Four Month Baby : నాలుగు నెలల ‘శిశు మేధావి’.. భళా కైవల్య
Four Month Baby : కృష్ణా జిల్లా నందిగామకు చెందిన నాలుగు నెలల చిన్నారి కైవల్య ‘నోబుల్ ప్రపంచ రికార్డు’ను నెలకొల్పింది.
- By Pasha Published Date - 10:26 PM, Mon - 19 February 24
Four Month Baby : కృష్ణా జిల్లా నందిగామకు చెందిన నాలుగు నెలల చిన్నారి కైవల్య ‘నోబుల్ ప్రపంచ రికార్డు’ను నెలకొల్పింది. పక్షులు, కూరగాయలు, జంతువులు ఇలా 120 రకాల ఫోటోలను ఈ పాప సక్సెస్ ఫుల్గా గుర్తించడంతో వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. కైవల్య తల్లి హేమ.. తమ బిడ్డ ప్రతిభను గుర్తించి వీడియో రికార్డ్ చేసి నోబుల్ వరల్డ్ రికార్డ్స్కు పంపింది. మొత్తం 120 అంశాలను నాలుగు నెలల చిన్నారి గుర్తించడం ఓ రికార్డు అని నోబుల్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. ఫిబ్రవరి 13న పాప తల్లిదండ్రులకు ప్రశంసా పత్రంతో పాటు పతకాన్ని పంపించింది.
4-Month-Old Baby Sets #WorldRecord
Kaivalya, a 4month-old baby from Andhra Pradesh, achieves a remarkable feat by recognizing 120 types of pictures, including birds, vegetables, & animals. Kaivalya's talent acknowledged by Noble World Records highlights early cognitive abilities pic.twitter.com/sTp1Z3IE3d
— Informed Alerts (@InformedAlerts) February 17, 2024
We’re now on WhatsApp. Click to Join
కంటి చూపును మెరుగుపర్చే ఉద్దేశంతో..
వాస్తవానికి కైవల్య(Four Month Baby) కంటి చూపును మెరుగుపర్చే ఉద్దేశంతో ఆమె తల్లి హేమ బ్లాక్ అండ్ వైట్ బొమ్మలున్న కార్డులను చూపించడం మొదలుపెట్టింది. ఆన్లైన్లో ఫ్లాష్ కార్డులను కొనుగోలు చేసిన ఆమె.. వాటిని చూపిస్తున్నప్పుడు.. కైవల్య నిశితంగా గమనిస్తోందని గ్రహించారు. కార్డును చూపిస్తూ.. దానిపై ఉన్న చిత్రం పేరు చెప్పిన హేమ.. కొద్ది రోజుల తర్వాత రెండు కార్డులు చూపించి.. అందులోని ఓ చిత్రం పేరు చెబితే.. కైవల్య ఆ చిత్రం ఉన్న కార్డును పట్టుకునేది. దీంతో హేమ తన కుమార్తెకు ఇలా కార్డులను మార్చి మార్చి చూపేది. కైవల్య తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంటారు. పాప తండ్రి చల్లగుండ్ల రమేశ్ క్వెస్ట్ గ్లోబల్ అనే కంపెనీలో హార్డ్వేర్ ఉద్యోగి కాగా.. తల్లి హేమ కాగ్నిజెంట్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు.
Also Read : TSPSC Notification: 563 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్
Related News
AP EAMCET 2024 Exam: ఏపీలో రేపటి నుంచి EAPCET 2024 పరీక్షలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 ( EAPCET ) పరీక్షలు రేపు ప్రారంభం కానున్నాయి.