HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Another Major Industry For Ap Cm Chandrababu Meets Sael Representatives

SAEL Investment In AP: ఏపీకి మరో భారీ పరిశ్రమ.. ఎస్ఏఈఎల్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ…

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ స్థాపించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్, రాష్ట్రంలో 1200 మెగావాట్ల రెన్యువల్ ఎనర్జీ ప్లాంట్ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తోంది.

  • By Kode Mohan Sai Published Date - 05:39 PM, Sat - 14 December 24
  • daily-hunt
Sael Investment In Ap
Sael Investment In Ap

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024కు అంతర్జాతీయ స్థాయిలో సానుకూల స్పందన వస్తోంది. ఈ సందర్భంగా, రాష్ట్రంలో మరో అంతర్జాతీయ పరిశ్రమ పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ, ఏపీలో 1200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రీన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్ నిర్మించడానికి సన్నధమవుతుంది. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టాలని వారు నిర్ణయించారు.

ఇటీవల, ఎస్ఏఈఎల్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో సమావేశం జరిపారు. ఈ భేటీలో సోలార్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి, సోలార్ ప్యానెల్స్ తయారీ రంగం గురించి చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం, ఎస్ఏఈఎల్ సంస్థ ఏపీలో 1200 మెగావాట్ల రెన్యూబల్ ఎనర్జీ కెపాసిటీ ప్రాజెక్టు చేపట్టే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

గత ఐదేళ్ల జగన్ రెడ్డి ప్రభుత్వంలో వైసీపీ నేతల బెదిరింపులతో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా తిరిగి వెనక్కి వెళ్లిపోయాయి. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు, కొత్తగా పరిశ్రమలు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఉండేది. కానీ విజనరీ సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం… pic.twitter.com/nDNm1u3JFA

— Gottipati Ravi Kumar (@ravi_gottipati) December 13, 2024

నారా లోకేష్‌తో ఎస్ఏఈఎల్ ప్రతినిధుల భేటీ:

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, శనివారం ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (SAEL) ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని నారా లోకేష్ ఆయన ఎక్స్ వేదిక ద్వారా వెల్లడించారు. ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్ ఎండీ సుఖ్‌బీర్ సింగ్‌తో జరిగిన భేటీ సమయంలో, ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఏఈఎల్ సంస్థ 1200 మెగావాట్ల రీన్యూబల్ ఎనర్జీ కెపాసిటీ ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టనున్నట్లు ప్రకటించారు. తొలివిడతలో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన క్లీన్ ఎనర్జీ పాలసీ గురించి నారా లోకేష్ మాట్లాడారు. “ఈ పాలసీ అమలు ప్రారంభించిన తర్వాత వస్తున్న తొలి ప్రాజెక్టు ఇదే” అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదే విధంగా, చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్రణాళికపై ఎస్ఏఈఎల్ ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు తెలిపారు. “వ్యవసాయ వ్యర్ధాలను ఉపయోగించి విద్యుత్ తయారు చేసే అంశంపై కూడా ఆలోచనలు చేస్తున్నాం” అని నారా లోకేష్ పేర్కొన్నారు. ఇటీవల, నారా లోకేష్ ఎన్డీబీ బ్యాంక్ ప్రతినిధులతోనూ ఒక భేటీ నిర్వహించారు.

I met Mr. Sukhbir Singh, Managing Director, SAEL Industries Ltd. to discuss SAEL's upcoming 1200 MW investment in Andhra Pradesh to be developed in two phases. They will be commencing work on the first phase 600 MW project, one of the first projects to commence construction under… pic.twitter.com/doZP5BJBfF

— Lokesh Nara (@naralokesh) December 14, 2024

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, ఎస్ఏఈఎల్ ప్రతినిధులతో భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రతినిధులతో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో, ఎన్డీబీ బ్యాంక్, ఎస్ఏఈఎల్ ప్రతినిధులు వివిధ అంశాలపై సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపారు.

రెన్యూబుల్ ఎనర్జీ రంగంలో లీడింగ్ కంపెనీలైన ఎస్ఏఈఎల్ ప్రతినిధులతో భేటీ కావడం తనకు ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. “ఏపీలో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద పెట్టుబడుల అవకాశాలను పరిగణనలోకి తీసుకుని చర్చించినా” అంటూ ట్వీట్ చేశారు.

It was a pleasure to meet representatives of SAEL Ltd., and leading financial institutions in renewable energy @norfund, @NDBBank and Societe generale ( @SocGen_India ) to discuss investments under AP's landmark Integrated Clean Energy (ICE) Policy. We welcome investors to… pic.twitter.com/untMIZqUwn

— N Chandrababu Naidu (@ncbn) December 14, 2024


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • gottipati ravi kumar
  • Huge Investments In AP
  • nara lokesh
  • SAEL Investment In AP

Related News

YS Jagan

YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పగించడంపై జగన్ సందేహాలు వ్యక్తం చేశారు. ఇది లాభాలు ఆశించి పనిచేసే ప్రైవేటు కంపెనీలకు ప్రజల సొమ్ము దోచిపెట్టడానికేనని ఆరోపించారు.

  • AP Assembly monsoon session to begin from 18th of this month

    AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

  • People have immense faith in the judicial system: CM Chandrababu

    Visakhapatnam : న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది : సీఎం చంద్రబాబు

  • YSRCP's actions to tarnish the dignity of teachers are evil: Minister Lokesh

    Nara Lokesh : టీచర్ల గౌరవాన్ని దెబ్బతీసే వైసీపీ చర్యలు దుర్మార్గమైనవి : మంత్రి లోకేశ్‌

  • Nara Lokesh Pm Modi Yuvagalam Coffee Table Book Tdp Ap Govt

    Lokesh : నేడు ప్రధాని మోదీతో లోకేశ్ భేటీ

Latest News

  • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

  • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd