HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Another Tragic Incident Jagan Tour

YS Jagan Sattenapalli Tour : మరో ప్రాణం పోవడానికి జగన్ పరోక్షంగా కారణమయ్యాడు

YS Jagan Sattenapalli Tour : చేతికి అందివచ్చిన కుమారుడు వైసీపీ కార్యకర్తల మూర్ఖత్వం కారణంగా సకాలంలో వైద్యం అందక మరణించాడనే కఠోరవాస్తవాన్ని ఇప్పుడు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు

  • By Sudheer Published Date - 06:22 PM, Wed - 25 June 25
  • daily-hunt
Another Tragic Incident
Another Tragic Incident

మరో ప్రాణం పోవడానికి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ (Jagan) పరోక్షంగా కారణమయ్యాడు. జూన్ 18న జగన్ సత్తెనపల్లి పర్యటన (Sattenapalli Tour) చేసిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన పలు కుటుంబాల్లో విషాదం నింపింది. జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే వ్యక్తి మరణించగా..మరో వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఇప్పుడు మరో ప్రాణం గాల్లో కలిసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సత్తెనపల్లికి చెందిన 22 ఏళ్ల తెల్లజర్ల మధు (Madhu) అనే యువకుడు జూన్ 18 న బ్రెయిన్ స్ట్రోక్‌తో కుప్పకూలాడు.

అతడిని గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగా, జగన్ పర్యటన కారణంగా కార్యకర్తల ర్యాలీ అంబులెన్స్‌కు అడ్డుపడింది. దాదాపు గంటసేపు ట్రాఫిక్‌లోనే చిక్కుకున్న మధు అప్పటికే అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి మధు ఆరోగ్యం విషమంగా మారింది. ఓ రోజు పాటు చికిత్స చేసినప్పటికీ మధు బ్రతకలేదు. గంట ముందు హాస్పటల్ కు తీసుకొస్తే మీ కొడుకు బ్రతికేవాడు అని డాక్టర్స్ చెప్పడం తో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

“ఒక గంట ముందే ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే ప్రాణాలు నిలిచేవి” అని, వైసీపీ కార్యకర్తలు అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదని, ఎంత ప్రాధేయపడినా కనికరం చూపలేదని కుటుంబ సభ్యులు , సన్నిహితులు ఆరోపిస్తున్నారు. మధు తల్లి తండ్రులు భోరున విలపిస్తూ, జగన్ పర్యటన వల్లే తమ కొడుకు చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ హడావుడి కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడం తగదని వారు ప్రశ్నిస్తున్నారు. జగన్ పర్యటన వల్ల పరోక్షంగా మూడు ప్రాణాలు పోయాయని అధికార పార్టీ నేతలు వాపోతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Another Tragic Incident
  • Jagan Sattenapalli
  • Madhu Dies
  • ys jagan
  • YS Jagan Sattenapalli Tour

Related News

    Latest News

    • SLBC : ఉత్తమ్ కుమార్ సలహాలతో ముందుకు వెళ్తాము – సీఎం రేవంత్

    • Sree Charani: శ్రీ చరణికి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్

    • Domestic Violence : అక్రమ సంబంధం తెలిసిపోయిందని కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

    • New Rules : ఏపీ ప్రజలు తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్..లేదంటే పథకాలు కట్

    • Monalisa : పూసలపిల్ల తెలుగు సినిమా చేయబోతుందా..? ఆ నిర్మాత అదే ప్లాన్ లో ఉన్నాడా..?

    Trending News

      • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

      • Kartik Purnima: రేపే కార్తీక పౌర్ణ‌మి.. ఏ రాశి వారు ఎలాంటి వ‌స్తువులు దానం చేయాలో తెలుసా?

      • India Post Payments Bank: ఇక‌పై ఇంటి నుండే ఆ సర్టిఫికేట్ పొందవచ్చు!

      • Rs 2,000 Notes: మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా రూ. 2 వేల నోట్లు!?

      • Net Worth: భార‌త్‌, సౌతాఫ్రికా జ‌ట్ల కెప్టెన్ల సంపాద‌న ఎంతో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd