Viral Video: నీటిలో మునిగిన కుక్క పిల్లలను కాపాడిన ఏపీ పోలీసులు: తల్లి ప్రేమ
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగింది. దీంతో అత్యవసర పరిస్థితిల్లో ఉన్న వ్యక్తుల్ని స్థానిక పోలీసులు రోడ్లు దాటిస్తున్నారు.
- By Praveen Aluthuru Published Date - 01:09 PM, Sun - 30 July 23
Viral Video: ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగింది. దీంతో అత్యవసర పరిస్థితిల్లో ఉన్న వ్యక్తుల్ని స్థానిక పోలీసులు రోడ్లు దాటిస్తున్నారు. ఈ క్రమంలో ఓ తల్లి కుక్క పోలీసుల వద్దకు వచ్చి ఎదో చెప్పాలనుకుంది. ఈ క్రమంలో జాలిగా వారివైపు చూస్తూ ఏడవడం మొదలుపెట్టింది. అర్ధం చేసుకున్న పోలీసులు కుక్కని వెంబడించారు. పరిసర ప్రాంతంలో తల్లి కుక్క పిల్లలు నీటిలో మునిగి ఉండటం గమనించారు. దీంతో నీటిలో అల్లాడుతున్న కుక్క పిల్లలను రక్షించి తల్లికి అప్పజెప్పారు పోలీసులు సాయానికి తల్లి కుక్క ప్రేమగా వారి మీదకు ఎగబాకి తన ప్రేమను, కృతజ్ఞతను తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో అందర్నీ భావోద్వేగానికి గురి చేస్తుంది. వీడియోని ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జంతువుల పట్ల విజయవాడ నగర పోలీసులు మానవత్వంతో వ్యవహరించినందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కెవి రాజేంద్రనాథ్ రెడ్డి అభినందనలు తెలిపారు.
#APPolice rescued puppies stranded in flood water: In #NTR(D) due to massive floods loomed the puppies were trapped in a house. Cops realized the distress of mother #dog for her children. They immediately rescued them&safely brought them to their mother&showed humanity.(1/2) pic.twitter.com/UdA8KD99XD
— Andhra Pradesh Police (@APPOLICE100) July 30, 2023
Related News
Hyderabad: అమిత్ షా మీటింగ్ లో పిల్లలు, కేసు నమోదు
కేంద్ర మంత్రి అమిత్ షా, హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీలత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, యమన్ సింగ్ తదితరులపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో పిల్లలను పాల్గొనేలా చేసినందుకు మొగల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు.