోందని ఏసీబీ నివేదిక అందించింది నేపథ్యంలోనే వీరి ప్రవేశంపై నిషేధం విధించారు. తమ ఆదేశాలను కాదని కార్యాలయాల్లోకి ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాము సీజ్ చేసిన, లెక్కల్లోకి రాని నగదు స్టాంప్ వెండర్లు, డాక్యుమెంట్ రైటర్ల ద్వారానే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరిందని ఏసీబీ తెలిపింది.
Related News
Chandrababu: ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ..అన్ని జిల్లాల ఎస్పీలకు లేఖ కాపీలు
Chandrababu Letter: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు(Andhra Pradesh Assembly Elections) నోటిఫికేషన్ వెలువడనున్న వేళ తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు(Chandrababu) రాష్ట్ర డీజీపీ(DGP)కి లేఖ(Letter) రాశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో తనపై నమోదైన కేసులకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని అందులో కోరారు. ఎన్నికల నామినేషన్ పక్రియలో అభ్యర్థి తనపై ఉన్న కేసుల వివరాలు పేర్కొనాల్సి ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా క�