AP Government : పదో తరగతి ప్రశ్నపత్రాల్లో స్వల్ప మార్పులు చేసిన ఏపీ ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి ప్రశ్నపత్రాల్లో(Question Paper) స్వల్ప మార్పులు చేసింది. మొదటి, రెండో భాషా ప్రశ్నపత్రాల్లో మార్పులు తీసుకొచ్చింది.
- By News Desk Published Date - 09:30 PM, Thu - 27 July 23
ఏపీ ప్రభుత్వం(AP Government) విద్యావ్యవస్థలో పలు మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికే స్కూల్స్, కాలేజీలలో అనేక అంశాలలో పలు మార్పులు తీసుకురాగా తాజాగా మరో కొత్త మార్పుకి శ్రీకారం చుట్టింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి ప్రశ్నపత్రాల్లో(Question Paper) స్వల్ప మార్పులు చేసింది. మొదటి, రెండో భాషా ప్రశ్నపత్రాల్లో మార్పులు తీసుకొచ్చింది. మొదటి భాష తెలుగు(Telugu)తో పాటు రెండో భాషగా ఉన్న హిందీ, ఒడియా, ఉర్దూ, కన్నడ, తమిళ ప్రశ్నపత్రాల్లో మార్పులు చేసింది. ఈ మేరకు మార్పులకు సంబంధించి బ్లూప్రింట్లను వెబ్సైట్ లో పెట్టినట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వెయిటేజీతో పాటు మోడల్ పేపర్లను వెబ్సైట్ లో పెట్టినట్లు వెల్లడించింది.
సైన్స్ ప్రశ్నపత్రం నమూనా కూడా మారుస్తామని , అది కూడా త్వరలో వెబ్సైట్ లో పెడతామని అధికారులు తెలిపారు. ఆంగ్లం, గణితం, సోషల్ స్టడీస్ పేపర్లలో మాత్రం ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు.
Also Read : Woman missing : పవన్ కళ్యాణ్ పై వాసిరెడ్డి పద్మ విమర్శలు
Related News
AP : ఏపి ఎన్నికల హింసాత్మక సంఘటనలపై సిట్ ఏర్పాటు..!
AP Govt: ఏపి ఎన్నికల నిర్వహణలో తలెత్తిన లోపంపై కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) కఠిన చర్యలు చేపట్టింది. పోలింగ్ రోజున..మరుసటి రోజున ఏపిలోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఏపిలో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టిమ్ సిట్(Sit)ను ఏర్పాటు చేసిన సీఈసీ రాష్ట్రంలో హింసపై ప్రతి కేసును ప్రత�