AP BJP: రాష్ట్ర ‘ఆర్ధిక పరిస్థితి’పై శ్వేతపత్రం విడుదల చేయాలి!
సచివాలయ ఉద్యోగులను పర్మనెంట్ చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు.
- By Balu J Published Date - 12:03 PM, Fri - 22 April 22
సచివాలయ ఉద్యోగులను పర్మనెంట్ చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని అందుకే పర్మనెంట్ చేయలేదనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉంటే ఎలా ఆయన ప్రశ్నించారు. వెంటనే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమం పథకాలకు నిధులు అందిస్తుందని, అయినా జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా బిజెవైఎం ఎపిపిఎస్ఇ కార్యాలయం వద్ద ఆందోళన కు పిలుపు ఇస్తే ఇష్టానుసారంగా అరెస్టు చేశారని, బిజెవైఎం కార్యకర్తలు ఉన్న లాడ్జి యజమానులు పై కేసులు పెడితే బిజెపి సీరియస్ గా పరిగణిస్తుందని సోము వీర్రాజు అన్నారు. బిజెవైఎం నాయకులను గృహ నిర్భందం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఖండించారు.
ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ లలో పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదని, సమస్యలపై పోరాడితే అరెస్ట్ లు చేయడం విడ్డూరమని అన్నారు. కోర్టులో దొంగతనం జరగడాన్ని నేను ఇప్పుడే చూస్తున్నానని, నైతికత లేని వాళ్లకు మంత్రి పదవులు జగన్ ఇచ్చారని మండిపడ్డారు. రేషన్ బియ్యాన్ని కృష్ణపట్నం..కాకినాడ పోర్టుల ద్వారా ఎగుమతి చేస్తున్నారని, ఒంగోలు లో సి.ఎం.జగన్ వస్తున్నారని బి.జె.పి.నేతలను అరెస్ట్ చేయడం దారుణమని ఆయన అన్నారు. బియ్యం కుంభకోణాన్ని వెలికితీసిన బి.జె.పి.నేతలపై కేసులు పెడుతున్నారని, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బి.జె.పి. పోటీ చేస్తుందని సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు.
Related News
Kodali Nani: జగన్ గెలుపును అడ్డుకునే శక్తి రాష్ట్రంలో ఎవ్వరికీ లేదు: కొడాలి నాని
Kodali Nani: గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత పార్టీ నేతలతో కలిసి వైఎస్ఆర్సిపి జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని, స్వర్గీయ వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి, వార్షికోత్సవ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తూ, జోహార్ వైయస్ఆర్.. జై జగన్… జిందాబాద్ కొ�