HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Government Clarity On 200 Units Of Free Electricity

200 Units of Free Electricity : 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌పై కూటమి ప్రభుత్వం క్లారిటీ

200 units of free Electricity : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం నిలిపివేశారని విపక్షాలు ఆరోపించాయి. దీన్ని ఖండించిన కూటమి ప్రభుత్వం, పథకం అమలు నెమ్మదిగా జరుగుతున్నదే తప్ప రద్దు కాలేదని

  • Author : Sudheer Date : 03-12-2024 - 8:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
200 Units Free Current
200 Units Free Current

ఆంధ్రప్రదేశ్‌ కూటమి (AP Govt) ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం (200 units free electricity scheme)పై స్పష్టతనిచ్చింది. ఈ పథకాన్ని రద్దు చేసినట్లు వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, పథకం కొనసాగుతోందని ప్రభుత్వం పేర్కొంది. కేవలం కొన్ని మార్గదర్శకాలు (Guidelines) పాటిస్తే అర్హులంతా ఉచిత విద్యుత్‌ లబ్ధి పొందవచ్చని విద్యుత్‌ శాఖ(Electricity Department) తెలిపింది.

గత వైసీపీ ప్రభుత్వం (YCP Govt) ప్రవేశపెట్టిన ఈ పథకం ఎస్సీ, ఎస్టీ వర్గాల పేద కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించడంలో సహకరించింది. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం నిలిపివేశారని విపక్షాలు ఆరోపించాయి. దీన్ని ఖండించిన కూటమి ప్రభుత్వం, పథకం అమలు నెమ్మదిగా జరుగుతున్నదే తప్ప రద్దు కాలేదని, కొత్త లబ్ధిదారులను కూడా చేర్చుతున్నామని వివరించింది.

ప్రస్తుతం 10,547 మంది కొత్త లబ్ధిదారులు ఈ పథకాన్ని పొందుతున్నారు. విద్యుత్ శాఖ అధికారిక ప్రకటన ప్రకారం, మరింత మంది అర్హుల్ని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. గతంలో జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఆరు అంచెల కోత విధానం వల్ల పలు సంక్షేమ పథకాలకు పేదలు అర్హత కోల్పోయారని, కూటమి ప్రభుత్వం దానిని సరిదిద్దే పనిలో ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు.

ఉచిత విద్యుత్‌ పొందాలనుకునే వారు కొన్ని మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. అర్హత కలిగిన వారు తమ కుల ధృవీకరణ పత్రం, అవసరమైన ఇతర పత్రాలతో మీ సేవ కేంద్రాలు లేదా విద్యుత్‌ కార్యాలయాలను సంప్రదించాలి. వీటి ప్రక్రియ పూర్తయిన వెంటనే వారు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను పొందవచ్చు. ప్రభుత్వం పథకం అమలుపై స్పష్టమైన హామీ ఇస్తోంది. లబ్ధిదారులు తగిన పత్రాలు సమర్పించి పథకం ద్వారా లబ్ధి పొందాలని సూచించింది. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మకుండా సమర్థవంతంగా ముందడుగు వేయాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Read Also : Sankranti Sentiment : సంక్రాంతి నుంచి జనంలోకి జగన్, కేసీఆర్ .. సెంటిమెంట్ కలిసొచ్చేనా ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 200 units of free electricity
  • ap govt
  • clarity

Related News

Pulse Polio Programme

నేడే పల్స్ పోలియో..తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకండి

నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇవాళ కచ్చితంగా ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి. 38,267 బూత్ల ద్వారా 54,07,663 మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయనున్నారు

  • Pulse Polio Dec21

    రేపే పల్స్ పోలియో! అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఏపీ సర్కార్

  • Lokesh Foreign Tour

    ఏపీ అభివృద్ధికి జగన్ అడ్డు వస్తున్నాడు – లోకేష్ సంచలన ఆరోపణలు

Latest News

  • ట్రంప్ నువ్వు మారవా ? మళ్లీ అదే మాట!

  • ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను ముక్కలుగా నరికి చంపిన భార్య

  • మీ సామాన్లు చూపించడం మానేసి, చక్కగా చీర కట్టుకోండి అంటూ హీరోయిన్ల పై శివాజీ సంచలన వ్యాఖ్యలు

  • కెసిఆర్, హరీష్ రావు లకు నోటీసులు ఇచ్చేందుకు సిద్దమైన సిట్?

  • జాతీయ రైతు దినోత్సవం.. రైతులకు సరి కొత్త విధానాలను తెలియచెప్పడమే దాని లక్ష్యం..

Trending News

    • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

    • ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్‌పై వేటు!

    • విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల త‌ర్వాత రోహిత్‌!

    • 2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్‌లు!

    • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd