HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Andhra Pradesh Govt Says Salaries Will Be Paid According To New Prc

AP PRC: కొత్త పీఆర్సీ పై తగ్గేదెలే..!

ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం సిద్దం అయింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సకాలంలో జీతాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

  • By CS Rao Published Date - 06:37 PM, Mon - 31 January 22
  • daily-hunt
Botsa Satyanarayana
Botsa Satyanarayana

ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం సిద్దం అయింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సకాలంలో జీతాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పీఆర్సీ జీఓలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా అంశాలపై చర్చించేందుకు సీఎంతో మంత్రుల కమిటీ సమావేశమైంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక శాఖ అధికారులు జగన్‌ను కలిశారు.
అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ జిఒ రాగానే ఫిట్‌మెంట్‌, హెచ్‌ఎస్‌ఎ, ,డిఎతో సహా వేతనాలు చెల్లిస్తామన్నారు. ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ చర్చలకు సంఘాలను ఆహ్వానించిందని తెలిపారు. మూడు రోజులుగా ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఉద్యోగ సంఘాల డిమాండ్‌ మేరకు ప్రభుత్వం ఒకే తేదీన వేతనాలు చెల్లిస్తోందని బొత్స వివరించారు. ఉద్యోగ సంఘాల అభిప్రాయం తెలుసుకోకుండా మంత్రుల కమిటీ సిఫార్సులు ఎలా చేస్తుందని ప్రశ్నించారు.
ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇక్కడి నాయకత్వంపై నమ్మకం లేకపోతే ఎలా అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని కించపరిచేలా మాట్లాడితే పరిణామాలు ఉంటాయని గుర్తుంచుకోవాలన్నారు. బాధ్యతగల వ్యక్తులుగా, రాష్ట్ర ప్రజల సంరక్షకులుగా మంత్రులు ఎక్కడా బాధ్యతారాహిత్య ప్రకటనలు చేయడం లేదు. ‘‘ప్రజలు, ప్రభుత్వం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు తమ డిమాండ్లను బయటపెట్టాలని బొత్స పిలుపునిచ్చారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh employees
  • new salaries
  • prc

Related News

    Latest News

    • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd