HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Cm Jagan Gives Shock To Some Ycp Mlas And Ministers

CM Jagan: ఆ ఎమ్మెల్యేలకు జగన్ షాక్.. నెలలో 16 రోజులైనా అలా చేయకపోతే నో టిక్కెట్

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.

  • By Hashtag U Published Date - 12:56 PM, Tue - 19 July 22
  • daily-hunt

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఆయన తన క్యాంపు కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. అందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, వైపీసీ ప్రాంతీయ సమన్వయకర్తలు అందరూ పాల్గొన్నారు. అదేమీ రొటీన్ సమావేశం కాదని.. ఆ మీటింగ్ స్టార్ట్ అయిన కాసేపటికే వారికి అర్థమైపోయింది.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతున్న తీరుపైనా.. ఎమ్మెల్యేలు, మంత్రులు అందులో పాల్గొనే విధానంపైనా జగన్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్… పార్టీ వర్గాల్లో గుబులు రేపుతోంది. తానిప్పుడు కఠినంగా మాట్లాడలేదని ఎవరూ లైట్ తీసుకోవద్దని.. పని చేయనివారికి టిక్కెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పేశారు. తరువాత తనను అనుకుని ప్రయోజనం లేదని క్లారిటీ ఇచ్చేశారు.

ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నేతలు ఎవరైనా సరే వారి నియోజవర్గాల్లో తిరగకపోతే తీవ్ర నిర్ణయాలు తీసుకోవడానికి జగన్ రెడీ అయినట్లు తెలుస్తోంది. వారందరి పనితీరును గమనించడానికి వీలుగా 175 నియోజకవర్గాలకు ప్రత్యేకంగా పరిశీలకులను నియమిస్తామని జగనే స్వయంగా చెప్పారు. అంటే ఇక నుంచి ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి ఎప్పుడెప్పుడు ఏం చేస్తారో ఆ చిట్టా అంతా తన వద్ద ఉంటుందని జగన్ స్వయంగానే చెప్పేశారు.

రాష్ట్రంలో ఇప్పటికే 87 శాతం ఇళ్లకు లబ్ది చేకూర్చామని.. ఆ మంచినే ప్రజలకు చెప్పాలని జగన్ అన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలు నిలదీస్తున్నారు. దీంతో వారంతా గడపగడపకూ వెళ్లడానికి భయపడుతున్నారు. జగన్ నియమిస్తారని చెబుతున్న ఆ 175 మంది పరిశీలకులు ఎవరు.. ఎక్కడుంటారు.. ఏం చేస్తారు.. అన్న వివరాలను తెలుసుకునే పనిలో ఉన్నారు వైసీపీ ప్రజా ప్రతినిధులు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra Ministers
  • AP CM
  • cm jagan
  • MLAs
  • MLAs performance

Related News

    Latest News

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

    • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

    • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

    • Deepotsav: ఢిల్లీ కర్తవ్య పథ్‌లో అద్భుత దీపోత్సవం.. ప్రారంభించిన సీఎం రేఖ గుప్తా!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd