HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Cm Ys Jagan Serious On Employees Issue

AP Employees: ఏపీ ఉద్యోగుల భ‌ర‌తం ప‌ట్ట‌నున్న జ‌గ‌న్‌

మేనిఫెస్టోలోని అంశాల‌న్నింటినీ నెర‌వేర్చిన ప్ర‌భుత్వాలు ఈ ప్ర‌పంచంలోనే లేవు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇచ్చిన హామీల‌ను య‌థాత‌దంగా అమ‌లు చేయ‌డం ఏ పార్టీకైనా అసాధ్యం. ఆ విష‌యం సామాన్యుల కంటే ఉద్యోగులకు బాగా తెలుసు.

  • Author : CS Rao Date : 25-04-2022 - 11:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Jagan66
Ys Jagan66

మేనిఫెస్టోలోని అంశాల‌న్నింటినీ నెర‌వేర్చిన ప్ర‌భుత్వాలు ఈ ప్ర‌పంచంలోనే లేవు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇచ్చిన హామీల‌ను య‌థాత‌దంగా అమ‌లు చేయ‌డం ఏ పార్టీకైనా అసాధ్యం. ఆ విష‌యం సామాన్యుల కంటే ఉద్యోగులకు బాగా తెలుసు. ప్ర‌భుత్వంలో భాగ‌స్వాములుగా ఉంటూ కూడా ఉద్యోగులు నేల‌విడిచి సాము చేస్తున్నారు. సీఎంగా చంద్ర‌బాబు ఉన్న టైంలో ఆడింది ఆట పాడింది పాట‌గా స్వేచ్ఛను అనుభ‌వించారు. ప్ర‌జాధనాన్ని జీతాల రూపంలో ఇష్టాసారంగా పెంచుకునేలా ఆయ‌న‌పై ఒత్తిడి తెచ్చారు. గొంతెమ్మ కోర్కెల‌ను తీర్చుకున్నారు. ఇప్పుడు జ‌గ‌న్ హ‌యాంలో వాళ్ల ఆట‌లు సాగ‌డంలేదు. అందుకే, సీపీఎస్ ర‌ద్దును తెర మీద‌కు తీసుకొచ్చారు. మేనిఫెస్టోలోని మిగిలిన అంశాల‌పై మాత్రం ఉద్యోగులు నోరెత్త‌డంలేదు.

2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా మ‌ద్య‌నిషేధం, సీపీఎస్, రుణాల మాఫీ, రూ. 3వేల పెన్ష‌న్..ఇలా న‌వ‌ర‌త్నాల రూపంలో జ‌గ‌న్ ఎన్నో హామీల‌ను ఇచ్చారు. వాటిని అమ‌లు చేయాల్సిన బాధ్య‌త ఉద్యోగుల‌పై ఉంది. అదేమీ లేకుండా కేవ‌లం వాళ్ల స్వార్థం కోసం సీపీఎస్ ర‌ద్దు మాత్ర‌మే ఎజెండాగా తీసుకుని రోడ్ల మీద‌కు వ‌చ్చారు. పీఆర్సీ కోసం ఉపాధ్యాయ‌, ఉద్యోగ సంఘాలు రోడ్ల‌పైకి రావ‌డం ద్వారా జీతాల‌ను పెంచుకున్నారు. సామాన్యుల జీడీపీ, త‌ల‌స‌రి ఆదాయం, అదుపు త‌ప్పిన ద్ర‌వ్యోల్బ‌ణం త‌దిత‌రాలు ఉద్యోగుల‌కు ప‌ట్ట‌వు. వాళ్ల జీవితం విలాస‌వంతంగా ఉంటే చాలు. ప్ర‌జ‌ల జీవితం ఛిన్నాభిన్నం అయినా ప‌ట్టించుకోరు. ప్ర‌భుత్వాల‌పై పెత్త‌నం చేస్తూ వాళ్ల ప‌బ్బం గ‌డుపుకోవ‌డానికి ఎప్పుడూ జ‌ల‌గ‌ల్లా ప్ర‌జ‌ల్ని పీడించే వ‌ర్గం ఏదైనా ఉందంటే సంఘ‌టితంగా ఉండే ఉద్యోగులే.

Ap Employess

సీఎం జ‌గ‌న్‌, ప్ర‌భుత్వ ఉద్యోగ సంఘాల మ‌ధ్య ప్ర‌చ్చ‌న్న‌యుద్ధం మ‌ళ్లీ మొద‌లైయింది. రాష్ట్రం అప్పుల్లో ఉన్న‌ప్ప‌టికీ జీతాలు పెంచాల‌ని రోడ్ల‌పైకి వ‌చ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు సోమ‌వారం సీపీఎస్ ర‌ద్దు డిమాండ్ చేస్తూ ధ‌ర్నాల‌కు దిగారు. క‌మ్యూనిస్ట్ పార్టీల‌కు అనుబంధంగా ఉండే యూటీఎఫ్ లాంటి సంఘాలు ఎక్కువ‌గా జ‌గ‌న్ పై క‌న్నెర్ర చేసిన విష‌యం విదిత‌మే. ముఖ్యమంత్రి జగన్ కార్యాలయం ముట్టడికి ఉపాధ్యాయులు పిలుపునివ్వడంతో విజయవాడలో పోలీసులు హై అలర్ట్ ప్ర‌క‌టించారు. నగర‌మంత‌టా 144 సెక్షన్ ను విధించారు. విజయవాడకు వచ్చే అన్ని రహదారుల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. తాడేపల్లిలోని సీఎం కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నారు. దావులూరు, పొట్టిపాడు, కాజా చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్నారు.

రైలు, రోడ్డు మార్గాల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు విజయవాడ, గుంటూరుకు చేరుకోకుండా పోలీసులు తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద పూర్తి నిఘా ఉంచారు. సెల్ ఫోన్లు, ఐడీ కార్డులు చెక్ చేసి పంపుతున్నారు. ఇప్పటికే దావులూరు చెక్ పోస్ట్ వద్ద 27 మందిని, తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్లకు తరలించారు. యూటీఎఫ్ చేపట్టిన నిరసనకు అనుమతి లేదని ఇప్పటికే విజయవాడ పోలీస్ కమిషనర్ ప్ర‌క‌టించారు.

పీఆర్సీ కోసం రోడ్ల‌పైకి వ‌చ్చిన ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాల‌ను అదుపుచేయ‌లేక‌పోయిన డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ పై ఇటీవ‌ల వేటు ప‌డింది. ఆనాడు పోలీసులు కూడా ఉద్యోగుల‌కు స‌హ‌కారం అందించారు. ఆ మేర‌కు నిఘా వ‌ర్గాల స‌మాచారం కూడా ప్ర‌భుత్వం వ‌ద్ద ఉంది. ఈసారి అలాంటి పొర‌బాటు జ‌ర‌గ‌కుండా ప్ర‌స్తుతం ఏపీ డీజీపీ క‌సిరెడ్డి రాజేంద్ర‌నాథ్ రెడ్డి జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. విజ‌య‌వాడ కేంద్రంగా ఉండే సంఘాల నాయ‌కులు, విప‌క్ష పార్టీల క్యాడ‌ర్ స‌హ‌కారంతో రోడ్ల‌పైకి గ‌తంలో మాదిరిగా రావ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తోంది. అందుకే, విజ‌య‌వాడ మొత్తం పోలీసులు దిగ్బంధం చేశారు. సీపీఎస్ ర‌ద్దు పై సీఎం జ‌గ‌న్ వివ‌ర‌ణ ఇచ్చారు. మొండిప‌ట్టుతో ఉద్యోగులు ప్ర‌భుత్వంపై పెత్త‌నం చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అర్థం అవుతోంది. ఇలాంటి పరిణామం వెనుక ఎవ‌రున్నారో తేల్చ‌డానికి ప్రభుత్వం నిఘా వ‌ర్గాల ద్వారా స‌మాచారాన్ని సేక‌రిస్తోంది. సీఎం జ‌గ‌న్ ఈసారి ఉద్యోగుల‌ను ఊదాసీనంగా వ‌ద‌ల‌కుండా త‌డాఖా చూపాల‌ని చేస్తోన్న ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందా? లేదా చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap employees
  • maha dharna
  • ys jagan

Related News

YS Jagan to meet Governor today with one crore signatures

కోటి సంతకాలతో నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో జగన్ భేటీ కానున్నారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి, పీపీపీ విధానాన్ని రద్దు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరనున్నారు.

    Latest News

    • స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధర

    • తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

    • భారత్ vs సౌతాఫ్రికా ఈ సిరీస్‌ చివరి టీ20!

    • కవిత దూకుడు, బిఆర్ఎస్ శ్రేణుల్లో చెమటలు

    • విటమిన్​ బి12 లోపం లక్షణాలు ఇవే!

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd