HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Ap Cm Jagan Tour Tomorrow In Konaseema Flood Villages

Konaseema Tour: రేపు లంక గ్రామాల్లో సీఎం జగన్ పర్యటన

కోనసీమను కుదిపేసిన గోదావరి వరద ఇప్పుడిప్పుడే తగ్గు ముఖం పడుతుంది. దాదాపు 100కు పైగా గ్రామాలు గోదావరి ముంపు బారిన పడ్డాయి.

  • By Naresh Kumar Published Date - 08:29 PM, Mon - 25 July 22
  • daily-hunt
Jagan Surveh Helicopter
Jagan Surveh Helicopter

కోనసీమను కుదిపేసిన గోదావరి వరద ఇప్పుడిప్పుడే తగ్గు ముఖం పడుతుంది. దాదాపు 100కు పైగా గ్రామాలు గోదావరి ముంపు బారిన పడ్డాయి. అనేక చోట్ల కాజువేలు కొట్టుకుపోయాయి. వరద సమయంలో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం అధికారులు విస్తృతంగా సేవలందించారు.

ముంపు బాధితులు ఇబ్బందులు పడకుండా పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపుథ్యంలో ముంపు బాధ్యత ప్రాంతాలను పరిశీలించి బాధితులను పరామర్శించేందుకు సీఎం వైఎస్ జగన్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో పర్యటించనున్నారు. సీఎం పర్యటన కోసం గంటి పెదపూడి వద్ద హెలిపాడ్ ఏర్పాటు చేశారు. అక్కడ నుండి ఏటిగట్టు మీదుగా గోదావరి పాయలు దాటేందుకు పంట్లు ఏర్పాటు చేశారు. ఉదయం 9.40కి తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం పదిన్నరకు గంటి పెదపూడి హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.

అక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా గంటి పెందపూడి ఫెర్రీ పాయింట్‌కు చేరుకుంటారు. ఫెర్రీలో ప్రయాణించనున్న సీఎం ముంపు గ్రామాలను సందర్శిస్తారు. అక్కడ వరద బాధితులను పరామర్శించనున్నారు సీఎం. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు ఇక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరిగెలవారిపేట, ఊడుమూడిలంక గ్రామాలకు చేరుకోనున్నారు. ఈ గ్రామాల్లో ముందు బాధితులతో మాడ్లనున్న సీఎం మళ్ళీ రోడ్డు మార్గం ద్వారా ఫెర్రీ పాయింట్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.గంటా 45 నిమిషాలకు గంటి పెదపూడి హెలీప్యాడ్ నుంచి పి.గన్నవరం మండలం వడ్రేవుపల్లి గ్రామానికి బయలుదేరతారు. అక్కడి ముంపు బాధితులను పరామర్శించనున్న సీఎం తర్వాత రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం 2.40 కి రాజోలు మండలం మేకపాలెం వెళతారు. అక్కడి బాధితులతో మాట్లాడిన తర్వాత రోడ్డు మార్గం ద్వారా వడ్రేవుపల్లి హెలీప్యాడ్‌కు చేరుకుని రాజమండ్రి బయలుదేరతారు. సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు రాజమండ్రి చేరుకున్న అనంతరం అధికారులతో సమావేశం కానున్నారు. రాత్రికి రాజమండ్రి ఆర్‌ అండ్ బీ గెస్ట్ హౌస్‌లోనే సీఎం జగన్ బస చేయనున్నారు.

లంకల గన్నవరం, మానేపల్లిలో వరద బాధితులు సీఎం జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. తమకు ఎలాంటి హామీ ఇస్తారో అని ఎదురు చూస్తున్నారు. కాగా వరద బాధితులను పరామర్శించడంతో పాటు జిల్లాలో దెబ్బతిన్న పంటలను జగన్ పరిశీలిస్తారు. వరద నష్టాన్ని అంచనా వేసి తయారుచేసే నివేదికను సీఎం జగన్‌ కేంద్ర ప్రభుత్వానికి అందజేసి సాయం కోరనున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM
  • cm jagan
  • konaseema floods
  • konaseema tour

Related News

A milestone in a long political career.. 30 years since becoming CM for the first time!

Chandrababu Naidu : సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మైలురాయి..తొలిసారి సీఎం అయి నేటికి 30 ఏళ్లు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటితో (సెప్టెంబర్ 1, 2025) 30 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1995లో మొదలైన ఈ జర్నీ, నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన రాజకీయ జీవితంలో ఆయనకు ఎంతో ప్రాధాన్యమైన ఘట్టం.

    Latest News

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd