HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Pradesh Sees 21 Rise In Crimes Against Women Rs 8000 Crore Ganja Burnt

Crimes against Women: ఏపీలో మ‌హిళ‌ల‌పై పెరిగిన నేరాలు..!

ఏపీలో 2021 వ సంవ‌త్సరంలో మ‌హిళ‌ల‌పై నేరాలు పెరిగాయి. ఈ ఏడాదికి సంబంధించి వార్షిక నేర స‌మీక్షా స‌మావేశంలో డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

  • Author : hashtagu Date : 30-12-2021 - 11:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Police
Ap Police

ఏపీలో 2021 వ సంవ‌త్సరంలో మ‌హిళ‌ల‌పై నేరాలు పెరిగాయి. ఈ ఏడాదికి సంబంధించి వార్షిక నేర స‌మీక్షా స‌మావేశంలో డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది 14,603 కేసులు నమోదవగా.. ఈ ఏడాది 17,736 కేసులతో మహిళలపై నేరాలు 21% పెరిగాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆపరేషన్ పరివర్తన కింద విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో 7,226 ఎకరాల్లో గంజాయి పంటను స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) ధ్వంసం చేసింది. మాదక ద్రవ్యాలు, హానికరమైన పదార్థాల అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను ఇచ్చింది. ఎస్ఈబీ నాశనం చేసిన మొత్తం గంజాయి పంట బహిరంగ మార్కెట్‌లో రూ. 8,875 కోట్లుగా ఉంది.

మ‌హిళ‌ల‌పై కేసుల సంఖ్య పెరగడానికి ఎఫ్‌ఐఆర్‌ల ఉచిత నమోదు, రాష్ట్ర పోలీసులు ప్రారంభించిన వివిధ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌లు కారణమని డీజీపీ స‌వాంగ్ అన్నారు. ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌లు 36% కేసుల నమోదుకు కారణమయ్యాయ‌ని.. రాష్ట్రంలో వివిధ నేరాలకు సంబంధించిన మొత్తం 1,27,127 కేసులు 2020లో 1,22,987 కేసులు నమోదయ్యాయని తెలిపారు. మొత్తంగా మహిళలపై నేరాలు 14% (17,736 కేసులు), శారీరక నేరాలు 17%, రోడ్డు ప్రమాద కేసులు 14% ఆస్తి నేరాలు 11%, వైట్ కాలర్ నేరాలు 7%, IPC సెక్షన్ల కింద ఇతర నేరాలు 37%.గా ఉన్నాయ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

2021లో అత్యధికంగా మహిళలపై నేరాలు నమోదయ్యాయి. 2017లో 14,813, 2018లో 14,338, 2019లో 15,665, 2020లో 14,603 కేసులు నమోదయ్యాయి. మహిళలు, పిల్లలపై జరిగే నేరాల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని. ఏమాత్రం సహించేది లేదని కేసుల సంఖ్య పెరుగుదల సూచిస్తుందని.. నమోదైన కేసుల సంఖ్య పెరగడం పోలీసుల సమర్థతకు అద్దం పడుతోంద‌ని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. బహిరంగ మార్కెట్‌లో రూ.8,875 కోట్ల విలువైన గంజాయి పంటను ఎస్ఈబీ ద్వంసం చేసింద‌ని .. 314 కోట్ల విలువైన గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నామ‌ని డీజీపీ తెలిపారు. పోలీసులు తీసుకుంటున్న పటిష్టమైన చర్యలతో 2022లో గంజాయి స్మగ్లింగ్ తగ్గుముఖం పడుతుందని డీజీపీ తెలిపారు.

పోలీసింగ్‌లో సాంకేతికతను అవలంబించడంలో ఏపీ పోలీసులు అగ్రగామిగా ఉన్నారని పునరుద్ఘాటించిన సవాంగ్.. సమర్థత, పనితీరు వంటి వివిధ రంగాల్లో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. స్మార్ట్ పోలీసింగ్‌పై ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వేలో తాము మొదటి స్థానంలో నిలిచామని.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, SKOCH, NCRB, FICCI, ఇతరుల నుండి 150 కంటే ఎక్కువ జాతీయ స్థాయి అవార్డులను పొందామన్నారు. వేలిముద్రలు, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో రాష్ట్ర పోలీసులు మొదటి స్థానంలో నిలిచారని డీజీపీ తెలిపారు. మాట్రిక్స్ ఆఫ్ చేంజ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ విధానాన్ని అమలు చేయడం ద్వారా పోలీసు శాఖ పనితీరులో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. పారదర్శకతను పెంపొందించేందుకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సామర్థ్యాల పెంపుదలపై దృష్టి సారించేందుకు పోలీసులను పరిశీలనలో ఉంచుతున్నామని డీజీపీ తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap police
  • crime rate
  • in ap
  • women

Related News

Free Gas Connection In Ap

ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు!

Pradhan Mantri Ujjwala Yojana : పేద మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై)ను ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. సిలిండర్, రెగ్యులేటర్, పైపు, గ్యాస్ పుస్తకం, బిగింపు ఖర్చులన్నీ ఆయిల్ కంపెనీలే భరిస్తాయి. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివ

    Latest News

    • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు కౌశలం తో ఐటీ ఉద్యోగం

    • ఛాంపియన్ స్టోరీ ఇదే !!

    • స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధర

    • తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

    • భారత్ vs సౌతాఫ్రికా ఈ సిరీస్‌ చివరి టీ20!

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd